ఈనెల 19న నామినేషన్ కి వేలాదిగా తరలిరావాలి: ఎండి జహంగీర్ సిపిఎం భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి
ఈనెల 19న జరుగు నామినేషన్ కు వేలాదిగా తరలిరావాలని సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక సమస్యలు తిష్టవేశాయని గత అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మరిచిపోయి కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డారని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు మరిచి పరిపాలన సాగించాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సూచికగా కావాలని నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని వారు అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నేటికీ పరిష్కారం గాని అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రజా ఉద్యమాలు జరిగిన అధికార ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అరకోర వసతులతో సరైన వైద్యం అందించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు సమస్యల పరిష్కారం కోసం సిపిఎంకు ఓటేసి గెలిపించాలని, 19న జరిగే నామినేషన్ కు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, శాఖ కార్యదర్శి దండు గిరి, సీనియర్ నాయకులు దండు యాదగిరి, నాయకులు దండు పద్మారావు, ఆడెపు గిరి, మాయ రాణి, దండు స్వరూప, దండు ధనలక్ష్మి, నాగరాణి, స్వాతి, బట్టు లక్ష్మి, బట్టుపల్లి నవీన్ కుమార్, ఎనబోయిన లింగం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో చైన్ స్నాచర్స్ శుక్రవారం రాత్రి ఓల్డ్ సిటీ లో డాబా పై నిద్రిస్తుండగా, మేకపోతుల స్వామి (హెడ్ కానిస్టేబుల్) భార్య నర్మద పై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు మరియు మూడు తులాల నల్లపూసల దండ ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబంలో సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ఇటీవల భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గొలుసు దొంగలు.




భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
.
Apr 13 2024, 16:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.4k