వైఎస్సార్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించాలి..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ..
వైఎస్సార్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని, ప్రతిఒక్కరూ " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయాలని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
![]()
యల్లనూరు మండలం కోడుమూర్తి, చిలమకూరు, అచ్యుతాపురం, బొప్పేపల్లి, వాసాపురం, కూచివారిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన నిర్వహించారు.
ఇంటింటికీ తిరుగుతూ జగనన్న చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించి, గడప వద్దకే సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. రానున్న ఎన్నికల్లో " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ కరపత్రాలు అందజేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..ప్రతిపక్ష టీడీపీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలను నేరుగా అందించిన ఘనత వైస్సార్సీపీకే దక్కుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి రహితంగా ప్రభుత్వ పథకాలను అందించటం జరిగిందన్నారు. జగనన్న నేతృత్వంలో పారదర్శక పాలనను చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నాడన్నారు.
రాష్ట్రంలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ప్రజలను మోసగించేందుకు వస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని కూటములతో వచ్చినా ప్రజల అండ ఉన్నంతవరకు జగనన్నని ఏమీ చేయలేరన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని రానున్న ఎన్నికలలో జగనన్నకు తమ ఓటు వేస్తామని ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 13 2024, 07:19