కేబినెట్లో పిన్న వయస్కురాలిగా అనిత!

చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు. 

ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.

 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి (71) ఉన్నారు. 

అలాగే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు.

ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్ ప్రమాణ స్వీకారం..

ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్ ప్రమాణ స్వీకారం.. 

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం..

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.

ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల..

•24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. 

•జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.. 

మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు..

 ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి,

కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

Breaking ; మాజి సీఎం కేసిఆర్ కు నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్.ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు.

- గులాబీ బాస్‌కు నోటీసులు పంపిన జస్టిస్‌ నరసింహారెడ్డి

- విద్యుత్‌ ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై వివరణ కోరిన పవర్ కమిషన్‌

- జూన్- 15 లోపు వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు నోటీసులు

- జులై-30 వరకు సమయం కోరిన మాజీ సీఎం

రాజ్భవన్లో గవర్నర్తో కూటమి నేతల భేటీ..

గవర్నర్తో సమావేశమైన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన నేతలు.. 

చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు.. 

సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామన్నారు: ఎన్డీయే కూటమి నేతలు

ఏపీ రాజధానిగా అమరావతి..

మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన.. 

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. 

కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

మేడారం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఫోకస్ !

- జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ

- సమ్మక్క-సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం

- భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం

- చిలకల గుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు

- పర్యాటక ప్రాంతంగా మేడారం.. గిరిజనులకు ఉపాధి

వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకూ తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది.

తల్లుల జాతర విశేషాలతోపాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్టను సుందరీకరించడంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. 

ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో వనమంతా జనంతో నిండిపోతుంది.రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు 10 రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా గిరిజన, గిరిజనేతర భక్తులు వస్తారు. ‘కుంభమేళా’ తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలోనే.

ఇంత ప్రాశస్త్యం ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ, కేంద్రం మాత్రం ఏళ్ల నుంచి తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరో సారి ప్రస్తావించడంతోపాటు స్మృతి వనం వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

700 కోట్లతో కోకా కోలా ప్లాంట్ ..!

- పెద్దపల్లి జిల్లాలో కోకా కోలా ప్లాంట్ ఏర్పాటు

- విదేశీ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ అంతర్జాతీయ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. అమెరికా పర్యటలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై.. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో కోకా కోలా ప్లాంట్ ఉండగా.. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు మంత్రులు తెలిపారు.అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోకా కోలా గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించాలని కంపెనీని మంత్రులు ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన జోనథన్‌.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ప్లాంట్‌ని సంస్థ పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ ఆర్మ్ అయిన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ (HCCB) స్థాపించనుంది. ఇది ఇప్పటికే ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రదేశాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే.. ఆ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం..

హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 

శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్న నేతలు..

సమావేశం తర్వాత గవర్నర్ను కలవనున్న 3 పార్టీల నేతలు..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా..

చంద్రబాబును ఆహ్వానించనున్న గవర్నర్