ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల..

•24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. 

•జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.. 

మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు..

 ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి,

కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

Breaking ; మాజి సీఎం కేసిఆర్ కు నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్.ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు.

- గులాబీ బాస్‌కు నోటీసులు పంపిన జస్టిస్‌ నరసింహారెడ్డి

- విద్యుత్‌ ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై వివరణ కోరిన పవర్ కమిషన్‌

- జూన్- 15 లోపు వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు నోటీసులు

- జులై-30 వరకు సమయం కోరిన మాజీ సీఎం

రాజ్భవన్లో గవర్నర్తో కూటమి నేతల భేటీ..

గవర్నర్తో సమావేశమైన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన నేతలు.. 

చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు.. 

సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామన్నారు: ఎన్డీయే కూటమి నేతలు

ఏపీ రాజధానిగా అమరావతి..

మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన.. 

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. 

కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

మేడారం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఫోకస్ !

- జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ

- సమ్మక్క-సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం

- భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం

- చిలకల గుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు

- పర్యాటక ప్రాంతంగా మేడారం.. గిరిజనులకు ఉపాధి

వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకూ తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది.

తల్లుల జాతర విశేషాలతోపాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్టను సుందరీకరించడంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. 

ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో వనమంతా జనంతో నిండిపోతుంది.రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు 10 రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా గిరిజన, గిరిజనేతర భక్తులు వస్తారు. ‘కుంభమేళా’ తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలోనే.

ఇంత ప్రాశస్త్యం ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ, కేంద్రం మాత్రం ఏళ్ల నుంచి తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరో సారి ప్రస్తావించడంతోపాటు స్మృతి వనం వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

700 కోట్లతో కోకా కోలా ప్లాంట్ ..!

- పెద్దపల్లి జిల్లాలో కోకా కోలా ప్లాంట్ ఏర్పాటు

- విదేశీ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ అంతర్జాతీయ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. అమెరికా పర్యటలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై.. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో కోకా కోలా ప్లాంట్ ఉండగా.. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు మంత్రులు తెలిపారు.అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోకా కోలా గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించాలని కంపెనీని మంత్రులు ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన జోనథన్‌.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ప్లాంట్‌ని సంస్థ పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ ఆర్మ్ అయిన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ (HCCB) స్థాపించనుంది. ఇది ఇప్పటికే ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రదేశాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే.. ఆ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం..

హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 

శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్న నేతలు..

సమావేశం తర్వాత గవర్నర్ను కలవనున్న 3 పార్టీల నేతలు..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా..

చంద్రబాబును ఆహ్వానించనున్న గవర్నర్

కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు

•పోర్ట్‌ఫోలియో పంపిణీపై అందరి దృష్టి

ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత, ఇప్పుడు వారి శాఖలను పంపిణీ చేస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తన మూడవ దఫాలో, మంత్రి మండలిలోని సహచరులకు శాఖలను పంపిణీ చేశారు.

నివేదికల ప్రకారం, నితిన్ గడ్కరీకి వరుసగా మూడవసారి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లభించే అవకాశం ఉంది, అయితే, హర్ష్ మల్హోత్రా మరియు అజయ్ తమ్టాలకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎస్ జైశంకర్ వద్దే ఉంటుంది. మోడీ ప్రభుత్వం రెండో దఫాలో జైశంకర్ విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు.

ఏ మంత్రివర్గం ఎవరికి వచ్చిందో తెలుసుకోండి:-

• జ్యోతిరాదిత్య సిధియా టెలికాం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తారు.

• భూపేంద్ర యాదవ్‌కు పర్యావరణ మంత్రి పదవి ఇవ్వబడింది.

• ప్రహ్లాద్ జోషిని వినియోగదారుల మంత్రిగా చేశారు.

• మోడీ ప్రభుత్వంలో రవ్‌నీత్ బిట్టు మైనారిటీ శాఖ సహాయ మంత్రిగా చేశారు.

• సర్బానంద సోనోవాల్‌కు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది.

• టీడీపీ నేత రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు.

• బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోగ్య మంత్రిగా చేశారు.

• మోడీ 3.0లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ విద్యా మంత్రిగా కొనసాగుతారు.

• కిరెన్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు.

• చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది.

• గజేంద్ర షెకావత్ ఆర్ట్ టూరిజం మరియు కల్చర్ మంత్రిగా చేశారు. దీంతో పాటు సురేశ్ గోపీకి రాష్ట్ర పర్యాటక, కళ, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

• పీయూష్ గోయల్‌ను వాణిజ్య మంత్రిగా, శ్రీపాద్ నాయక్‌కు ఇంధన శాఖ సహాయ మంత్రిగా చేశారు.

• మోడీ 3.0లో, CR పాటిల్‌కు జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది.

• శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రెండు మంత్రిత్వ శాఖలు లభించాయి, అతనికి పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది. దీంతోపాటు ఆయనకు వ్యవసాయ శాఖను కూడా కేటాయించారు.

• అశ్విని వైష్ణవ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కమాండ్ ఇవ్వబడింది. మోదీ ప్రభుత్వం రెండో దఫాలో వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు.

• హర్యానాకు చెందిన బీజేపీ నేత, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు విద్యుత్ శాఖ మంత్రి పదవి దక్కింది. శ్రీపాద్ నాయక్ MOS పవర్‌గా ఉంటారు.

• మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల బాధ్యతను కూడా పొందవచ్చు, తోఖాన్ సాహు రాష్ట్ర మంత్రిగా ఉంటారు.

• విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమాండ్ మరోసారి S. జైశంకర్‌కు ఇవ్వబడింది.

జూన్ 9 రాత్రి 7.15 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీతో పాటు మంత్రి మండలిలో ఆయన 71 మంది సహచరులతో పదవీ ప్రమాణం మరియు గోప్యత ప్రమాణం చేయించిన సంగతిని మీకు తెలియజేద్దాం. వరుసగా మూడోసారి ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలోని కేబినెట్‌లో ఏడుగురు మహిళా మంత్రులు చోటు దక్కించుకున్నారు. మాజీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రధాని మరోసారి విశ్వాసం ప్రదర్శించారు. సీతారామన్‌తోపాటు రాష్ట్ర మాజీ మంత్రి అన్నపూర్ణాదేవి, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎన్నికైన అనుప్రియా పటేల్, కర్ణాటక నుంచి ఎన్నికైన శోభా కరంద్లాజే మరోసారి మంత్రివర్గంలోకి వచ్చారు. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన మహిళా నేతల్లో 37 ఏళ్ల రక్షా నిఖిల్ ఖడ్సే పేరు కూడా ఉంది.

చంద్రబాబు కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్?.. పదవి ఫిక్స్, ఏ శాఖ అంటే!

భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానున్నాయి. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. అటు లోకేశ్ సైతం మంత్రివర్గంలో చేరనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరి పాత్ర పైన స్పష్టత వచ్చింది. ఎన్నికల హామీల అమలు..మూడు పార్టీల సమన్వయం ఈ ఇద్దరికి కీలకంగా మారనుంది. ఇద్దరి శాఖలు ఖరారయ్యాయి.

చంద్రబాబు కసరత్తు

ఏపీలో ఈ సారి పాలన - మిత్రపక్షాలతో సమన్వయం చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది. జనసేన, బీజేపీ నుంచి మంత్రుల సంఖ్య..శాఖల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్, బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు, 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి 135 గెలవటం..అందునా గెలిచిన వారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తో మంత్రుల ఎంపిక పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక -ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మూడు పార్టీలకు పదవులు

ఇక..జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా, ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన చంద్రబాబు - పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

పవన్ -లోకేశ్ శాఖలు

దీంతో..పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం - గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక..నారా లోకేశ్ కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, ఈ సారి రాజధాని - యువతకు ఉపాధి కల్పన కీలకం కావటంతో ఈ శాఖలు కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం సైతం పట్టణాభివృద్ధి పరిధిలోకి రానుంది. రాజధాని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉండటంతో..లోకేష్ వద్దే ఉంచుతారా లేక, గతంలో పర్యవేక్షించిన నారాయణకు తిరిగి అప్పగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ..?

కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయని ప్రచారం సాగుతోంది.

ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Etela Rajender)కు ఆశాభంగం తప్పలేదు.

ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ(BJP) రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. ఇప్పుడు వారిద్దరిని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చూస్తున్న మోదీ - షా ద్వయం రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఈటలకు అప్పగించాలని భావిస్తోందట.

మంత్రి పదవి ఆశించి నిరాశలో మునిగిపోయిన ఈటలకు ఇలా అయినా కూల్ చేద్దామని బీజేపీ పెద్దల ప్లాన్‌గా తెలుస్తోంది.