ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఈ మార్పు
ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఈ మార్పు .. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అని అన్నారు. ప్రజలలోను వ్యతిరేకత ఓటు ద్వారా మార్పు చూపించారని.. ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకనే ఇంతటి ఘన విజయాన్ని అందించారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గాజువాక నియోజకవర్గం 76వ వార్డు భర్మా కాలనీలో వార్డు కార్పొరేటర్ గందం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమ్మవారు మొక్కను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు కి పసుపు కుంకమలు సమర్పించి, 101 కొబ్బరికాయలు అమ్మవారి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ గదం శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు ఎంఎల్ఏ గా విజయం సాధించి, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అమ్మవారి కి పసుపు , కుంకుమ సమర్పిస్తామని మొక్కుకున్నామని, ఆ మొక్కు ను చెల్లించుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ప్రజలు అఖండ విజయాన్ని అందించారని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ధపల వారీగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బాసేట్టి అప్పారావు, తాటికొండ సుదర్శన్, కాతా బాలకృష్ణ, వెల్లంకి శివరాం ప్రసాద్, వి య్యప్ప వెంకన్న, రౌతు గోవింద్, ములకల పల్లి ఈశ్వర రావు, కూన వెంకట రావు, రాజా, సత్యారావు, శివ టీడీపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు తది తరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీని పెంచిలి
ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి డిమాండ్. ,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు పరవాడ మండలం భరణి కం గ్రామంలో శుక్రవారం పర్యటించి డిమాండ్ చేశారు. మండుటెండలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు పేస్లిప్లు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వడం లేదు ఎండవేడికి ప్రభుత్వం ఉపాధి కూలీలకు టెంట్లు ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీరు సౌకర్యం కల్పించాలని 30 శాతం వేసవి అలవెన్సు ఇచ్చి ఆదుకోవాలని, ప్రతి 15 రోజులకి ఒకసారి పని చేసిన కూలి డబ్బులు ఇవ్వాలని సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి రోజు వేతనం 600 ఇవ్వాలని కోరారు ,ఈ కార్యక్రమంలో భరణం కం ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
వెండితెర మహనీయులు దగ్గుపాటి రామా నాయుడు
వెండితెర వెలుగు రామానాయుడు. —' మా-ఎపి' దిలీప్ రాజా-
వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ రామానాయుడు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మా - ఎపి' కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డు గ)హీత, శతచిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అయిదు దశాబ్దాలుగా సినీపరిశ్రమ కు ఎనలేని చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అని దిలీప్ రాజా తెలిపారు. . రామానాయుడు స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోయిన్లను పరిచయం అయ్యారని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం రామానాయుడు సేవకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మ భూషణ్ ద్వారా అందుకోవడమే కాకుండా రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాల్లో ఎన్టీఆర్, అక్కినేని,, శోభన్ బాబు లాంటి  అగ్ర హీరోలు   గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రామానాయుడు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వర్ధమాన నటి టీనాచౌదరి, మా ఏపి సభ్యులు మిలటరీ ప్రసాద్, మన్నెసత్యనారాయణ, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయ భాస్కర్, మధుకర్, యం. శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు.
సిపిఎం కు ఓటేసిన ఓటర్లకు ధన్యవాదాలు
ప్రజామార్పు.. చింతపల్లి సిపిఎం పార్టీ ఎంపీ కి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో సమస్యలు స్వాగతం పలుకుతాయని సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు, గురువారం చింతపల్లి జికేవిది కొయ్యూరు మండలాల సిపిఎం పార్టీ కార్యకర్తలతో ఎన్నికల సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ అరకు పార్లమెంటు సిపిఎం పార్టీ అభ్యర్థికి ఎన్నికల మెటీరియల్ ఖర్చులు తప్ప ప్రజలకు ఖర్చు పెట్టకుండా 1 లక్ష23 వేల ఓట్లు స్వచ్ఛందంగా ఓట్లు వేసిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నిరుద్యోగ వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీ వారికి గ్రామ గిరిజన ప్రజలకు సిపిఎం పార్టీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తుందని అన్నారు, అంతేకాకుండా ఓటర్లు చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ సమస్యలపై అండగా నిలబడి సిపిఎం పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుందని అన్నారు, అలాగే రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం సమస్యలతో స్వాగతం పలుకుతుందని అన్నారు, అనేక గ్రామాలలో త్రాగు సాగునీరు రోడ్లు కరెంటు వంటి మౌలికమైన సదుపాయాలతో పాటు, రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు హక్కులు 1/70 చట్టం జీవో నెంబర్ 3 నకిలీ గిరిజనులు ఐదవ షెడ్యూల్ ప్రాంతం కాపాడవలసిన బాధ్యత ఏర్పడబోయే ప్రభుత్వ మీద ఉందని అన్నారు, ఇదే కాకుండా గిరిజన ప్రాంతంలో అరకు చింతపల్లి కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలు నిలుపుదల, అడవుల సంరక్షణ పేరుతో అంబానీ ఆదానీలకు భారతదేశం అడవులు ప్రైవేటీకరణను గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిగణంలో తీసుకోవాలని సూచించారు, గిరిజన గ్రామాలలో లెటర్ రైట్ మైనింగ్ ఎర్రమట్టి లాంటి ఖనిజాలను తీసి ఆ ప్రాంతాలను పంట పొలాలు మంచినీళ్లకు దూరం చేస్తున్నారని ఇటువంటి వాటి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు, పాడేరు అరకు చింతపల్లి కేంద్రంగా చిన్న తరహా పరిశ్రమాలు కాఫీ మిర్యాలు మొక్కజొన్న చింతపండు అడ్డాకులు విస్తర్లు ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జీకే వీధి మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు. ఎస్ సూరిబాబు కో య్యూరు, పాంగి ధనుంజయ్ చింతపల్లి, సాగిన చిరంజీవి గడుతూరి సత్యనారాయణ వై అప్పలనాయుడు ఎస్ సింహాచలం సానా తదితరులు పాల్గొన్నారు.
నెలరోజుల్లో అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేస్తా: పల్లా
నెలరోజుల్లో అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేస్తా
  పల్లా గాజువాక నియోజకవర్గం పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజాను నెలరోజుల్లో ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు   గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా  కాపాడుతామని హామీ ఇచ్చారు. . గాజువాక ఖ్యాతి దేశానికి తెలిసేలా తనకు అఖండ విజయం చేకూర్చిన  నియోజకవర్గం  ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు అభినందనలు
కన్నా బాబు ఓటమి కి కారణంలు.
కన్నబాబురాజు ఓటమికి కారణాలు       ప్రజా మార్పు --యలమంచలి
: మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఓటమికి కారణాలు పలు విధాలుగా చెప్పుకోవచ్చు ఒకటి తన వెనుక ఉన్న కేడర్ను సమాలోచనతో నడపకపోవడం తన నిర్ణయమే శిరోధార్యమని ఎన్నాళ్లు జరిగిందని తెలిపారు.ఇప్పటివరకు తనకు దీటైన నాయకుడు లేకపోవడం ఒకటి తనకు అనుకూలంగా రాష్ట్ర పరిస్థితులు మారడం ఇప్పటివరకు కలిసి వచ్చింది. యలమంచిలి పట్టణంలో మున్సిపాలిటీ పాలకవర్గం విషయంలో వైసీపీ పార్టీవారే రెండు వర్గాలుగా వ్యవహరించడం వల్ల పట్టణంలో అధిక శాతం ఓట్లు కూటమికి పోవటానికి ముఖ్య కారణం అయ్యాయి. క్షత్రియ వంశానికి చెందిన కన్నబాబు రాజు కులంబలం పెద్దగా లేకపోయినా గతంలో తన మామగారైన సత్యం రాజు టిడిపిలో మంచిపట్టున్న నాయకుడిగా పేరు ఉండటం ఆ కుటుంబం నుంచి రావడంతో ప్రజా ఆదరణ కలిసొచ్చింది. నాయకులు కార్యకర్తలు తమకు సమాజంలో గుర్తింపు లేకుండా పోతుందని ఈ ఎన్నికల ముందే అచ్యుతాపురం మండలంలో బలమైన నాయకులు పార్టీ ఫిరాయించారు. ఇది ఒక మైనస్, అలాగనే ఎమ్మెల్యే వెనకాల ఉండాలి తప్పదు అని ముక్కుతూ, ములుగుతూ తిరిగే నాయకులు ఎన్నికల్లో అంత ఉత్సాహం కనపరిచినట్లు లేదు, ఇదంతా ఒక్కటి అయితే ఈ ఎన్నికల ముందు నుంచి కూడా తన కొడుకే ఎమ్మెల్యే అని వారసత్వాన్ని చూపించి తిరగటం చాలామందికి మింగుడు పడలేదు. కన్నబాబు రాజు ముందు మాట్లాడాలంటే భయం ఎక్కువ ఎవరు ఏ సమస్యతో వచ్చినా మీరే కలవండి మేము అడగలేము అని కింద స్థాయి నాయకులు తప్పుకునేవారు. ఇవన్నీ వాటమికి కారణాలు గాని చెప్పాలి. తన పైన పోటీలో ఉన్న ఓటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గత 15 సంవత్సరాల నుండి కన్నబాబుకి ఎదురీత ఈదుతూనే వచ్చారు. తన పైన ఉన్న సానుభూతి కులం బలం  కలిసొచ్చింది.