రంజాన్ పండుగ సందర్భంగా దండు శ్రీనివాసులు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముస్లీం యువత..
రంజాన్ పండుగ సందర్భంగా దండు శ్రీనివాసులు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముస్లీం యువత..
శింగనమల : ముస్లిం సోదర సోదరీమణులు పవిత్రంగా అల్లా స్మరణతో, భక్తి పారవశ్యంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి, నెలవంక రాకతో పండుగ వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి కార్యాలయంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... రంజాన్ పండుగ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని చెప్పారు. అల్లా అనుగ్రహం కోసం 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండడం గొప్ప విషయమన్నారు. ఇస్లాం అంటే మత సామరస్యానికి ప్రతీక అని ప్రతీ ఒక్కరు ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని. ఆ అల్లా చల్లని దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో ముస్లీం యువత బాబావలి,దాదు,సర్పయాజ్ మౌలా, అమీనాబీగారిమహ్మద్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, బిసి సెల్ పార్లమెంటు అధికార ప్రతినిధి బండి పరుశురాం బిసి సెల్ శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి, శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, మల్లిఖార్జున, దాసరి వెంకటరమణ, రంగస్వామి, దండు ప్రకాష్, నాయీ బ్రాహ్మణ సాధికారత కమిటీ సభ్యులు వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు
Apr 12 2024, 08:39