VijayaKumar

Jun 21 2024, 18:49

వలిగొండ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత: ఎస్ఐ డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టి ఎస్ 12 యు సి 4130 అను నెంబర్ గల అశోక్ లే లాండ్ గూడ్స్ లో 10 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము ను మహమ్మద్ సాదిక్ వయసు 40 సంవత్సరాలు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ,భువనగిరి కి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jun 21 2024, 18:25

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని AISF జిల్లా కౌన్సిల్ పక్షాన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి చౌటుప్పల్ మోత్కూర్ వలిగొండ తదితర మండలాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదన గురి చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ బెల్ట్ బూట్లు తదితర వస్తువుల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ సమస్యలపై గతంలో అనేకమార్లు డీఈవో దగ్గరికి తీసుకువెళ్లిన కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో ఆరు మండలాలకు ఓకే ఎంఈఓ ఉండడం వలన పర్యవేక్షణ లోపంతో ప్రైవేట్ పాఠశాలలు దోపిడికి అలవాటు పడ్డారు అని అన్నారు జిల్లాలో అన్ని మండలాలకు ఎంఈఓ లను నియమించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయానికి సర్వీసు రోడ్డు నిర్మించి విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, నవీన్, భరత్ వినిల్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 21 2024, 18:07

భువనగిరి : భువనగిరి ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక శిక్షణ శిబిరం

యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడి భువనగిరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న 11 సెక్టార్లు లో నుంచి 35 మంది అంగన్వాడి టీచర్లను బ్యాచ్ గా డివైడ్ చేసి 19/6/2024 నుండి 21/6/2024 వరకు పూర్వ ప్రాథమిక శిక్షణా కేంద్రం శిబిరం జరిగినది. ఈ శిబిరంలో భాగంగా 35 మంది టీచర్లకు ప్రియదర్శిని అంగన్వాడి టీచర్ కరదీపిక పుస్తకాలు అందించి. అందులోని అంశాలు నూతన జాతీయ విద్యా విధానం 2020లో ప్రీస్కూల్ అనుసంధానం చేయడం జరిగింది. ECCE , ECE గురించి వివరించడం, అభ్యసనమూలాలు, ఆటలు, పాటలు, కథ, మాటలు, మంచి అలవాట్లు, సృజనాత్మకత, మరియు శాస్త్రీయ పరిజ్ఞానం ప్రదర్శించడం జరిగింది. మిగతా 267 టీచర్లకు బ్యాచిలుగా విభజించి శిక్షణ నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి గారు భువనగిరి ప్రాజెక్టు సిడిపిఓ స్వరాజ్యం రేఖల గారు మరియు ఏసి డిపో రమా గారు సెక్టార్ సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 21 2024, 17:59

భువనగిరి: పుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా,విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం లో ప్రతి ఏటా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను శుక్రవారం భువనగిరి పట్టణములో రాంనగర్ ప్రైమరీ పాఠశాలలోమున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు 8 వ వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌ ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధను అందించాలని సూచించారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 21 2024, 17:47

భువనగిరి: భువనగిరి టౌన్ లో శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన విద్యాధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూలు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు భువనగిరి టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు DEO నారాయణరెడ్డి గారికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే MEO నాగేశ్వర్ రెడ్డి గారిని పంపి శ్రీ చైతన్య స్కూల్ కు సీల్ విధించడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు బుక్ ఫీజ్ అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ అని ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్లైన్స్ ఉన్న అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు పేదల సొమ్మును 2005 ఫీజు నియంత్రం చట్ట అమలులో ఉన్న అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థుల రక్తం తాగుతున్నారు అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు . ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు *గుండెబోయిన సురేష్, బీసీ విద్యార్థి సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ , ఉమ్మడి జిల్లా bc యువజన సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం ,మహేందర్ గౌడ్,వనిత,దర్శన్ ముదిరాజ్,వెంకట్ ప్రజాపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 21 2024, 16:07

రామన్నపేట : ఇంద్రపాలనగరం చెరువులో గుర్తుతెలియని మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని చెరువు లో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గత మూడు రోజుల క్రితం గ్రామంలో తిరిగాడని, మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిపారు. మృతదేహం నీటిలో తెలియాడుతూ శుక్రవారం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

VijayaKumar

Jun 21 2024, 13:46

వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం

వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం* *వలిగొండ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు యోగ దినోత్సవం సందర్బంగా యోగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నకిరేకంటి మొగులయ్య, అసెంబ్లీ కోకన్వీనర్ రాచకొండ కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు గంగాదారి దయాకర్, మండల కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, బూత్ అద్యక్షులు పిట్టల రాజు, మండల యువ మోర్చాప్రధాన కార్యదర్శి ఆమనగంటి శివ,ఎర్రబోలు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు


VijayaKumar

Jun 20 2024, 20:45

వలిగొండ మల్లెపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి: CPM

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  - మల్లేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి మురికి నీరు కారణంగా పాడైపోయిన బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి... సిపిఎం డిమాండ్ వలిగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లేపల్లి అండర్ గ్రౌండ్ పాడైపోయి రోడ్డుపై మురికినీరు ప్రవహించడం కారణంగా పాడైపోయిన బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు ఈరోజు మల్లేపల్లి గ్రామంలో మురికి నీరుపారడంతో పాడైపోయిన బీటీ రోడ్డుపై సిపిఎం వలిగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ వెలువర్తి,మొగిలిపాక,కెర్చిపల్లి గ్రామాల ప్రజలు నిత్యం వలిగొండ మండల కేంద్రానికి వివిధ పనుల కోసం వచ్చిపోతు ఈ రోడ్డుపై మురికి నీరు పారుతుండటంతో గుంతలుపడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే అనేకమంది ప్రయాణికులు ఈ గుంతల్లో పడి గాయాల పాలైనరని అన్నారు సంవత్సరం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెంటనే పాడైపోయిన అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టి రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు కారణంగా పాడై గుంతలుపడిన బీటీరోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, సిపిఎం పట్టణ నాయకులు వేముల లక్ష్మయ్య,కొండూరు సత్తయ్య,ఎండి షాహిద్, గ్రామ ప్రజలు పల్లెర్ల లక్ష్మయ్య,భిక్షపతి, నరసింహ,తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jun 20 2024, 20:14

ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కౌన్సిలర్ పంగ రెక్కస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా:పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మాత్రలు అందజేయనున్నారని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తెలియజేశారు** ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణకు గురవుతారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ కార్యక్రమంలో ఎ.యన్ .యం.ఇంద్ర ప్రేమలత, శోభ , శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయులుయాదయ్య , సంతోష,గంజ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు , రాంనగర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

VijayaKumar

Jun 19 2024, 19:24

చౌటుప్పల్: ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు ఆయన చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను సమీక్షిస్తూ... ధరణి మోడ్యూల్ సంబంధించి ఫౌతి కేసులు, కోర్టు కేసు ఇంటిమేషన్లు, మ్యుటేషన్లు తదితర ధరణి దరఖాస్తులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా వెంటనే పరిష్కరించాలని సూచించారు. వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి వి.శేఖర్ రెడ్డి, తహసిల్దార్ హరికృష్ణ, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.