/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతులు మెరుగుపరచాలి : PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్ Yadagiri Goud
హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతులు మెరుగుపరచాలి : PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్

•ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లో సంక్షేమ హాస్టల్ లో సరిపడ వసతులు లేవు కాబట్టి ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి. సన్నబియ్యం పంపిణీ చేయాలి. హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతులు మెరుగుపరచాలి. బెడ్ సీట్, ట్రంకు పెట్టెలు,పంపిణీ చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ ట్యాబ్ ఇవ్వాలి.హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలి. సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, నాణ్యత లేని భోజనం చేస్తున్నారు అనీ సరిఅయిన మెన్ ప్రకారం చెయ్యకుండా సరిపడా బెంచీలు, కుర్చీలు, త్రాగునీరు మరియు ఉపాధ్యాయుల కొరత కూడ అక్కడ అక్కడ స్కూల్ లో లేని పరిస్థితి ఉంది.

అంతే కాకుండా హాస్టల్ లో వార్డెన్ కూడా లేని దుస్థితి ఏర్పడింది, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా 8 వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ కూడ పంపిణీ చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా సంక్షేమ హాస్టల్ లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని,పక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలను బహిరంగ సభలను, జరిగే కార్యక్రమాలను తప్పకుండా అడ్డుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు.. కండువా క‌ప్పి ఆహ్వానించిన కేసీఆర్

భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో నాందేడ్ సులు భారీ సంఖ్య‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

నాందేడ్ వసూలు జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ అంబేద్క‌ర్‌, మ‌ర‌ఠ్వాడా పోరాట‌ యోధుల‌కు సీఎం కేసీఆర్ నివాళులు

బీఆర్ఎస్ నాందేడ్‌ స‌భా వేదికపై డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌ర‌ఠా యోధుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు.

మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్,

మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్ర‌హాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

బీఆర్ఎస్ స‌భ‌లో యువ‌త జోష్‌

నాందేడ్ బీఆర్ఎస్ స‌భ‌లో ఓ యువ‌తి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మ‌రాఠీకి చెందిన గోదాతీర్ అనే ప‌త్రిక‌లో స్థానిక నాయ‌కుడు ఇచ్చిన కేసీఆర్ యాడ్‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కేసీఆర్ లాంటి నాయ‌కుడు ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని ఆ యువ‌తి పేర్కొంది.

రైతుల‌, యువ‌త ప‌ట్ల కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలిపింది. యూత్ మ‌ద్ద‌తు కేసీఆర్‌కు త‌ప్ప‌క ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది...

Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రగతి భవన్‌లో ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన

ఈ సమావేశంలో రేపు(జనవరి 6) శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది. కేబినెట్‌ భేటీ తరువాత సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల

అమరావతి: ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ టెస్ట్‌కు గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లలో అభ్యర్థులు పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు లక్షల 59 వేల 182 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 95,208 మంది ఉత్తీర్ణులైనట్టు బోర్డు వెల్లడించింది. పరీక్షా ఫలితాలను slprb.ap.gov.in పొందవచ్చని పేర్కొంది.

కాగా గత నెల 22న పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ కీ నీ విడుదల చేయగా 2261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి అవసరమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది.

అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. స్టేజ్ టు ఆన్ లైన్ అప్లికేషన్ దరఖాస్తును ఈ నెల 13వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటుందని బోర్డు పేర్కొంది. అభ్యర్థులు తమ అనుమానాల నివృత్తికి హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా మెయిల్‌లో సంప్రదించాలని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్.