/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz YSR EBC Nestham: అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా: సీఎం జగన్‌.. Yadagiri Goud
YSR EBC Nestham: అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా: సీఎం జగన్‌..

•లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌

ప్రకాశం జిల్లా: 2014-19 మధ్య ఇంటింటికి ఎంత మంచి జరిగింది, మా పాలన హయాంలో జరిగిన మంచి ఎంత బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాల బ్యాచ్‌ను నమ్మకండి. ఐదేళ్ల పాలనలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని బాబుకు ఏం మంచి చేశావని మా ఇంటి ముందు స్టిక్కర్‌ అంటిస్తానంటారని చంద్రబాబుని అడగండి.. రుణ మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారు’’ అని సీఎం మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  జమ చేశారు.

Firing at Military Station: పంజాబ్‌లో కలకలం.. బఠిండా మిలిటరీ స్టేషన్‌లో దాడి..

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab)లో ఓ సైనిక శిబిరంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌ (Bathinda Military Station)లో ఆగంతకులు కాల్పులు జరిపారు..

ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పులు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు..

ఈ ఘటన సైనిక స్థావరం (Bathinda Military Station)లోని శతఘ్ని యూనిట్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్లు భావిస్తున్నారు. ఆ ప్రదేశంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. పౌర దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, 28 తూటాలు అదృశ్యమయ్యాయి. ఈ ఘటనలో వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. పది మందికి గాయాలు

ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో తారాజువ్వ పడటంతో సమీపంలోని గుడిసెకు నిప్పు అంటుకుంది.

దీంతో గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సిరిసిల్ల జిల్లాకు మళ్లీ రానున్న మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా:

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి పర్యటించనున్నారు. ఈ పర్యటలో భాగంగా

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 9:45 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం, తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చేరుకుంటారు.

ఉదయం 10గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

నేడు ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా ఇఫ్తార్ విందు

•సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్: ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా ఇఫ్తార్ విందు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముస్లిం ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

చాపెల్ రోడ్, నాంప‌ల్లి నుంచి వ‌చ్చే వాహ‌న‌దారులు బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ఎస్‌బీఐ గ‌న్‌ఫౌండ్రీ నుంచి బ‌షీర్‌బాగ్ ఫ్లై ఓవ‌ర్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను చాపెల్ రోడ్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. ర‌వీంద్ర భార‌తి, హిల్ ఫోర్ట్ నుంచి బీజేఆర్ విగ్ర‌హం వైపు వెళ్లే వాహ‌న‌దారుల‌ను సుజాత స్కూల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

బ‌షీర్‌బాగ్ ఫ్లై ఓవ‌ర్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద కుడి వైపున‌కు అనుమ‌తించ‌రు. ఎస్‌బీఐ గ‌న్‌ఫౌండ్రీ మీదుగా చాపెల్ రోడ్ వైపు వెళ్లాలి.

నారాయ‌ణ‌గూడ సెంటిన‌రీ నుంచి బ‌షీర్‌బాగ్ వైపు వ‌చ్చే వెహిక‌ల్స్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ వ‌ద్ద హిమాయ‌త్‌న‌గ‌ర్ వై జంక్ష‌న్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. కింగ్ కోఠి, బొగ్గుల‌కుంట నుంచి బ‌షీర్‌బాగ్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను కింగ్ కోఠి క్రాస్ రోడ్స్ వ‌ద్ద తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.

మంగళగిరి లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు

• చంద్రబాబు నాయుడు ప్రసంగం:-

• రంజాన్ మాసం అంటే క్రమశిక్షణ, సేవ. ఖురాన్ ఆవిర్భవించిన నెలకు గుర్తుగా రంజాన్ పండుగ చేసుకుంటాం.

• నేను 40 ఏళ్లుగా రంజాన్ పండుగ లో భాగస్వామిని అవుతున్నా

• నాడు సిఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ

• ఉర్ధూను రెండో అధికార భాషగా చేసిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం

• పాలనలో సైతం ఉర్దూని తీసుకుని వచ్చి ప్రోత్సహించిన పార్టీ టీడీపీ

• మైనారిటీ వర్గంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు 1985లోనే నాడు ఎన్టీఆర్ మైనారిటీ కార్పొరేషన్ తీసుకువచ్చారు.

• ముస్లిం సోదరుల కోసం హైదరాబాద్ లో శాసన సభ ఎదురుగా హజ్ హౌస్ కట్టి సదుపాయలు కల్పించి మక్కా యాత్రకు పంపింది మనమే.

• హస్ హౌస్ ఎత్తుపై నాడు సమస్య వస్తే...ప్రత్యేక అనుమతులు ఇచ్చి దాన్ని అందుబాటులోకి తెచ్చాం

• 2014 తరువాత ఎపిలో విజయవాడ, కర్నూల్ లో హజ్ హౌస్ లు కట్టాం. నవ్యాంధ్రలోనూ ఉర్థూ యూనివర్సిటీ తెచ్చాం

• ఇమాంలకు, మౌజుంలకు గౌరవ వేతనం ఇచ్చిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం

• దుల్హన్ అనే పథకం ద్వారా పేద ముస్లిం యువతులకు ఆర్థిక సాయం చేశాం. నాడు 50 వేలు ఇచ్చాం...టీడీపీ అధికారం లోకి వచ్చి ఉంటే నేడు రూ. లక్ష ఆర్థిక సాయం ఇచ్చేవాళ్లం.

• ఈ ప్రభుత్వం దుల్హన్ పథకం పై అనేక ఆంక్షలు పెట్టింది. 32 వేల మందికి రూ.163 కోట్ల ఆర్థిక సాయం దుల్హన్ పథకం కింద అందించాం.

• 525 మంది ముస్లిం విద్యార్థులను విదేశాలకు పంపి చదివించాం.

• మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10 లక్షల మందికి ఆర్థిక సాయం అందేలా చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పించాం.

• వైసీపీ ప్రభుత్వం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మాట తప్పింది. ఈ ప్రభుత్వంలో ముస్లిం వర్గంపై దాడులు పెరిగాయి.

• ముస్లిం లు అంతా రాష్ట్ర భవిష్యత్ కోసం అల్లాను ప్రార్థించాలి. తెలుగు దేశం రావాలి...రాష్ట్రం అభివృద్ది కావాలి.

• రంజాన్ సందర్భంగా ఇఫ్లార్ లో పాల్గొనడం నా అదృష్టం గా భావిస్తున్నా.

Karnataka elections : రైతులను పెళ్లి చేసుకునే యువతులకు జేడీఎస్ భారీ తాయిలం

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం జేడీఎస్ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు ముస్లింలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామని హామీలను ఇవ్వడం చూశాం..

ఇప్పుడు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి రైతుల కోసం ఓ తాయిలాన్ని ప్రకటించారు. వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు.

కోలార్‌లోని పంచరత్న ర్యాలీలో కుమార స్వామి మాట్లాడుతూ, వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు. రైతుల పిల్లలకు పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహించడం కోసం వధువులకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలన్నారు. రైతుల పిల్లలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు..

బలగం మొగిలయ్యను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం దగ్గరుండి హైదరాబాదుకు పంపించిన ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్...

బలగం సినిమాతో తనదైన శైలిలో ప్రజలను మెప్పించిన కళాకారుడు బలగం మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ సంరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారిని పరామర్శించారు.

మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,జిల్లా మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తాను ఎప్పటికప్పుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నామని

నేడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ కు ఎమ్మెల్యే నరేందర్ దగ్గరుండి అంబులెన్స్ లో పంపించి ఆర్థికసాయంతో పాటు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.

మొగిలయ్య ఆరోగ్యం కుడుటపడి ఆయురారోగ్యాలతో క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే కోరుకున్నారు

బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి

మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకుని బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 

 ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే అణగారిన వర్గాల అసమానతలను రూపుమాపేందుకు అది కేవలం విద్య ద్వారానే సాద్యం అని భావించి అక్షరాలను ఆయుధంగా చేసుకుని వారికి విద్యనేర్పిన గొప్ప మహనీయుడని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని నిర్ణయుంచుకుని అణిచివేయబడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షరజ్యోతులు వెలిగించిన చైతన్య మహానీయుడు అని అన్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా అన్నివర్గాల ప్రజలం అడుగులు వేసి సాధించుకొనే విధంగా ప్రయత్నం చేయాలన్నారు.

అంతేకాకుండా మహిళలకు విద్య ద్వారానే విముక్తి కలుగుతుందని భావించి తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయించి ఎంతో మంది మహిళలకు విద్యనేర్పిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిభా పూలే అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే జయంతి రోజున అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, కత్తుల సన్నీ తదితరులు పాల్గొన్నారు.

ఉరుమడ్ల గ్రామంలో పల్లె పల్లెకు, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమం

•ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గo చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పల్లె పల్లెకు ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా చిట్యాల మండల కోఆర్డినేటర్స్ గుండెబోయిన నరసింహ ముదిరాజ్ నూతి విశ్వతేజ ముదిరాజ్ గార్ల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొని మాట్లాడారు పల్లె పల్లెకు ఓబీసీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు గురించి తెలియజేయడం జరిగింది.

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 102 వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కి రాజ్యాంగ హోదాను అందిస్తుందన్నారు, 105వ రాజ్యాంగ సవరణ చట్టం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాను రూపొందించే హక్కు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అని తెలియజేశారు, ఓ బి సి ఆదాయ క్రిమిలేయర్ సవరణ 2017లో ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయాన్ని రూపాయలు ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచారన్నారు.

27 ఓబిసి మంత్రులు మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని, PSU లో ఓ బీసీలకు రిజర్వేషన్లు ఓబీసీ వర్గాల సంక్షేమం సాధికారతకు సంబంధించి వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అవకాశాలను ప్రయత్నిస్తుందన్నారు, సుపరిపాలన జనరల్ కేటగిరిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఓబీసీ కోటాలో పరిగణించే తప్పుడు విధానాన్ని రద్దుచేసి జనరల్ కేటగిరీలో అర్హత సాధించిన ఓబీసీ అభ్యర్థిని జనరల్ అభ్యర్థిగా పరిగణిస్తారు అని తెలియజేశారు.

ఓబిసి విద్యార్థులకు సైనిక్ నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్లు, ఓబిసి విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఓబీసీల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ అందిస్తుందన్నారు, ఓ బి సి విద్యార్థుల కోసం జేఆర్ఎఫ్ స్థాయి జాతీయ ఫెలోషిప్ నెలకు రూ. 31,000, ఎస్ఆర్ఎఫ్ స్థాయి వారికి నెలకు రూ. 35000 అందజేస్తుందన్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ పథకం కింద విదేశీ చదువుల కోసం విద్య రుణాలు తీసుకునే ఓబీసీ విద్యార్థులకు వడ్డీ రాయితీని నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది దాని బడ్జెట్ కేటాయింపులను పెంచిందన్నారు, నీట్ రిజర్వేషన్, కొత్త విద్యా విధానం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్, పోషన్ అభియాన్ లేదా జాతీయ పోషకాహార మిషన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.

నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓబీసీల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సబ్ వెన్షన్ స్కీమ్ , ఈపీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన వంటి ఎన్నో ప్రయోజనకర పథకాలను ఓబీసీలకు అందజేస్తున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలుస్తుంది అన్నారు, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో బీసీలను 9 ఏళ్లలో అన్ని రంగాల్లో అణచివేసింది అన్నారు.

రాజకీయంగా, ఆర్థికపరంగా, విద్యాపరంగా, సామాజిక న్యాయం పరంగా, ఉద్యోగ, ఉపాధి పరంగా, ఇలా అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్న బీసీ సామాజిక వర్గం ఒక్కసారి ఆలోచన చేయాలని కేసిఆర్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా బిజెపి దేశానికి ఒక బీసీ నాయకుడిని ప్రధానిగా చేసిందన్నారు, రాష్ట్రంలో బీసీలకు సముచిత నాయకత్వం ఇచ్చింది భారతీయ జనతా పార్టీనే తెలంగాణ బీసీల ఆశలు, ఆశయాలు, రాజ్యాధికారం, ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్న అది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం. ఒక్కసారి రాష్ట్రంలో బిజెపికి అధికారాన్ని ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఈదుల పవన్, యువజన నాయకులు మర్రి హరీష్ రెడ్డి, కాటo సందీప్ యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్, నరసింహ, రాములు, సత్యం, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.