తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 04 2024, 14:24

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే

హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. గత కొద్ది రోజులు ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో వున్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా.. లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం వుంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం జరుగుతోంది.

ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లైతే.. అలాగే ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ, ఎస్పీకి, సీపీకి కానీ లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచి ఉద్దేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కానీ, తప్పుదోవ పట్టించే విధంగా యత్నించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగం పేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్…

ఈ బెదిరింపు వసూళ్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా.విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వాస్తవాలు గ్రహించి అనంతరం హైడ్రా కమిషనర్ సూచన మేరకు ఎస్పీ సంగారెడ్డి బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న డా.విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 04 2024, 13:47

శ్రీశైలం రైట్ పవర్ హౌస్‌లో భారీ పేలుడు..

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు.

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరిగింతో అర్థంకాక ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. అసలే జలశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఏడో నంబర్ యూనిట్‍లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అనంతరం సమస్యను గుర్తించిన అధికారులు సాంకేతిక లోపం తలెత్తి శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. కండెన్సర్ కాలిపోయి పేలుడు సంభవించినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన విద్యుత్ ఉత్పత్రి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 99,615క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,81,235క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలాశయం 6గేట్లు 10అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50అడుగులకు చేరుకుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 04 2024, 09:20

సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు నేటి సాయంత్రం నుంచి అనుమతి!

మహబూబాబాద్‌ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

క్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో 100 మంది చొప్పున సుమారు 600 మంది కూలీలు పనులు చేస్తున్నారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం వరద ఉధృతికి ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్‌ కొట్టుకుపోయింది. మహబూబాబాద్‌-కేసముద్రం సెక్షన్‌లో నాలుగు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

మొత్తం 420 మీటర్ల ట్రాక్‌ కొట్టుకుపోయింది. మహబూబాబాద్‌- కేసముద్రంమధ్య పునరుద్ధరణ పనులను పూర్తి చేసి గూడ్స్‌ రైలుతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అయితే, ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో వరద ఉధృతి తగ్గకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 21:28

అదుకో మంటున్న ఆంధ్ర ప్రదేశ్

దాతలు తమ విరాళాలు ఇలా పంపండి..

ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు.

ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే.. సాటి మనుషుగా వరద బాధితులకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తనవంతు బాధితులకు భరోసా ఇస్తోంది. వరద బాధితులు భారీ స్థాయిలో ఉండటంతో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దాతలు తమకు తోచినంత సాయం చేయాలని.. వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.

వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పాయింట్ ఏర్పాటు చేశారు. సాయం చేసే దాతలు ఐఏఎస్ మనజీర్‌ను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన నెంబర్ కూడా ప్రకటించింది. దాతలు 79067 96105 కు సంప్రదించొచ్చని తెలిపింది. ఇక వ్యక్తిగత ధన సహాయం చేయదల్చిన దాతలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది.

దాతలు ఈ అకౌంట్‌కు నిధులు పంపొచ్చు..

SBI

A/c name : CMRF

A/c number : 38588079208

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : SBIN0018884

Union Bank of India

A/c name : CM Relief Fund

A/c number : 110310100029039

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : UBIN0830798.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 19:01

అదానీ గ్రూప్ కొత్త కంపెనీకి ఆమోదం.. షేర్లు అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..

అదానీ గ్రూప్ దేశంలోని ఎనర్జీ రంగంలో కొత్త కంపెనీ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను విక్రయిస్తున్నారు.

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డు టోటల్ ఎనర్జీస్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని ఆమోదించింది. దీని కింద రెండు సంస్థలు 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌లో వాటాను కలిగి ఉంటాయని వెల్లడైంది. తాజా డీల్ ద్వారా విదేశీ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలో కొత్తగా 444 మిలియన్ డాలర్లను అదనంగా పెట్టుబడి పెట్టనుంది. అయితే కంపెనీ కొత్త అడుగులు వేస్తున్న తరుణంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు క్షీణించాయి. ఈ క్రమంలో స్టాక్ ధర 2 శాతానికి పైగా క్షీణించింది. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి 2.66 శాతం క్షీణించి రూ.1894 వద్ద స్థిరపడింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, టోటల్ ఎనర్జీస్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ లిమిటెడ్ మధ్య గట్టి ఒప్పందాలు చేసుకోనున్నట్లు స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఒప్పందంలోని వివరాల ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జాయింట్ వెంచర్ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ టోటల్ ఎనర్జీస్ నేరుగా లేదా దాని అనుబంధ సంస్థల ద్వారా అవసరమైన పెట్టుబడి మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడైంది. కొత్తగా ఏర్పాటౌతున్న కంపెనీ 1,150 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అదానీ గ్రూప్ ఇంధన రంగంపై దృష్టి సారిస్తున్న ప్రస్తుత సమయంలో కొత్త కంపెనీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది. కంపెనీ ప్రస్తుత చర్యలతో రానున్న కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్వహణ సామర్థ్యం 30 శాతానికి పైగా పెరిగి 2030 నాటికి 50,000 మెగావాట్లను దాటే అవకాశం ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ వార్షిక ప్రాతిపదికన 6,000 నుంచి 7,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్ పరిశీలిస్తే ప్రమోటర్లు కంపెనీలో 57.52 శాతం వాటాలను కలిగి ఉన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 18:56

తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతలా తల్లిడిల్లిపోయాయో తెలిసిందే. ఏపీలో విజయవాడ, పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు. బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు తనవంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు.

50 ఏళ్ల క్రితం మా నాన్న గారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీ కోసం.. మీ ఆనందం కోసం.. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నావంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని, ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఇచ్చిన ఈ పిలుపునకు స్పందన వస్తోంది. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. మరోవైపు స్వస్ఛంధ సేవాలు కూడా కదిలాయి. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జై భారత్ క్షీరా ఆక్వా సంఘం తరఫున 2000, కాస్మో క్లబ్ తరఫున 3000 ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు. కాగా స్వచ్చంధంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 17:20

వ‌ర‌ద బాధితులకు ఆ న‌లుగురు భారీ విరాళం!

భారీ వ‌ర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు, నిర్మాత‌లు విరాళం అందించ‌గా తాజాగా మ‌రింత మంది ముందుకొచ్చారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, నిర్మాతలు ఎస్ . రాధాకృష్ణ‌, నాగ‌వంశీ 50 లక్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి 25 ల‌క్ష‌లు, తెలంగాణ‌కు 25 ల‌క్ష‌లు చొప్పున 50 ల‌క్ష‌లు ముఖ్య‌మంత్రుల‌ స‌హాయ నిధికి అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. `భారీ వ‌ర్షాల వ‌ల్ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఆస్తి, ప్రాణ న‌ష్టాలు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో క‌లచి వేసాయి. ఆ విప‌త్తు నుంచి తెలుగు ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ మా వంతు స‌హాయం అందిస్తున్నాం` అన్నారు.

అలాగే యువ న‌టుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఆప‌న్న హ‌స్తం అందించారు. ఒక్కో రాష్ట్రానికి 15 ల‌క్ష‌లు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు విరాళం అందించారు.` తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం బాధాక‌రం. ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బంది చూస్తుంటే ఎవ‌రికీ ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దనిపిస్తుంది.

ఈ వ‌ర‌ద‌లు చాలా కుటుంబాల‌ను క‌ష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌రికొక‌రు తోడుగా ఉండటం ఎంతైనా అవ‌స‌రం. వ‌ర‌ద బాధితుల‌కు నా వంతుగా తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు అందిస్తున్నా. ఇది కొంత మందికి ఏదో రూపంలో ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను` అని అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 17:08

వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

మరోవైపు ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల్లో మరో ముప్పు వుందని వాతావరణ శాఖ హెచ్చరింది. అంటే సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతుందని అధికారులు వివరించారు. కోస్తాంధ్ర కోస్తాకు అతి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 17:03

బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి..

తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వం అండగా నిలిచి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈరోజు(మంగళవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి. ఒకరికి కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన మంచి కంటి నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న నేతలను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి తాము అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం? సిగ్గు చేటు అని అన్నారు.

ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే...ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ వార్నిగ్ ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 11:44

విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. నెమ్మదిగా శాంతిస్తున్న కృష్ణమ్మ

విజయవాడలో కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి సోమవారం ఇన్‌ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారానికి అది 9 లక్షల క్కూసెక్కులకు తగ్గింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు విజయవాడ నగరంలోనూ వరద నీరు క్రమంగా తగ్గుతోంది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల సాధారణ పరిస్థితికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

విజయవాడ సింగ్ నగర్‌లో వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిత్యావసరాలు, మంచి నీరు తీసుకెళ్తున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో కాలనీల నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గని ప్రదేశాల్లో హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్‌ విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విశ్వక్‌సేన్‌ విరాళం ఇచ్చారు.

విజయవాడ వరద బాధితులకు సింహచలం నుంచి పులిహోర ప్రసాదం తీసుకొస్తున్నారు. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. రైలులో 10 వేల ప్యాకెట్లను ఆలయ అధికారులు పంపారు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు 10 వేల పులిహోర ప్యాకెట్లు చేరాయి.విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై వాహనాల రాకపోకలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయి. సోమవారం రాత్రి వరకూ మాచర్ల మీదుగా వెళ్లిన బస్సులు.. ఇప్పుడు నందిగామ మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. వంతెన గండి పడటంతో సింగిల్ రూట్‌లో వెళుతున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో హైదరాబాదు ప్రయాణానికి ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. అయితే.. డ్రైవర్లు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.విజయవాడలో వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లను ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అందుకే అధికారులు వీటిని సిద్ధం చేసి.. ముంపు ప్రాంతాలకు పంపిస్తున్నారు.