/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Revanth Reddy: అన్నం ముద్దలు కలిపి రేవంత్ రెడ్డికి పెట్టిన మహిళలు Yadagiri Goud
Revanth Reddy: అన్నం ముద్దలు కలిపి రేవంత్ రెడ్డికి పెట్టిన మహిళలు

ములుగు: జనవరిలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు.పేదలందరికీ ఇల్లు ఇస్తాం .. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా వెంకటాపురం మండలం కేశవాపూర్‌లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు.

అలాగే కూలీలతో కలిసి కాసేపు రేవంత్ మిర్చి తెంపారు. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్‌, సీతక్కకు, మల్లు రవిలకు అన్నం ముద్దలు కలిపి పెట్టారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం చేసేందుకు సాధ్యమౌతుందని వారిని సూచించారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలతో రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు.

Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ.. ప్రస్తావించిన విషయాలు ఇవే..

చిత్తూరు: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడు (Tamilanadu) కు గ్రానైట్ అక్రమ రవాణా జరగుతుందని లేఖలో ఆయన ప్రస్తావించారు..

కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి కొత్తూరు ద్వారా వేపనపల్లికి గ్రానైట్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని లేఖ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు..

Andhra News: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం..

దిల్లీ: పార్లమెంటు సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించిది..

ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

''2019లో రాష్ట్ర అప్పులు ₹2,64,451 కోట్లు ఉండగా.. 2020లో ₹3,07,671 కోట్లు, 2021లో ₹3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత ₹3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు ₹4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు ₹45వేల కోట్లు అప్పులు చేస్తోంది'' అని పంకజ్ చౌదరి వెల్లడించారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు సమావేశం..

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Pawan Kalyan: సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పవన్..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక శుభాకాంక్షలు (Special Greetings) చెప్పారు..

ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్ (Tweet) చేశారు. అప్పులతో 'ఆంధ్ర (Andhra)' పేరు మారుమోగిస్తున్నందుకు... సీఎం జగన్‌కు 'నా ప్రత్యేక శుభకాంక్షలు .. keep it up' అంటూ వ్యంగంగా అభినందనలు తెలిపారు. ''మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోవద్దు.. రాష్ట్ర సంపద, ప్రగతి 'కుక్కల'కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు.. ఎప్పటికీ అవే స్పూర్తి.. సీఎం అప్పు రత్నా'' అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై కొంత కాలంగా విమర్శల వేడి పెంచారు. సోషల్ మీడియా (Social Media), ట్వీట్ల (Tweets) ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గత తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు అంటూ పవన్ తన ట్వీట్‌లో జగన్ ప్రభుత్వంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ ఎక్కడా ఏ సభలోనైనా ప్రసంగించినప్పుడు పవన్‌ పేరును ప్రస్తావించకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్ళలు చేస్తారు. అలాగే పవన్ సోషల మీడియా వేదికగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తారు. అందులో భాగంగానే ఇవాళ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్‌పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కళాశాలను వెంటనే సీజ్ చేయాలి

•లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం

•PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు: మల్లెల ప్రసాద్

నారాయణ విద్యాసంస్థల వేధింపులకు మరో విద్యార్థినీ బలాన్మరనానికి పాల్పడడం జరిగింది. అనంతపురం జిల్లా సమీపంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆ కళాశాలపై నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది,

దీనిపై ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గం లో పి డి ఎస్ యు విద్యార్థి సంఘo ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిడిఎస్యు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలలో ప్రతి ఏడాది ఫీజుల ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, దీనిపై అనేక సంఘాల పలుమార్లు విద్యాధికారులను హెచ్చరించిన

నారాయణ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల రాత్రి కూడా అదేవిధంగా నారాయణ కళాశాలల పై నుంచి దూకి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది, ఇలాంటి ఇంకొకసారి పునరావృతం కాకుండా వెంటనే దీనికి కారకులైనటువంటి నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు: మల్లెల ప్రసాద్. కనేకల్ మండలం అధ్యక్షుడు: శ్యాం ప్రసాద్ సుమంత్ పాల్గొన్నారు.

కళాశాలలో నెలకొన్న మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్

PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అధ్యక్షులు : శ్యామ్ ప్రసాద్

కణేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థి, విద్యార్థినులకు టాయిలెట్లు, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు సరి అయినా తరగతి గదులు లేక చాల ఇబ్బంది కరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది, అంతే కాకుండా కణేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కాంపౌండ్ కూడా లేని పరిస్థితి ఉంది.

కొన్ని తరగతి గదులు ఉన్నా కూడా వాటికి పెయింటింగ్ కొట్టించలేని దుస్థితి ఏర్పడింది. కళాశాల ఆవరణలో గ్రౌండ్ లేని దుస్థితి ఏర్పడిoది, వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ప్రొద్దు కళాశాలలో నెలకొన్న మౌలిక వసతులను కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఇంద్రకీలాద్రిపై 15మందితో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే..

గత ఐదు రోజుల క్రితం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు కనకదుర్గ ఆలయ ఈవో భ్రమరాంబ ఈ నెల 8న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది..

పాలమూరు పై ప్రగల్భాలు తప్పా పైసా లేదు

•కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరుపై లేదు

•కిసాన్ కాంగ్రెస్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి

రాష్ట అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో దక్షిణ తెలంగాణ అయినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తూ పాలమూరు - రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల నీరందించే ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదని చల్లా శ్రీకాంత్ రెడ్డి మండి పడ్డారు.

జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులయిన కోయిల్ సాగర్, నెట్టెంపాడు, జూరాల, ఆర్టీఎస్. కల్వకుర్తి, రాజీవ్ భీమా ఎత్తిపోతలకు సైతం బడ్జెట్ లో అరకొరగా కేటాయించారు. ఈ బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా నిర్మాణం పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ పై వివక్షత చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,ఆశిస్తున్నా స్థాయిలో నిధులు విడుదల చేయాలేదు. పాలమూరు ప్రాజెక్టును ఉద్దరిస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రాజెక్టులలో తుమ్మలు మొలుస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం పనులను పూర్తి చేసినా..మిగిలిన 20 శాతం పనులను కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు. కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు పై లేక పోవడంతోనే రైతులకు నష్టం జరుగుతుంది.

జిల్లాకు నిధులు కేటాయింపులో కొసరి కొసరి విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్నప్పటికి ఆయకట్టు రైతుల జీవితాలు బీడు పొలంలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ దారులు సతమతమవుతున్నా రు.

ఇప్పటికీ తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టినా నేటికీ మహబూబ్ నగర్, రంగా రెడ్డి జిల్లాకు తీరని నష్టమే చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి పాలమూరు ప్రాజెక్టు కు కేంద్రం జాతీయ హోదా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు మాయ,మోసపు మాటలు చెప్పుతూన్నాయి. ఈ బడ్జెట్ పేద, రైతు, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా అసంతృప్తికి, నిరుత్సాహానికి గురి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశారు.

మార్చి 30న భద్రాద్రి రామయ్య కళ్యాణం

హైదరాబాద్‌ : భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరు కల్యాణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 31న నిర్వహించేందుకు వైదిక కమిటీ ఖరారు చేసింది. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.