జగనన్నకే జనం మద్దతు.. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైయస్సార్ సీపీ.. వైసీపీ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
జగనన్నకే జనం మద్దతు.. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైయస్సార్ సీపీ.. వైసీపీ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
ప్రజలందరి మద్దతు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని, అన్నీ వర్గాలకు న్యాయం చేసిన వైయస్సార్ సీపీ గెలుపు ఖాయమని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండలం నర్సాపురం, ఎస్ టీ కాలనీ, నిలితొట్టిపల్లి, దుగుమర్రి, తుంపెర, గంగనపల్లి, గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన చేపట్టారు.
గ్రామాల్లోని స్థానికులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగనన్న చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వివరించారు. ఈ సంక్షేమం ఇలానే కొనసాగలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనమంతా గెలిపించుకోవాలని కోరారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ...జగనన్న పాలనలో సమాజంలో అన్నీ వర్గాలకు సమన్యాయం జరుగుతోందన్నారు. అందుకే అన్ని సామాజిక వర్గాల వారుఆయనకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, తమకు నిజమైన మేలు చేసేది జగనన్నే అని గుర్తిస్తున్నారని వెల్లడించారు. నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన పేదలు భవిష్యత్తులో కూడా అవి సజావుగా కొనసాగాలంటే మళ్లీ జగనన్నని గెలిపించుకోవాలన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలతో కూడిన దుష్ప్రచారాలు చేసినా 2024లో ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 09 2024, 07:23