అమ్మాయిలకేది రక్షణ ...అధికారులు ఏం చేస్తున్నారు: కొడారి వెంకటేష్ ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు
![]()
నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపమైపోయిందని, అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కామాందుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఏడాది కాలంగా అభం శుభం తెలియని అమాయక పిల్లలపై ప్రధానోపాధ్యాయుడే కాటేస్తుంటే మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం, నెల నెలా లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటూ పిల్లల హక్కుల్ని భంగం చేస్తున్నారని ఆయన అన్నారు. గుండాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి చేసిన అఘాయిత్యానికి మొత్తం ఉపాద్యాయ లోకం తలదించుకుని, సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి లో పరీక్ష రాస్తున్న సమయంలో ఓ లెక్చరర్ అసభ్య ప్రవర్తన, చౌటుప్పల్ లో తల్లిదండ్రుల వద్ద ఆదమరచి నిద్రపోతున్న చిట్టితల్లిని ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు తన కోరిక తీర్చుకోవడం, గుండాల లో విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో తల ఎత్తుకొని నిలబడేలా చేయాల్సిన గురువే, ఆ చిన్నారులతో తన కోరికలు తీర్చుకునే సంఘటనలు చూస్తుంటే, పిల్లలను చదువులు మాన్పించి, బాల్యవివాహాలు చేసి బాధ్యత తీర్చుకోవడమే మంచిదని తల్లిదండ్రులకు భావన కలుగుతుందని ఆయన అన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడినా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా, నిందితులకు ఉరిశిక్షే సరియైన శిక్ష అని ఆయన అన్నారు .భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు , చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో కలిసి వలిగొండ ఎస్సై డి మహేందర్ మంగళవారం రాత్రి ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న దొంగతనాలు , చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో టీం సభ్యులు తమ తమ గ్రామాలలో గస్తీ నిర్వహించి ,దొంగతనాలు జరగకుండా చూడాలని అన్నారు .అనుమానం ఉన్న వ్యక్తులు తారాసపడితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు చేగూరి మోహన్, చేగూరి బాలకృష్ణ, టి గణేష్ రెడ్డి, చేగూరి మల్లేష్ ఆధ్వర్యంలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రజలకు వెలువర్తి గ్రామంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పూజారి ఆదిత్య శర్మ ఉగాది పర్వదిన ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు పంచాంగాన్ని వినిపించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య, దేవాలయ కమిటీ సభ్యులు ,భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం రైలు నుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల , ప్రకారం వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంటూరుకు చెందిన పాటిబండ్ల నాగార్జున వయస్సు 23 ,ఇతను సికింద్రాబాద్ నుండి గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుండి పడి, తీవ్ర గాయాలు అయ్యాయి .అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది గమనించి 108 వారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది తమ సెల్ ఫోన్ లను నిషేధిస్తూ సోమవారం ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. విలేఖరుల తో పాటుగా ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్ట్రీస్ సిబ్బంది, మతపర సిబ్బంది ,నాలుగో తరగతి సిబ్బంది ,ఎస్పీఎఫ్, హోం గార్డ్స్ ,ఔట్సోర్సింగ్ సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ కార్యనిర్వణాధికారి కార్యాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీపీ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా రావన్నపేట ఎంపీపీ గా ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన పూస బాలమని- బాల నరసింహ ఎన్నికైనారు. రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బాలమణి కి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , మండల నాయకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, భూతం గణేష్ ,భూతం బాలస్వామి ఎంపీపీ బాలమణి- బాల నరసింహ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
యాదాద్రి జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలని యదాద్రి భువనగిరి జిల్లా తాగు నీటి సరఫరా ప్రత్యేక అధికారిణి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశించారు.ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రామాలు, మున్సిపాలిటీలలో తాగు నీటి సరఫరాపై మిషన్ భగీరథ, మున్సిపల్, ఇంజనీరింగ్, ఎంపీడీవో అధికారులతో మండలాలు, మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. జిల్లాలో తాగునీటికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని అన్నారు . తప్పనిసరిగా ప్రతినెలా 1, 11 ,21 తేదీలలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనిషి నిరంతరం ప్రజా సేవకుడు ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని ఈరోజు సోమవారం భువనగిరి మండలం నందనం సిపిఎం గ్రామ శాఖ సమావేశానికి భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కి సిపిఎం అభ్యర్థి ప్రజా ఉద్యమ నాయకుడైన ఎండి జహంగీర్ గారి గెలిపించాలని అన్నారు.ఆయన గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయా జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటాలు దినచర్య గా కొనసాగుతున్న ఎండి.జహంగీర్ ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలంతా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి సిపిఎం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేయాలని నరసింహ అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లవ్డియ రాజు ,సింగిరెడ్డి భూపాల్ రెడ్డి ,కొల్లూరు సిద్దిరాజు, లచ్చిరెడ్డి , కొల్లూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Apr 10 2024, 16:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.0k