Mane Praveen

Jun 19 2024, 21:37

NLG: జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట ముగింపు కార్యక్రమం
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ మాధవ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ పద్మ కుమారి అధ్యక్షతన బడిబాట ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో మరియు ఉపాధ్యాయ బృందంతో బోనాలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో మాధవ నగర్ చౌరస్తా వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మకుమారి మాట్లాడుతూ.. నల్గొండ పట్టణంలోని జేబీఎస్ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి గత వారం రోజుల నుండి బడిబాట కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామని, ఈరోజు ముగింపు కార్యక్రమంలో క్రీడా దినోత్సవం నిర్వహింకున్న అనంతరం బడిబాట ముగింపు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశామని తెలియజేశారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు చదువుల్లో మరియు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయి లో రాణించటానికి ఉపాధ్యాయ బృందం అంతా సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు ఆర్.నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా JBS హై స్కూల్ విద్యార్థులు చదువుల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని, ఆ క్రమంలో గత సంవత్సరం మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు
బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు క్రీడా దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకునే క్రమంలో పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలను సమకూర్చుకుంటూ, క్రీడా మైదానాలను సమాయత్తం చేసే కార్యక్రమాల్ని నిర్వహించామని అనంతరం విద్యార్థులతో వివిధ క్రీడా పోటీలను నిర్వహించామని తెలియజేశారు. జేబీఎస్ హైస్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు చదువుతో పాటు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందమంతా సమిష్టిగా కృషి చేస్తూ జేబీఎస్ హైస్కూల్ ను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం రూప, రేణుక, శ్రీనివాస్, తహేరాఫాతిమా, ప్రతిమ, రత్నమాల, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 16 2024, 07:32

విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ చేసిన HM పద్మాకుమారి
నల్గొండ: మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట ప్రోగ్రాంలో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రధానోపాధ్యాయురాలు పద్మ కుమారి అధ్యక్షతన యూనిఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం ఉంటారని వారి సేవలను ఉపయోగించుకుంటూ విద్యార్థిని విద్యార్థులు చదువులతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.

Mane Praveen

Jun 15 2024, 06:42

NLG: విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన HM పద్మా కుమారి
నల్గొండ: మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట ప్రోగ్రాంలో భాగంగా, శుక్రవారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు పద్మ కుమారి అధ్యక్షతన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు ఉపయోగించుకొని విద్యార్థులు చదువులలో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 15 2024, 06:35

NLG: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ జండా ఆవిష్కరణ
నల్లగొండ: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ బాసాని వెంకటయ్య శుక్రవారం యూనియన్ జండా ఆవిష్కరణ చేసినారు.11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి బాండ్ డబ్బులు మరియు లీవు ల డబ్బులు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. 2021 పే స్కేల్ ఇవ్వాలని దానికి సంబంధించి 25 శాతం ఐ ఆర్ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. డిపో సెక్రటరీ ఏఎల్ స్వామి, పి.అంజయ్య, డి.ఎం.రెడ్డి, సుదర్శన్, యాదయ్య, వెంకన్న, ఏ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 15 2024, 06:35

NLG: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ జండా ఆవిష్కరణ
నల్లగొండ: ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ బాసాని వెంకటయ్య శుక్రవారం యూనియన్ జండా ఆవిష్కరణ చేసినారు.11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి బాండ్ డబ్బులు మరియు లీవు ల డబ్బులు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. 2021 పే స్కేల్ ఇవ్వాలని దానికి సంబంధించి 25 శాతం ఐ ఆర్ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. డిపో సెక్రటరీ ఏఎల్ స్వామి, పి.అంజయ్య, డి.ఎం.రెడ్డి, సుదర్శన్, యాదయ్య, వెంకన్న, ఏ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 15 2024, 06:22

రైతు భరోసా కు నిధులు కేటాయించి విడుదల చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
NLG: 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు, రైతు భరోసా కు నిధులు కేటాయించి, రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కర్నాటి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ లో వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలన్నారు. రైతు భరోసాతో పాటు, రైతు బీమా, పంటల భీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు వ్యవసాయ భూముల సేద్యం పనులు ప్రారంభిస్తుండగా అవసరమైన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.  ఏ విత్తనాలు ఎరువులను వాడాలో రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేయాలని కోరారు. ధరణిలో భూ సమస్యలపై రైతులు పెట్టుకున్న అర్జీలను కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. గుంతలు పడిన గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,భువనగిరి ఎంపీ  కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులుతీన్మార్ మల్లన్నకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పెన్న అనంతరామ శర్మ, సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, వల్లూరు శ్రీశైలం, ఎండి రబ్బాని, అచ్చిన శ్రీనివాస్, నగేష్, లక్ష్మయ్య, చెన్నయ్య, సైదులు, వెంకన్న, మండల నాయకులు కర్నాటి తుకారం, పెద్దగాని నరసింహ, కృష్ణ, శ్రీరాములు, వెంకటేశం, పడస బోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 13 2024, 09:22

ఆకస్మిక మరణం చెందిన పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య మంగళవారం రాత్రి ఆకస్మిక మరణం చెందారు.

బుధవారం ఆ శాఖ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

పోస్టల్ శాఖలు తిరుపతయ్య చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ పి ఎం వెంకటేశం, అధికారులు కారింగు కృష్ణయ్య, నరసింహ చారి తిరుమలేశు, గోవర్ధన్, వివిధ గ్రామాల బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NLG

Mane Praveen

Jun 12 2024, 21:17

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన     హెడ్మాస్టర్ పద్మకుమారి
నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాల నూతన హెడ్మాస్టర్ పద్మ కుమారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం  మాధవ నగర్ వీధులలో, పాతబస్తీ పూల్ వరకు ర్యాలీగా నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించి స్థానిక ప్రజలన్ని ఎంతో ఆకట్టుకున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరిపించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు మరియు  విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం 2024 విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమాన్ని కూడా స్వాగత తోరణాలతో ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 12 2024, 16:28

పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య ఆకస్మిక మరణం
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

తిరుపతయ్య కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిల్ల రాజశేఖర్ ను, ఖన్నా ను వారి కుటుంబ సభ్యులను పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
గ్రామంలో పగిల్ల తిరుపతయ్య అంతిమయాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Mane Praveen

Jun 12 2024, 16:17

పోస్టల్ శాఖ ఉద్యోగి తిరుపతయ్య ఆకస్మిక మరణం

నల్గొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

తిరుపతయ్య కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిల్ల రాజశేఖర్ ను, ఖన్నా ను వారి కుటుంబ సభ్యులను పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

గ్రామంలో బుధవారం పగిల్ల తిరుపతయ్య అంతిమయాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.