Mane Praveen

May 10 2024, 21:39

NLG: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని లెంకలపల్లి లో విస్తృతంగా ప్రచారం
నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం, భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని, గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

హస్తం గుర్తుకు ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాక నగేష్, నాయకులు చాపల రవి, పెంబల్ల గిరి, కాటగోని కృష్ణయ్య, పాక పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 09 2024, 18:20

NLG: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజానేత నూనె సురేష్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: విద్యార్థుల రాజకీయ పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, మండలం లోని తూర్పుపల్లి గ్రామ మాజీ వార్డు మెంబర్, అడ్వకేట్ నూనె సురేష్ గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఆయనతో పాటు విద్యార్థుల రాజకీయ పార్టీ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు ఎం.డి ఇమ్రాన్, దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన నూనె వెంకటయ్య, నూనె లక్ష్మయ్య,అంజి , ఎన్నిమల్ల తిరుపతయ్య, వల్లవోజు అంజయ్య ,హరి లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టిలో చేరారు.

ఈ సందర్భంగా ప్రజానేత నూనె సురేష్ మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమం కోసం, ఎమ్మెల్యే సహకారంతో తూర్పుపల్లి గ్రామ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 09 2024, 17:40

బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం
నాంపల్లి: మండలంలో భారత రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాందాస్ తండాలో గురువారం పెద్దాపురం మాజీ ఎంపీటీసీ మెగావత్ భాషా నాయక్ స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ను గెలిపించాలని భాష నాయక్ కోరారు.

ఈ కార్యక్రమంలో హనుమంతు, ఎం. భాస్కర్, ఆదిత్య, టేఖ్య, మహిపాల్, మెగావత్ వంశీ, రమేష్, మెగావత్ శ్రీనివాస్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 09 2024, 15:33

రేపే తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయాలు
చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.

వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.

Mane Praveen

May 09 2024, 15:20

సరంపేట లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం
NLG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో  భాగంగా గురువారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా, చేతి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

Mane Praveen

May 09 2024, 15:16

NLG: దేవరకొండ ఎమ్మెల్యేను కలిసిన  AISSD జిల్లా నాయకులు
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ను వారి క్యాంప్ కార్యాలయంలో, గురువారం ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు బిక్షపతి, ఉపాద్యక్షుడు యేకుల సురేష్ మరియు సభ్యులు  మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు సంఘం గురించి వారికి వివరించారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 08 2024, 22:11

NLG: నామినేషన్ వేసిన MLC అభ్యర్థి పోతుల గంగిరెడ్డి కోటిరెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఆరవ రోజు బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా పోతుల గంగిరెడ్డి కోటిరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కు అందజేశారు.

Mane Praveen

May 08 2024, 22:07

NLG: ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ వేసిన పాలకూరి అశోక్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్దిగా పాలకూరి అశోక్, బుధవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దాసరి హరిచందన కు అందజేశారు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. యువకులు ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mane Praveen

May 08 2024, 22:04

ఎర్ర జెండా పేదలకు అండ: సిపిఎం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను గెలిపించాలని, మద్యం డబ్బు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు.

ఈరోజు మర్రిగూడ మండలం కొండూరు, వట్టిపల్లి, బట్లపల్లి , మర్రిగూడలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎర్రజెండా ఏనాటికైనా పేదలకు అండ అని, ఎర్రజెండా నీడనే పేదల హక్కులు కాపాడబడతాయని, నిరుపేదలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలంటే సిపిఎం గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల నాయకులు కొట్టం యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 07 2024, 16:46

NLG: ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో సిపిఎం ప్రచారం
మర్రిగూడ మండలం, ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల  యాదయ్య మాట్లాడుతూ.. మత రాజ్యం వద్దు ప్రజాస్వామ్యం హద్దుగా పనిచేయాలని, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పని చేసే అభ్యర్థి, నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ వారి హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించాలని కోరారు.

తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న సిపిఎం పార్టీని గెలిపించాలని దేశ రాజకీయాల్లో విశిష్టత స్థానాన్ని సంపాదించుకుందని ఆయన అన్నారు పేదలు కష్టజీవుల తరఫున నీతితో నిజాయితీతో పోరాడుతున్నది ఎర్రజెండా ఒక్కటే అని అన్నారు.

పేదల కోసం కార్మికుల కోసం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలని ఆయన అన్నారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పగిల్ల రాములు, దుర్గమ్మ, వెంకటయ్య, శివ, నందిని, తదితరులు పాల్గొన్నారు