NLG: కస్తూర్భా బాలికల విద్యాలయాలకు చేయూతనిస్తున్న కస్తూరి ఫౌండేషన్
నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకొని వెంటనే బోర్ వేసి మోటార్ బిగించి,కరెంట్ పోయిన సమయంలో ఇబ్బందులు కలగకుండా ఇన్వెర్టర్ మరియు మైక్ సెట్ ఇచ్చారు. కృతజ్ఞలగా ఈరోజు పాఠశాలలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయ శ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కస్తూరి శ్రీ చరణ్ మాట్లాడుతూ.. గత కొన్ని సం.ల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూరి ఫౌండేషన్ సేవలందిస్తున్నారు. ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
కస్తూరి ఫౌండేషన్ ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా కరోనా సమయంలో పాఠశాలను సానిటైషన్ చేయడం, నిరు పేద కుటుంబాలకు కస్తూరి కళ్యాణమస్తు ద్వారా పెళ్లిళ్లకు పుస్తె, మెట్టలు అందించామన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో మా ఫౌండేషన్ బాలికల విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమాన్నారు.బాలికల కోసం సానిటరీ కిట్స్ ,అంగన్వాడీ భవనాలను మరమ్మత్తు చేయడం ,నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించడం జరుగుతుంది అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కస్తూర్భా విద్యాలయాలను పట్టించుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.నేటి సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని గుర్తు చేస్తూ మీరు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవా చేయాలని విద్యార్థులను కోరారు.
మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు . కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా పాఠశాలోని విద్యార్దినలకు నోట్ బుక్స్,స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్,గ్రామర్ బుక్స్,డిక్షనరీ బుక్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయిలు మల్లికార్జున్, ఫౌండేషన్ సభ్యులు యుగేందర్, సాగర్ల లింగయ్య,కంచర్ల రామకృష్ణ, మహేష్ పిన్నింటి నరేందర్ రెడ్డి,సమ్మిడి నవీన్ రెడ్డి,వీరమళ్ల కార్తిక్,స్థానిక యువకులు కర్నాటి శ్రీహరి, మట్టిపల్లి శ్రీశైలం , నాంపల్లి సతీష్, శ్రీకాంత్, పేసర్ల హరీష్, ముక్కాముల రాజు, రామకృష్ణ మరియు పాఠశాల ఉపాద్యాయులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకొని వెంటనే బోర్ వేసి మోటార్ బిగించి,కరెంట్ పోయిన సమయంలో ఇబ్బందులు కలగకుండా ఇన్వెర్టర్ మరియు మైక్ సెట్ ఇచ్చారు. కృతజ్ఞలగా ఈరోజు పాఠశాలలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయ శ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కస్తూరి శ్రీ చరణ్ మాట్లాడుతూ.. గత కొన్ని సం.ల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూరి ఫౌండేషన్ సేవలందిస్తున్నారు. ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
కస్తూరి ఫౌండేషన్ ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా కరోనా సమయంలో పాఠశాలను సానిటైషన్ చేయడం, నిరు పేద కుటుంబాలకు కస్తూరి కళ్యాణమస్తు ద్వారా పెళ్లిళ్లకు పుస్తె, మెట్టలు అందించామన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో మా ఫౌండేషన్ బాలికల విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమాన్నారు.బాలికల కోసం సానిటరీ కిట్స్ ,అంగన్వాడీ భవనాలను మరమ్మత్తు చేయడం ,నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించడం జరుగుతుంది అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కస్తూర్భా విద్యాలయాలను పట్టించుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.నేటి సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని గుర్తు చేస్తూ మీరు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవా చేయాలని విద్యార్థులను కోరారు.
మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు . కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా పాఠశాలోని విద్యార్దినలకు నోట్ బుక్స్,స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్,గ్రామర్ బుక్స్,డిక్షనరీ బుక్స్ అందజేశారు.

ఇబ్రహీంపట్నం TGRTC డిపో వారు హయత్ నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ ను శుక్రవారం అనాజ్ పూర్ గ్రామ పంచాయితీ వద్ద గ్రామస్థులు గ్రామ పెద్దలు ఇబ్రహీంపట్నం డిపో అధికారులతో కలిసి ప్రారంభించారు. గతంలో బస్ సౌకర్యం ఉండగా రోడ్డు మరమత్తుల కారణంగా నిలిపివేయగా, ఇటీవల అనాజ్ పూర్ గ్రామ పెద్దలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి బస్ ని పున:ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లగొండ పట్టణానికి చెందిన కందిమళ్ల నాగమణి రెడ్డిని, జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు గోపగాని మాధవి సమక్షంలో, రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియమించి నేడు హైదరాబాద్లో నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లాలోని ఎంపీ లు మరియు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లకు, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మరియు మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు అని తెలియజేసారు.
మర్రిగూడ మండలం శివన్నగూడ పెట్రోల్ లో పనిచేస్తున్న చండూరు మండలం దోనిపాముల గ్రామస్తుడు కోటేష్.. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ధోనిపాముల, జోగిగూడెం, నెర్మట, బంగారుగడ్డ, ఇడికూడ, లెంకలపల్లి, సరంపేట, శివన్నగూడ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాదాపు 1500 మందికి పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు.
అయితే పేదరికంలో ఉండి కూడా విద్యార్థుల కోసం తను దాచుకున్న డబ్బులతో విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం పట్ల పలు గ్రామాల ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.
నల్గొండ జిల్లా:
ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. గత సంవత్సరం మన జిల్లా జట్టు ఎంతో అద్భుతంగా ఆటతీరుతో రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం పొందిందని, ఈసారి కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలియజేస్తూ, అసోసియేషన్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.
నల్లగొండ పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి ని, ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేళావత్ నాగేష్ నాయక్, రాజశేఖర్, సాగర్ పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ వివిధ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చొరవతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే సూర్యపేట, బాలేంల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ హాస్టల్లో ప్రిన్సిపాల్ బీర్లు తాగుతుందని డిగ్రీ విద్యార్థినిలను ప్రిన్సిపాల్ వేధిస్తుందని ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారని, అలాగే నల్గొండ జిల్లాలోని "డిండి" మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకులాల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరవడం కలకలం రేపుతుందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న అన్నారు.
దేవరకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల గదులు శుభ్రంగా లేకపోవడం, పురుగుల అన్నం పెట్టడం, వండిన కూరలు సరిగా లేకపోవడం, కొన్ని విద్యార్థి సంఘాలు అడగగా లోపలికి అనుమతుల్లేవని ప్రిన్సిపల్ పొంతన లేని సమాధానం చెపుతూ వారి ఆవకతౌకలు, వారి తప్పిదాలు బయటపడతాయని, ప్రజాసంఘాలను లోపలికి అనుమతించకపోవడం చాలా బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు.
డిండి ఎస్సీ బాలికల హాస్టల్స్ ను తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని వారికి నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే బాలికల హాస్టల్లో పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ ను తక్షణమే విచారణ చేసి సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
గవర్నమెంట్ గురుకుల హాస్టల్స్ లో బాలికలను చేర్పించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. అసలు హాస్టల్లో పిల్లలను ఉంచాలా, ఇంటికి తీసుకెళ్లాలా సందిగ్ధంలో తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని అయోమయంలో తల్లిదండ్రులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులకు పాల్పడుతున్న ఇలాంటి హాస్టల్ ప్రిన్సిపాల్ ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేశారు.
మర్రిగూడ మండల జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తి అయిన సందర్బంగా, సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం లో ఆయన ప్రధాన అనుచరుడు భీమనపల్లి తాజా మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు ఆధ్వర్యంలో అభిమానులు మరియు పార్టీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత 5 సం.లుగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, వారి మన్ననలను పొందారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేసారని కొనియాడారు. ప్రజలకు అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.
మండలంలో అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత పాశం సురేందర్ రెడ్డికే దక్కిందని అన్నారు. భవిష్యత్తులో ఉన్నతమైన పదవిని పొందాలని ఆశించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల ఓర్కింగ్ ప్రెసిడెంట్ నక్క తిరుపతయ్య, అంతంపేట మాజీ ఎంపీటీసీ బంతిలాల్, మల్గిరెడి కృష్ణారెడ్డి, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, జిల్లా కృష్ణ, నారెడ్డి సుధాకర్ రెడ్డి, మునగాల నాగిరెడ్డి, వస్పర్ సంజయ్, ఐతరాజు స్వామి, శ్రీను నాయక్,కడారు యాదయ్య, హనుమరెడ్డి, సురిగి ఎట్టయ్య, సిరికొండ వెంకటయ్య, నడిమింటి శ్రీను, సిలివేరు రమేష్, కర్నాటి మహేష్, కర్నాటి శివ, సూరిగి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Jul 12 2024, 22:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.8k