/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు.. Yadagiri Goud
ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు..

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు..

రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2(PSLVD2) రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు..

నింగిలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు:

సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్‌.

ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా టెస్ట్‌ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.

హైదరాబాద్ లో నేటి నుంచి వివేకా కేసు విచారణ-సీబీఐ కోర్టు ముందుకు ఐదుగురు నిందితులు..

హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగే వైఎస్ వివేకా కేసు విచారణకు హాజరు కావాలని ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు పంపింది. ఇందులో ఇప్పటికే జైల్లో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన సీబీఐ కోర్టు.. బెయిల్ పై ఉన్న మరో ఇద్దరు నిందితులుఎర్ర గంగిరెడ్డి, దస్తగిరికి సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఐదుగురు సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు. వీరంతా హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు తొలిసారి హాజరవుతున్నారు..

వివేకా కేసు సీబీఐ విచారణ మారిన నేపథ్యంలో సీబీఐ దూకుడు కూడా పెంచింది. ఇంతకాలం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ పిలిపించి ప్రశ్నించిన సీబీఐ..

ఆ తర్వాత పులివెందులకు సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ ను పిలిపించి విచారించింది. ఇవాళ సీబీఐ కోర్టు విచారణ ఆధారంగా మరిన్ని చర్యలకు సీబీఐ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే ఈ కేసుతో తమను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల వంటి వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిళలు మసీదుకి వచ్చి ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తారు

మహిళలు మసీదులో నమాజ్ చేయవచ్చని ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో పేర్కొంది

మహిళలు మసీదుకు వచ్చి ప్రార్థనలు చేయకూడదా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ప్రకారం, మసీదులో ప్రార్థనలు చేయడానికి మహిళలకు అనుమతి ఉంది. వాస్తవానికి మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని ఏఐఎంపీఎల్‌బీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదులోకి ప్రవేశించడానికి స్వేచ్ఛ ఉందని, మసీదులో ప్రార్థనలు చేసే హక్కును వినియోగించుకోవాలా వద్దా అనేది వారి ఇష్టం అని బోర్డు పేర్కొంది. దీనితో పాటు, ఇస్లాంలో మహిళలు రోజుకు ఐదుసార్లు సామూహికంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పబడింది.

AIMPLB కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఈ సమాచారం ఇచ్చింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళ్లేందుకు సంబంధించిన పిటిషన్‌కు సంబంధించి ఈ అఫిడవిట్ దాఖలు చేయబడింది. న్యాయవాది MR శంషాద్ ద్వారా దాఖలు చేయబడిన అఫిడవిట్, ప్రార్థనా స్థలాలు (ప్రస్తుత కేసులో ఉన్న మసీదులు) పూర్తిగా ప్రైవేట్ సంస్థలు మరియు మసీదుల 'ముత్తవలీలు' (నిర్వాహకులు) నియంత్రణలో ఉన్నాయని పేర్కొంది.

AIMPLB అనేది నిపుణుల సంఘం అని, దానికి ఎలాంటి అధికారాలు లేవని, ఇస్లాం సూత్రాలపై సలహాలు మాత్రమే జారీ చేయగలదని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం అనుచరుల మత గ్రంథాలు, సూత్రాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం సూత్రాల ప్రకారం ముస్లిం మహిళలు ఇంట్లో నమాజ్ చేసినా లేదా మసీదులో నమాజ్ చేసినా వారికి సమానమైన సవాబ్ (మెరిట్) లభిస్తుందని పేర్కొంది.

భారతదేశంలోని మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆరోపించిన నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని మరియు దీనిని చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫరా అన్వర్ హుస్సేన్ షేక్ 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మీకు తెలియజేద్దాం. ఈ పిటిషన్ మార్చిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

పెను విషాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం..

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా అందులోకి జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

మొదట ఒక వ్యక్తి ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేయడానికి దిగగా..కాలు జారి లోపల పడ్డాడు.

దానిని గమించిన మిగతా కార్మికులు ఒక్కొక్కరు ట్యాంక్ లోకి దిగారు. దీనితో ట్యాంకర్ లో ఊపిరాడకపోవడంతో వీరంతా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు కాగా ఇద్దరు పెద్దాపురం మండలం పులివేరు వాసులుగా తెలుస్తుంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కుల లో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలి

•PDSU కళ్యాణదుర్గం డివిజన్ కార్యదర్శి:పూలగుర్ల వినయ్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టంలోని రాయలసీమ హక్కుగా వచ్చినటువంటి అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి 2016 నవంబర్ లో డీపీర్ లో చెప్పిన విదంగా తక్షణ కర్తవ్యం గా మొత్తం 902 కోట్లకు పైగా నిధులను కేటాయింపు అవసరమని ఈ నిధులను దశల వారీగా కేటాయిస్తామని డీపీర్ ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామం దగ్గర రైతుల నుంచి 495 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. ఇందులో నూతన భవనాలను నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రహరీ గోడల నిర్మించడానికి 9 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు దానిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు.కనుక, రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో నూతన భవనాలను నిర్మించుటకు బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు యూనివర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి చదువు కొరకు వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.

నిజానికి,టీచింగ్ స్టాప్ 49 మంది,నాన్ టీచింగ్ స్టాప్ 51 మంది అవసరం ఉన్నా ఇంతవరకు భర్తీ చేయలేదు.2016 నవంబర్ కేంద్రం సమర్పించిన డీపీర్ లో చెప్పిన విధంగా 2023 కంతా పూర్తిగా భవనాలు నిర్మించి, నూతన భవనాల్లో అడ్మిషన్లు చేపట్టి, బోధన తరగతులు ప్రారంభం అవ్వాలి. కానీ, ఇప్పటి వరకు అసలు రెగ్యులర్ రిజిస్టార్ ని కూడా నియమించ లేదంటే రాయలసీమ పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కనుక, పి డి ఎస్ యు,గా ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కండస్తున్నాము, రానున్న కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి నూతన భవనాన్ని పూర్తి చేయాలి, పూర్తిస్థాయిలో స్టాప్ ని రిక్రూట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము నిధులు కేటాయింపు జరగనియెడల కచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకొని , PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అనీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

ఇంటర్‌ ఫస్టియర్‌.. 70% సిలబస్‌ నుంచే ఎంసెట్‌ ప్రశ్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు.

ఎంసెట్‌ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్‌ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్‌ ఉంటుందన్నారు.

నువ్వా.. నేనా!

•ఆస్ట్రేలియాతో భారత్‌ ఢీ

•నేటి నుంచే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ

•ఉదయం 9.30 నుంచి

ప్రపంచాన్ని జయించినా భారత్‌లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదన్న అసంతృప్తి కసిని పెంచుతుండగా.. సూపర్‌ ఫామ్‌, బలమైన జట్టు ఆత్మవిశ్వాసాన్నిస్తుండగా.. సమరోత్సాహంతో ఆస్ట్రేలియా..!

కంగారూల గడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు నెగ్గడం.. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు, సానుకూల పరిస్థితులు, స్టార్‌ ఆటగాళ్లిస్తున్న ధీమాతో పోరాటానికి సై అంటూ టీమ్‌ఇండియా..!

రసవత్తర సమరానికి వేళైంది. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుండగా సమవుజ్జీలుగా కనిపిస్తోన్న జట్ల మధ్య బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ తొలి టెస్టు నేటినుంచే. విజయంతో శుభారంభం చేసి సిరీస్‌లో పైచేయి సాధించాలన్నది రెండు జట్ల పట్టుదల. మరి స్పిన్‌కు విపరీతంగా సహకరిస్తుందని భావిస్తున్న పిచ్‌పై పైచేయి ఎవరిదో! చూడాలి.. అంచనాలనుందుకునేదెవరో, బోల్తాకొట్టేదెవరో?

పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెప్టెన్‌గా తన అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తుపై కన్నేసిన భారత్‌కు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఆస్ట్రేలియాకు మధ్య బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌ గురువారం ఆరంభమవుతోంది. ఎన్నో మలుపులు, ఎన్నో ఆశ్చర్యకర అంశాలు, ఆటగాళ్ల కెరీర్‌ గమనాన్ని నిర్దేశించే ప్రదర్శనలు ఉండే అవకాశమున్న ఈ సిరీస్‌ క్రికెట్‌ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతోంది. పేలవ ప్రదర్శన చేస్తే ఈ సిరీస్‌ తర్వాత కొందరి కెరీర్‌లు ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్‌, ఆస్ట్రేలియా నాగ్‌పుర్‌లో మొదటి టెస్టుకు సిద్ధమయ్యాయి. కొందరు మాజీలు కంగారూలవైపు మొగ్గు చూపుతున్నా సిరీస్‌లో ఏ జట్టూ ఫేవరెట్‌గా బరిలోకి దిగట్లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఈ సిరీస్‌ మరింత కీలకం. కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే రోహిత్‌సేన డబ్ల్యూటీసీ టైటిల్‌ సమరానికి అర్హత సాధించగలుగుతుంది.

స్పిన్నే ఆయుధంగా..: సొంతగడ్డపై ఆడుతుండడం, స్పిన్‌ బలం టీమ్‌ఇండియాకు సానుకూలాంశాలే. కానీ కీలక బౌలర్‌ బుమ్రా లేకపోవడం లోటే. రోహిత్‌ శర్మ నాయకత్వ పటిమకు ఈ సిరీస్‌ సవాలే. భారత బ్యాటింగ్‌ చూడడానికి బాగానే కనిపిస్తున్నా ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే బ్యాటర్లు సామర్థ్యం మేర రాణించాలి. కోహ్లి ఇటీవల కాలంలో ఫామ్‌ను అందుకున్నట్లే కనిపిస్తున్నా.. ఆస్ట్రేలియాపై పరుగుల వేటలో విజయవంతం కావాలంటే తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సివుంది. రోహిత్‌ కూడా మంచి ఫామ్‌ను అందుకోవడం కీలకం. తుది జట్టు కూర్పు టీమ్‌ఇండియాకు సవాలే. రోహిత్‌కు జోడీగా శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌లో ఎవరిని ఓపెనర్‌గా పంపుతారన్నది ఆసక్తికరం. అంతగా ఫామ్‌లో లేకపోయినా రాహుల్‌కే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ గిల్‌ ఓపెనింగ్‌కు రాకపోతే ఆరో స్థానంలో రావచ్చు. కానీ అక్కడ అతడితో సూర్యకుమార్‌ పోటీ పడుతున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ గమనాన్ని మార్చగల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ దూరం కావడం భారత్‌కు దెబ్బే. అతడి గైర్హాజరీలో పరిస్థితులకు జట్టు ఎలా సర్దుకుపోతుందన్నది మ్యాచ్‌లో కీలకం. పంత్‌ స్థానాన్ని కేఎస్‌ భరత్‌ భర్తీ చేయొచ్చు. అతడి వికెట్‌కీపింగ్‌ నైపుణ్యంపై ఎలాంటి సందేహలు లేవు కానీ.. బ్యాటర్‌గా నాణ్యమైన ఆసీస్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నదే ప్రశ్న. ఇక స్పిన్నే ప్రధాన ఆయుధంగా సిరీస్‌కు సిద్ధమైన భారత్‌.. ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. జడేజా, అశ్విన్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌లలో ఎవరు అవకాశం దక్కించుకుంటారో చూడాలి. సిరాజ్‌, షమి పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు.

కసితో కంగారూలు: స్వదేశంలో గత రెండు సిరీస్‌లలో (2018-19, 2020-21) భారత్‌ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్‌ను భారత్‌లో ఓడించి లెక్క సరి చేయాలనుకుంటోంది. భారత్‌లో సిరీస్‌ విజయం యాషెస్‌ కన్నా మిన్న అని స్టీవ్‌ స్మిత్‌ ఇప్పటికే చెప్పాడు. 1969 నుంచి పది సార్లు భారత్‌లో పర్యటించిన కంగారూ జట్టు.. ఒకే ఒక్కసారి టెస్టు సిరీస్‌ గెలవగలిగింది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్నానని భావిస్తోన్న ఆసీస్‌.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. విపరీతంగా తిరిగే పిచ్‌లు ఉంటాయన్న అంచనాతో బాగానే సన్నద్ధమైంది. కమిన్స్‌ నేతృత్వంలోని ఆ జట్టు సిరీస్‌ ఆశలు నెరవేరాలంటే మాత్రం అసాధారణంగా రాణించాల్సిందే. సవాళ్లను అధిగమించాలంటే శ్రమించాల్సిందే. కేవలం అశ్విన్‌పైనే దృష్టిపెడితేనే సరిపోదు. అయితే ఖవాజా, స్మిత్‌, లబుషేన్‌, వార్నర్‌ రూపంలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోనే బ్యాటర్లు జట్టులో ఉండడం కంగారూలకు గొప్ప బలం. ముఖ్యంగా ఖవాజా, స్మిత్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. లైయన్‌తో ఆస్టన్‌ అగర్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోవచ్చు. పేస్‌ విభాగానికి కమిన్స్‌ నాయకత్వం వహిస్తాడు. గాయంతో ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ దూరం కావడం ఆస్ట్రేలియాకు దెబ్బే.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌/రాహుల్‌, పుజారా, కోహ్లి, జడేజా, శుభ్‌మన్‌ గిల్‌/సూర్యకుమార్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌/కుల్‌దీప్‌, షమి, సిరాజ్‌

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఖవాజా, లబుషేన్‌, స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, హ్యాండ్స్‌కాంబ్‌, కేరీ, కమిన్స్‌, అగర్‌, లైయన్‌, స్కాట్‌ బోలాండ్‌

పిచ్‌

సందేహం లేదు. అంతా ఊహిస్తున్నట్లే పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనుంది. రెండు జట్ల స్పిన్నర్లే మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు బయటికి వచ్చిన ఫొటోల్లో ఏమాత్రం పచ్చిక లేకుండా, పగుళ్లతో కనిపిస్తున్న పిచ్‌ను చూస్తుంటే.. తొలి రోజు నుంచే స్పిన్నర్ల హవా నడిస్తే ఆశ్చర్యం లేదు.

8

స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ విజయాలు. ఈ రెండు జట్ల మధ్య భారత్‌లో 14 సిరీస్‌లు జరిగాయి. అందులో ఆసీస్‌ నాలుగు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి. మొత్తంగా 27 సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా 12, భారత్‌ 10 గెలిచాయి. మరో 5 డ్రాగా ముగిశాయి.

30

ఆస్ట్రేలియాతో ఆడిన 102 టెస్టుల్లో భారత్‌ సాధించిన విజయాలు. 43 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరో మ్యాచ్‌ టైగా ముగిసింది.

1

టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు అశ్విన్‌కు అవసరమైన వికెట్లు. అనిల్‌ కుంబ్లే (619) ముందున్నాడు.

2

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ (9)ను దాటేందుకు స్మిత్‌కు అవసరమైన శతకాలు.

64

అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీకి అవసరమైన పరుగులు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 24,936 పరుగులు చేశాడు. భారత క్రికెటర్లలో సచిన్‌ (34,357) మాత్రమే అతని కంటే ముందున్నాడు.

గొల్లగట్టు జాతరలో తప్పిన పెను ప్రమాదం

అధికారుల పనితీరుపై భక్తుల ఆగ్రహం...

గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి ఇదొక చెంపపెట్టులా నిలిచిన వైనమన్న విమర్శకులు

సూర్యాపేట జిల్లా

రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన గొల్లగట్టు జాతర భక్తుల విమర్శకులకు నిలయంగా నిలిచింది. ఇందులో భాగంగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కరెంట్ వైర్లను కలిపే తీగలకు ప్లాస్టిక్ టేపు వేయక పోవడంతో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో జాతరలో ఏర్పాటు చేసిన ట్రైన్ లో అప్పటికే కూర్చున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీరా వారంతా కిందికి వచ్చి ఆ ట్రైన్ కి సరఫరా అయ్యే కరెంట్ వైర్లు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

దీనితో నిర్వాహకుల అజాగ్రత్త కొందరి ప్రాణాలకే ప్రమాదంగా మారిందని భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ జాతరలో ప్రతి విషయంలోనూ

ఇంత జరుగుతున్నప్పటికి ఆయా సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించున్న పాపాన పోయినట్లు అనిపించట్లేదు.

దీనిపై ఆరా తీయగా తమ కాంట్రాక్టు కోసం లక్షల్లో ముడుపులు తీసుకున్న అధికారులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అందించడానికి కూడా మాకు సహకరించకుండా మరోలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏది నిజమో..? ఏది అబద్దమో తెలియదు కాని.? వీరి వైఖరి వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి,డబ్బులు గుళ్ల చేసుకొన్నారనేది మాత్రం వాస్తవంగా తెలుస్తోంది...

పతంగ్ కారెక్కుతుందా? ‘చేతి’కి చిక్కుతుందా??

అసెంబ్లీ ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో జరగనున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ ఇప్పుడు చర్చోపచర్చలకు కేంద్ర బిందువైంది. అసెంబ్లీలో ‘నువ్వా-నేనా’ అన్నట్లు మంత్రి కేటీఆర్, మజ్లిస్ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో.. అధికార బీఆర్ఎస్‌కు, మజ్లిస్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఆ వెంటనే.. కాంగ్రెస్ ముఖ్య నేత అక్బరుద్దీన్‌ను కలవడం.. సుదీర్ఘంగా భేటీ అవ్వడంతో పతంగ్(మజ్లిస్ పార్టీ గుర్తు) కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలపై చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ పక్కపక్కనే కూర్చొని, పిచ్చాపాటి మాట్లాడడం.. పాతనగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడం మళ్లీ చర్చనీయాంశమైంది.

మజ్లిస్ వ్యూహమే సపరేటు..!

మజ్లిస్ పార్టీ రాజకీయ ప్రస్తానం 60లలో అప్పటి మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) ఎన్నికలతో ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో అప్పటి పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ(సాలార్) పోటీ చేసి, విజయం సాధించారు. ఆ తర్వాత.. క్రమంగా పాతనగరంపై పట్టు సాధించారు. చార్మినార్, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర నియోజకవర్గాలను కంచుకోటగా మార్చుకున్నారు. పాతనగరం పరిధిలోని మలక్‌పేట్, కార్వాన్‌లు అప్పట్లో బీజేపీ కంచుకోటలు కాగా.. ఆసిఫ్‌నగర్(ప్రస్తుతం నాంపల్లి)పై కాంగ్రెస్ పట్టు ఉండేది. మజ్లిస్ తాను టార్గెట్‌గా చేసుకున్న నియోజకవర్గాల్లో తొలుత క్యాడర్‌ను పెంచుకుంటుంది. తర్వాత ఓటుబ్యాంకును అభవృద్ధి చేసుకుంటుంది. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కొనసాగిస్తుంది. ఓటుబ్యాంకు, ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుని.. అవసరమైన చోట సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుంది.

అలా.. 1999లో కార్వాన్‌ను, 2004లో ఆసిఫ్‌నగర్(ప్రస్తుతం నాంపల్లి)ను దక్కించుకుంది. అప్పట్లో ఆసిఫ్‌నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు టికెట్ దొరక్క.. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశాలతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాతి పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని అవకాశంగా మలచుకున్న మజ్లిస్.. వివాద రహితుడైన నవాబ్ మౌజంఖాన్‌ను బరిలోకి దింపి, ఆ స్థానంలో పాగా వేసింది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు మజ్లిస్‌కు హైదరాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఏడు నియోజకవర్గాలు కంచుకోటల్లా ఉన్నాయి. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. ఇతర ప్రాంతాల్లోనూ పాగా వేసింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ బలాబలాలు, ఓటుబ్యాంకును బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఘంటాపథంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడమే కాకుండా.. 15 స్థానాలను గెలుచుకుంటామని తేల్చిచెప్పారు.

మజ్లిస్ మద్దతు కీలకమే!

మజ్లిస్ పార్టీ మద్దతు ప్రధాన పార్టీలకు అవసరమే అని గత ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు కాంగ్రెస్-మజ్లిస్ కలిసే ఎన్నికల బరిలోకి వెళ్లేవి. మజ్లిస్ కంచుకోటల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీ చేయగా.. ఇతర నియోజకవర్గాల్లోని మజ్లిస్ ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు కలిసి వచ్చేది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మజ్లిస్‌కు-కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన అక్బరుద్దీన్‌పై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో.. 2014లో మజ్లిస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలవడంతో.. 2018లో ఇరుపార్టీలు అవగాహనతో తమ అభ్యర్థులను నిలబెట్టాయి.

టీఆర్ఎస్‌కు మజ్లిస్ మద్దతు అవసరమా?

2014లో నిజామాబాద్ అర్బన్ స్థానంలో మజ్లిస్ పోటీ చేసి.. 23% ఓట్లను సాధించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి 31% ఓట్లను పొందారు. అలా.. రాజేంద్రనగర్‌లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన సున్నం రాజమోహన్‌కూ ఓట్ల శాతం ఫర్వాలేదనిపించింది. అప్పట్లో టీడీపీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్(ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు) విజయం సాధించారు. ఇలా పలు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ తనకు ఓటుబ్యాంకు ఉందని నిరూపించుకుంది. పలు స్థానిక సంస్థల్లోనూ మజ్లిస్ ప్రతినిధులున్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా.. కేంద్రంలో మోదీ సర్కారును గద్దెదింపాలని కంకణబద్ధుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ మజ్లిస్ దోస్తీని వదులుకోబోరని తెలుస్తోంది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌ను ఆహ్వానించారని, పాతనగర అభివృద్ధిపై అప్పటికప్పుడు సమీక్ష జరిపారని స్పష్టముతోంది.

కాంగ్రెస్‌కూ అవసరమే..!

తెలంగాణను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అటు ఏపీలో మొత్తానికి ఖాళీ అయినంతపనైంది. తెలంగాణలో అత్తెసరు సీట్లు వచ్చినా.. ఆ పార్టీ శాసనసభ్యులు చాలా వరకు బీఆర్ఎస్‌లో చేరడంతో.. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఆవేశంగా మాట్లాడడం.. పాతనగరానికి ఏమిచ్చారంటూ ప్రభుత్వాన్ని నిలదీయడంతో.. కాంగ్రెస్ ఆ పార్టీకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్‌తో టీపీసీసీ నేత భట్టి విక్రమార్క సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో వివరాలేమీ బయటకు రాలేదు. అటు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం.. మజ్లిస్‌తో పొత్తుపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా?

మజ్లిస్‌తో తమకు గ్యాప్ పెరిగిందని బీఆర్ఎస్ తన వ్యూహంలో భాగంగానే క్రియేట్ చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. హిందుత్వ కార్డుతోనే ఎన్నికల బరిలో దిగుతుందనేది నిర్వివాదాంశం. మజ్లిస్‌తో పొత్తు బూచీని చూపి, బీఆర్ఎస్ ఓటుబ్యాంకులోని హిందువుల ఓట్లను చీల్చే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్‌కు దూరమైతే ఆ పరిస్థితి ఉండదనేది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌తో మజ్లిస్ జతకడితే.. అది టీఆర్ఎస్‌కే లబ్ధి చేకూర్చే అవకాశాలున్నట్లు గులాబీ నేతలు భావిస్తున్నారు. 50 స్థానాల్లో పోటీపై ప్రకటన చేసిన మజ్లిస్.. ఆ స్థాయిలోనే స్థానాలను పొత్తులో భాగంగా అడిగే అవకాశాలున్నాయి. ముస్లింలు చాలా వరకు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. అయితే.. మజ్లిస్ బరిలో ఉంటే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు చీలిపోయి, టీఆర్ఎస్‌కు కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో.. మజ్లిస్-బీఆర్ఎస్‌ల గ్యాప్ గులాబీ సృష్టే అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు.. ఎన్నికల నాటికి వ్యూహాలు-ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతాయి? పతంగ్ కారెక్కుతుందా? లేక ‘చేతి’కి చిక్కుతుందా? అనేది తేలాలంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచిచూడాల్సిందే..!

Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్‌ సూచన

దిల్లీ: అదానీ గ్రూప్‌(Adani group) వ్యవహారంపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గౌతం అదానీ(Gautam adani)కి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Uttam kumar Reddy) లోక్‌సభ(Lok sabha)లో చేసిన ఆరోపణలపై స్పీకర్‌ ఓం బిర్లా(Om birla) హెచ్చరించారు.

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని పునరుద్ఘాటించారు. గత 10 రోజుల్లో రూ.10లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కుప్పకూలిందని.. కేంద్ర ప్రభుత్వం దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు అంగీకరించాలన్నారు. లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు.ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయరాదని సూచించారు. ‘‘మీరు వాస్తవాలు, ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారు. సభ మర్యాదను కాపాడేలా నడుచుకోవాలి’’ అని హెచ్చరించారు.

అయితే, దీనిపై స్పందించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. సభకు సమర్పిస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్‌.. ‘‘మనం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తున్నాం. కానీ మీరు ఒక్క వ్యక్తి గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. బహుశా అదే మీకు ఇష్టం కావొచ్చు. కానీ దేశానికి కాదు’’ అని వ్యాఖ్యానించారు. విమర్శలు, ఆరోపణలు చేయడానికి మధ్య తేడా ఉంటుందన్న ఆయన.. ‘‘మీరు విమర్శించండి.. కానీ మీరు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండాలి’’ అన్నారు. మరోవైపు, నిన్న రాహుల్‌ గాంధీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించి మోదీ, అదానీ కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శించగా స్పీకర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.