నార్పల మండల సర్వసభ్య సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గం,నార్పల మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు, మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు ఇంటి నివేసిన స్థలాలు మంజూరు చేసిన వాటిలో అనర్హులకు కేటాయించినట్లు తెలిసి వచ్చిందని, అధికారులు లేఅవుట్లలో విచారణ జరిపి అర్హులకు ఇంటి స్థలాలు దక్కేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో విద్యుత్ ఎ.ఇ. లేకపోవడం ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు గ్రహించారు.అలాగే నార్పల మండలంలోని ప్రతి గ్రామంలో ఆగస్టు 15వ తేదీలోగా విద్యుత్ వీధి దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధించిన అధికారులకు ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రివేళ డ్యూటీ డాక్టర్,సెక్యూరిటీ లేరని వాపోయారు.ఒక వ్యక్తికి ఆర్.డబ్ల్యూ.యస్. తరపున సరఫరా చేసే నీటిని 15 లీటర్ల నుండి 40 లీటర్లు పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి చేయడమైనదని,మంత్రి గారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబుదారీతనం లేకుండా నిధులు లేవని కుంటి సాకులు బాధాకరం అని తెలిపారు.సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే వీలు ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులను కలిసిన ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగా రెడ్డి..
భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
పల్లెటూరు వేషధారణలో వెళ్లి ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో వెళ్లారు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు.అనంతపురం మార్కెట్ యార్డ్.. ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా.. మెడలో తువ్వాలుతో లోపలికి వెళ్లారు. గొర్రెలు, ఎద్దులు కొనడానికి వచ్చారని అధికారులు భావించారు. కొద్దిసేపటికి అసలు విషయం బయటపడింది.. వచ్చింది ఏసీబీ అధికారులని తెలిసి అవాక్కయ్యారు. అవినీతి చేసేవారిని పట్టుకునేందుకు ఇలా మారు వేషంలో వెళ్లారని తేలింది. మార్కెట్ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో.. యార్డులో జరుగుతున్న తతంగం మొత్తంపై ఆరా తీసి వారి ఆటకట్టించారు.
లక్ష్మయ్య గారి కుటుంబానికి 10000/- రూ.లు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ఆర్థిక సమస్యలతో సతమాతం అవుతున్న బలిజ లక్ష్మయ్య గారి కుటుంబానికి 10000/- రూ.లు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఆర్థిక సమస్యలతో సతమాతం అవుతున్న బలిజ లక్ష్మయ్య గారి కుటుంబానికి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కాటమయ్య, చిన్నమద్దిలేటి, నారాయణస్వామి, తలారి నాగేంద్ర, చిన్నారాజు, మారుతీ, రవి, చెన్నమయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ..
అనంతపురం 28.07.2024 రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.. రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ గారు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతపురం నగరంలోని రాంనగర్ లో ఉన్న మంత్రి గారి నివాసంలో మంత్రివర్యులుని ఎస్పీ కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బ్రహ్మయ్య స్వామి దేవాలయం నిర్మాణానికి ₹5000/- రూ.లు విరాళం అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..

బ్రహ్మయ్య స్వామి దేవాలయం నిర్మాణానికి ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలోని బ్రహ్మయ్య స్వామి గుడి నిర్మాణానికి ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ కార్యక్రమంలో ఐటీడీపి మండల అధ్యక్షులు హేమంత్ కుమార్ యాదవ్, బ్రహ్మయ్య ఆచారి, కొండన్న, సుబ్బయ్య, నారాయణ స్వామి, తలారి నాగేంద్ర,మారుతీ, నరసింహులు, మరియు ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..
అనంతపురం గార్లదిన్నె మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకున్న పోలీసులు వారి నుండి 20 ద్విచక్ర వాహనాలు స్వాదీనం... సుమారు 4,11,000 రూపాయలు నగదు స్వాదీనం చేసుకున్న పోలీసులు...
పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
స్వాగ్రామం సిద్దారంపురంలోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురం లోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు హాజరుఅయిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని ఘన స్వాగతం పలికిన గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన..
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.. త్వరలోనే ఇదే అంశంపై ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయశాఖ మంత్రిని కలుస్తాం* *పండ్ల తోటల పెంపకం పరిమితిని 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచాలి* *రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన* ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటే.. పెట్టుబడులు పెరిగి భారంగా మారిందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడమే సరైన పరిష్కారమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభిప్రాయ పడ్డారు. ఇదే అంశాన్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు రైతులు పరిటాల సునీతను కలిసి నేటి వ్యవసాయ పరిస్థితుల గురించి చర్చించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పెట్టుబడులు తగ్గిస్తేనే వ్యవసాయం మనుగడ సాధ్యమవుతుందన్నారు. అనంతపురం లాంటి కరువు జిల్లాలో రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపడుతున్నారన్నారు. ప్రస్తుతం ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో ఎక్కువమంది 5నుంచి 10 ఎకరాల వరకు భూములు ఉన్న రైతులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పండ్ల తోటల పెంపకం పథకాన్ని 10 ఎకరాల లోపు రైతులకు కూడా వర్తింపజేయాలి. పరిమితిని పది ఎకరాలకు పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నందున రైతుల్ని ఉద్యాన పంటల వైపు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జిల్లాలో సంప్రదాయ పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారని అన్నారు. పండ్లతోటల సాగు ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. పరిమితిని పది ఎకరాలకు పెంచడం ద్వారా లక్షలాది మంది రైతులకు ఉపయోగపరంగా ఉంటుందన్నారు. పది ఎకరాల వరకు అర్హతను పెంచి 5 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంపకానికి అవకాశం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇదే అంశాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రిని కలిసి వివరిస్తామని సునీత అన్నారు....
చట్టాలను తెల్సుకోండి అభివృద్ధిలో ముందుకు కదలండి సీఐ వెంకటేశ్వర్లు..
చట్టాలను తెల్సుకోండి అభివృద్ధిలో ముందుకు కదలండి సీఐ వెంకటేశ్వర్లు..

బుక్కరాయసముద్రం మండలంలోని చట్టాల పైన అవగాహన కార్యక్రమాన్ని సిఐ వెంకటేశ్వర్లు పసులూరు సిద్దారంపురం రెడ్డిపల్లి గ్రామాల నందు గ్రామంలోని యువతతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టలవలన ఉపయోగాలు తెలియజేయడం జరిగింది గ్రామంలో నందు మొహరం సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని గ్రామ ప్రజలకు యువతకు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పోలీస్ అధికారి కానిస్టేబుల్ రవి నాయక్ గ్రామ పెద్దలు యువతి యువకులు పాల్గొన్నారు