అంగన్వాడీల వేతనాలు పెంచాలి: ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్
NLG: అంగన్వాడీల వేతనాలు రూ.18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే రూ. 18 వేల వేతనం చెల్లించాలని కోరారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు.
అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.
అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10 ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా పనిచేస్తున్నా నేటికీ గౌరవ వేతనం మాత్రమే పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి, సాయి సుజిత, బి.రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,CH. తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

NLG: అంగన్వాడీల వేతనాలు రూ.18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే రూ. 18 వేల వేతనం చెల్లించాలని కోరారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు.
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి, సాయి సుజిత, బి.రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,CH. తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజావాణి ని ప్రచార ఆర్బాట కార్యక్రమంగా మార్చకుండా సమస్యలు పరిష్కరించే వేదికగా ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అధికారులు మారినప్పుడల్లా కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. తర్వాత వాటిని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉందని ఇప్పుడు పెట్టే ప్రజావాణి కూడా ప్రజలు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలను అధికారులు స్వీకరించి టైం బౌన్డ్ ప్రకటించి పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని కోరారు.
దరఖాస్తులు తీసుకొని వాటి పరిష్కారం చేయకుండా ఆర్భాట కార్యక్రమాన్ని దీని నిర్వహిస్తే రాబోయే కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
గ్రామాలలో భూమి, పెన్షన్, రేషన్ కార్డ్, ఇల్లు ఇళ్ల స్థలాలు లాంటి వ్యక్తిగత సమస్యలతో పాటు రోడ్లు కరెంటు మురికి కాలువలు తదితర సామూహిక సమస్యలు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వీటికి ప్రభుత్వం పరిష్కారం చూపకుండా విధివిధానాలు ప్రకటించకుండా అధికారులు దరఖాస్తులు తీసుకుంటే ఏం ప్రయోజనం ఉంటదో అధికారులు చెప్పాలని కోరారు.
NLG: మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించే దిండి ఎత్తిపోతల,ఉదయ సముద్రం, నక్కలగండి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరతగతిన పూర్తి చేసి.. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు నీరు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గం సిపిఐ మండల కార్యదర్శిల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయినట్లయితే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గలలో కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.
రైతులను దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టులపై కాలయాపన చేయకుండా ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మాటల గారెడితో నలగొండ జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యకుండా కాలయాపన చేసి నల్లగొండ జిల్లా రైతులను మోసం చేశారని విమర్శించారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బోలుగురి నరసింహ, తీర్పురి వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శులు చాపల శ్రీను, ఈ. బిక్షం రెడ్డి, దుబ్బాక భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా, కనగల్ ఎక్స్ రోడ్ లో బిజెపి శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆర్టికల్ 370 ని రద్దు చేయాలని, ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహి చలేగా నహి చలేగా అని పిలుపునిచ్చిన గొప్ప జాతీయవాది అని కొనియాడారు.
మండల అధ్యక్షులు పులకరం బిక్షం, మండల ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న, ఉపాధ్యక్షులు పంతంగి సైదులు, మాధగోని ఏడుకొండలు, మండల కోశాధికారి నీలకంఠ వెంకన్న, పాలకూరి సైదులు, బూత్ అధ్యక్షులు జక్కల నవీన్, కందుల నాగబాబు, బొమ్మగంటి లింగస్వామి, వజ శీను తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం, గోదావరిఖని పట్టణానికి చెందిన నగునూరి శంకర్ ను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నగునూరి శంకర్ మాట్లాడుతూ.. నా పై నమ్మకంతో అప్పజెప్పిన భాధ్యతలను జాతి అభివృద్ధి కోసం ఎస్సీ రిజర్వేషన్ కోసం, హక్కుల కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తానని, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
రాష్ట్ర,జిల్లా కమిటీ తరపున కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు నగునూరి శంకర్ కు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మడికొండ ఓదక్క , రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కాసర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి మునిగంటి సంపత్ పాల్గొన్నారు.
ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లు గా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్.

ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య కార్యక్రమంలో పాల్గొని తిరుపతయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్, లెంకలపల్లి ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, చాపల రవి, పెంబల్ల గిరి, నందికొండ లింగా రెడ్డి, మేతరి శంకర్, తదితరులు ఉన్నారు. 
నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్ర పవార్ ను శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి మిరియాల యాదగిరి, నల్గొండ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీకి మొక్కను బహుకరించారు. యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బ్యాంకు సంబంధిత అంశాల పైన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మేనేజర్ రూప శ్రీ, క్యాషియర్ చిన్న నరసింహులు మాట్లాడుతూ.. క్రాప్ లోన్ లు సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకుంటే 7% ఇంట్రెస్ట్ మాత్రమే పడుతుందని, సమయం మించి పోతే రెట్టింపు ఇంట్రెస్ట్ పడుతుందని, సిబిల్ స్కోర్ తగ్గుతుందని గవర్నమెంట్ ఇచ్చే 3% రాయితీ ఉండదని తెలిపారు.
అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ల గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 
Jun 25 2024, 14:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.9k