అమ్మా.. ఆశీర్వదించండి.. సంక్షేమం, అభివృద్ధిని చూసి "ఫ్యాన్" కు ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
అమ్మా.. ఆశీర్వదించండి.. సంక్షేమం, అభివృద్ధిని చూసి "ఫ్యాన్" కు ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ టీడీపీ చేసిన వాగ్దానాలను నమ్మకండి
ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఆశీర్వదించాలని, ప్రజలందరి దీవెనలు కావాలని కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమం, అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికలలో " ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మరియు టిడిపి నెరవేర్చని హామీలతో ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారని వారి మాటలు నమ్మకండి అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట, రేకులకుంట, గాంధీనగర్ గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో ఆయన నిర్వహించారు.
ముందుగా గ్రామాల్లో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని వివరిస్తూ, రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును "ఫ్యాన్" గుర్తుపై వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేసి అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న చేసిన మేలుని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ప్రజలను మభ్య పెట్టేందుకు జనసేన, బిజెపి కూటమిగా వస్తున్నారని కూటమిని కుప్పకూల్చి ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. వైయస్ఆర్ సీపీ పార్టీ పెత్తందారుల పార్టీ కాదు పేదల పార్టీ అని మరోసారి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించి జగనన్న రుజువు చేశారన్నారు. గ్రామాల్లో ఇంటింటా సంక్షేమ పథకాలు అందించడంతో వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 07 2024, 07:52