మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి ఆర్ వెంకట్ రెడ్డి యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై 6వ తరగతి చదువుచున్న విద్యార్ధి సీహెచ్ ప్రశాంత్(12) గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయని, ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామంలో ప్రశాంత్ తల్లిదండ్రులను, తాత, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలను కలిసి ఓదార్చి, వారికి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారని, ఐతే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భువనగిరి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన తెలంగాణా రాష్ట్రం లో మొదటిదీ కాదు చివరిదీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ
రాష్ట్రం లో సుమారు 982 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాలల్లో దాదాపు 5,58,923 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. కొన్ని గురుకులాల దుస్థితి, విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉన్నాయని , అట్టహాసంగా గురుకులాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాటిని జూనియర్ కాలేజీలుగా అఫ్ గ్రేడ్ చేయడం చేసారు కానీ ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను, మౌలిక వసతుల కల్పన ను గాలికి వదిలి వేసారని ఆయన ఆరోపించారు.
అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం
నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు బడ్జెట్ ను పెంచాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో అనుసరించాల్సిన ప్రమాణాలపై నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా తగిన పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని , ప్రత్యేక కమిషన్ ను వేసి గురుకుల పాఠశాలల తీరును పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకురాలు బుద్ధుల సునీత లు ఉన్నారు.


 
						




 కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాటిని బూతులు బూత్ కమిటీలు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో మహిళలను ప్రజలను చైతన్యపరిచి భువనగిరి నియోజకవర్గం నుండి గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు గత అసెంబ్లీ ఎన్నికలలో కార్యకర్తలు కష్టపడి అహర్నిశలు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు అదే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు కోరారు ఈ కార్యక్రమంలో సుక్క స్వామి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎగ్ సర్పంచ్ మరియు పులిగిల్ల బాలయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గొల్లపెల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాటిని బూతులు బూత్ కమిటీలు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో మహిళలను ప్రజలను చైతన్యపరిచి భువనగిరి నియోజకవర్గం నుండి గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు గత అసెంబ్లీ ఎన్నికలలో కార్యకర్తలు కష్టపడి అహర్నిశలు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు అదే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు కోరారు ఈ కార్యక్రమంలో సుక్క స్వామి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎగ్ సర్పంచ్ మరియు పులిగిల్ల బాలయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గొల్లపెల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

 

 వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారు, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ గారు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గారు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ గారు, టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారు, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ గారు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గారు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ గారు, టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
 
 
 
 
 

 
 

Apr 18 2024, 22:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
44.1k