భువనగిరి పార్లమెంట్ లో పోటీ చేస్తున్న సిపిఎం ను గెలిపించండి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపు
![]()
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సిపిఎంను గెలిపించి మతోన్మాద బిజెపిని ఓడించాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి, సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ పిలుపు నిచ్చినారు. శనివారం సుందరయ్య భవన్, భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల జనరల్ బాడీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య అద్యక్షతన జరుగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యండి. జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ
![]()
కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడి ప్రభుత్వం దేశసంపదను మొత్తం అధానీ అంభాని లాంటి కార్పొరేట్ శక్తులకు, దోపిడీ దారులకు దోచిపెడుతున్నారనీ విమర్శించారు. మరోప్రక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రవేట్ పరంచెస్తు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నార అన్నారు. మరో పక్క ప్రజలపై అనేక భారాలను మోపుతూ ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు. పది సంవత్సరాల బిజెపి పాలనలో మతఘర్షనలు సృష్టిస్తుా, విభజన రాజకీయాలు చేస్తు భారత రాజ్యాంగాన్ని, ప్రజలకు హక్కులను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చిత్తుచిత్తుగా ఓడించాలని జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న యండి.జహంగీర్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరినారు. జహంగీర్ గారు గత 35 సంవత్సరాలు ఎర్రజెండా చేతబట్టి కార్మికుల కర్షకుల వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం, తాగు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం, యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధికి కోసం అనేక పోరాటాలతో పాటు పాదయాత్రలు కూడా చేసి ప్రజల పక్షాన నిలిచిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నదని ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే, ప్రజల బాధలు పోవాలంటే ప్రజల పక్షాన నిలబడే ప్రజా నాయకుడు జహంగీర్ గారి సుత్తి కొడవలి సుక్క గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, ఎల్లంల వెంకటేష్ , మోటే ఎల్లయ్య, వివిధ గ్రామాలకు సంబంధించిన శాఖ కార్యదర్శులు నరాల చంద్రయ్య, కూకుట్ల కృష్ణ , బోడ ఆంజనేయులు, కళ్లెం లక్ష్మీనరసయ్య తోపాటు యండి.జహంగీర్, కడారి కృష్ణ , మద్యపురం బాల్ నర్సింహ్మ, మచ్చ భాస్కర్, ఉడుత విష్ణు, కే. వెంకటేష్, దయ్యాల మల్లేష్, మాణిక్యం, దానయ్య, అంజయ్య, గోపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామం లో తుమ్మల నర్సయ్య సేవ సమితి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు దమేర లక్షమ్మ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కిసాన్ సేల్ జిల్లా నాయకులు బండారు నర్సింహా రెడ్డి మండల నాయకులు తుమ్మల శ్రీనువాస్ మాజీ ఎంపీటీసీ పోలేపక చంద్రయ్య మత్స్యగిరి గుట్ట మాజీ డైరెక్టర్ కాసిరాబోయిన లింగయ్య యాదవ్ మండల ఓబీసీ అధక్షుడు చిల్కమర్రి కనకచారి హైస్కూల్ మాజీ చైర్మన్ జినుకాల మల్లేశం హైస్కూల్ ప్రైమరి మాజీ చెర్మన్ ఆవుల అంజయ్య తుమ్మల సంతోష్ బండారు మైహిపాల్ రెడ్డి కోడితల లక్ష్మయ్య కాసిరాబోయిన నర్సింహా వేముల ఎట్టయ్య పిట్టల సుధాకర్ వెలిమినేటి సంతోష్ బత్తిని వెంకటేష్ కొయ్యగుర మధు మీసాల మత్సగిరి నల్ల రామచంద్రు పోలేపక మహేష్ ఎర్ర సాయి మరియు తదితరులు పాల్గొన్నారు

మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరీర ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులు అతి చిన్న వయసులో తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారని అన్నారు నేటి యువత వారి ఆశ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజానికి సామాజిక స్పృహ అలవర్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలలో యువతి, యువకులు అనేక రంగాలలో ముందుండాలని ఈ సందర్భంగా అన్నారు... అనంతరం టాస్ వేసి ఆటను ప్రారంభించి యువతను మరింత ఉత్తేజపరిచారు.
లను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం గుర్తింపు ఇవ్వాలని అన్నారు పాలకులు క్రీడారంగాన్ని విస్మరిస్తున్నారు ఇప్పటికైనా క్రీడలకు సరైన నిధులు, బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఆర్గనైజర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ,సిపిఐ మండల నాయకులు బుర్ర మల్లేశం, కొడిత్యాల కర్ణాకర్,కనకాచారి, క్రీడాకారులు రవ్వ శివ,జోల మల్లేష్, ఆలకుంట్ల శ్రవణ్, చిలకమర్రి బన్నీ, తదితరులు పాల్గొన్నారు.








యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.
మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Mar 23 2024, 17:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k