పల్లె నిద్రతో.. పల్లె ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..
పల్లె ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..
ప్రజా సమస్యల పరిస్కారమే లక్హ్యంగా శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు "పల్లె నిద్ర" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా ఆయా గ్రామాల్లో రాత్రి సమయంలో ప్రజలతో మమేకమై గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరాతీసి వాటి పరిస్కారంపై దృష్టి సారించారు. ప్రతి పల్లెలోను వీరాంజనేయులు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
యల్లనూరు మండలంలోని వాసాపురం గ్రామంలో " మన ఊరికి మన వీరా" వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారం అనంతరం ఎస్సీ కాలనీ "పల్లె నిద్ర" కార్యక్రమం చేపట్టారు.
అక్కడ ప్రజలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానికులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో రేషన్, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయ లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను మీ అందరి దీవెనలతో రానున్న ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించిన వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.
ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Apr 13 2024, 07:28