Venkatesh1

Apr 05 2024, 07:07

రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ని కలిసిన అనంతపురం ఉమ్మడి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు ఆలం నరసానాయుడు గారి నివాసం లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.* ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,అంబికా వీక్షిత్ గారు,రామ్మోహన్,ఇల్లూరు రామాంజనేయులు,లక్ష్మి నాయుడు,నాగభూషణ,వెంకట్,బాలకృష్ణ,వెంకటేష్,నాని,చెన్నమయ్య తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 05 2024, 06:59

బండారు శ్రావణి శ్రీ గారి నివాసంలో అనంతపురం పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ

శింగనమల టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి అయిన బండారు శ్రావణి శ్రీ గారి నివాసంలో అనంతపురం పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారిని శ్రావణి శ్రీ గారు వారి కుటుంబ సభ్యులు దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించడం జరిగింది..

Venkatesh1

Apr 05 2024, 06:49

వీరాంజనేయులును గెలిపించండి.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రమీల..

వీరాంజనేయులును గెలిపించండి.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రమీల..

ముఖ్యమంత్రి వైయస్ జగనన్న ఆశీస్సులతో ప్రజల ముందుకు వస్తున్న తన భర్త వీరాంజనేయులును ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ సిహెచ్ ప్రమీల ఓటర్లను అభ్యర్థించారు.

బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి, కొత్త చెదళ్ల, రోటరీపురం గ్రామాలలో వైయస్సార్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు.

ముందుగా నీలాంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజ నిర్వహించారు. 

ఇంటింటా తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, రానున్న ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా మరోసారి జగనన్న చేసుకుంటే సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతాయని, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆమె అన్నారు.

Venkatesh1

Apr 05 2024, 06:42

అండగా నిలబడదాం.. మెజార్టీతో గెలిపిద్దాం.. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

అండగా నిలబడదాం.. మెజార్టీతో గెలిపిద్దాం.. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

బస్సు యాత్రలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో డ్రైవర్లతో సమావేశమైన జగనన్న మరోసారి వీరాంజనేయులు గురించి ప్రస్తావించారు. ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలన్నదే ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

జగనన్న దీవెనలతో ఎమ్మెల్యే 

అభ్యర్థిగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు కోరారు.

యల్లనూరు మండలం వేములపల్లి, నిట్టూరు, మేడికుర్తి, పెద్ద మల్లేపల్లి, పీఎం.కొండాపురం, తిరుమలాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి ఆయన నిర్వహించారు.

గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో అందిన లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించారు. పేదవాడిగా మీ ముందుకు వస్తున్నా, మీ సేవకుడిగా పని చేస్తాను, రానున్న ఎన్నికలలో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విన్నవించుకున్నారు.

ఎం. వీరాంజనేయులు మాట్లాడుతూ.. సీఎం జగనన్న చేసిన సంక్షేమ పాలన ముందు ఎన్ని పార్టీల కలయికతో చంద్రబాబు నాయుడు కలసి వచ్చినా టీడీపీకి ఓటమి తప్పదన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఒక్కరోజైనా పేదల కోసం ఆలోచన చేయలేదన్నారు. ఆరువందల హామీలిచ్చి వాటిని గాలికొదిలేసారని, మహిళలకు చంద్రబాబు ఎగ్గొట్టిన సున్నా వడ్డీ, రుణమాఫీ వంటి బకాయిలను జగనన్న తీర్చారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జగనన్న సంక్షేమాభివృద్ధి పథంలో నడిపిస్తే టీడీపీ మాత్రం వారి జేబులు నింపుకున్నారన్నారు. గ్రామాల్లో అవ్వాతాతలకు ఇంటి దగ్గరకు పింఛన్లు ఇవ్వకుండా చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటు రూపంలో బుద్ధి చెబుతాం అంటున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగన్ ను చేసుకోవడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 04 2024, 07:58

మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిద్దాం.. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్ళీ గెలిపిద్దాం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిద్దాం

జగనన్న సీఎంగా ఉంటేనే సక్రమంగా పథకాలు

"ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్ళీ గెలిపిద్దాం

పొత్తులు పెట్టుకున్న పార్టీలను నమ్మొద్దు

శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని వీరాంజనేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పుట్లూరు మండలం కందిగోపుల, చింతకుంట, చాలవేముల, రంగరాజుకుంట, కుమ్మనమల, తురకవానిపల్లి, కొండగారికుంట, రంగినేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.

గ్రామాల్లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు ఇలానే సక్రమంగా అందుతాయని రానున్న ఎన్నికలలో మీ అందరి ఓటు "ఫ్యాన్" గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతినెల ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి అందించే పింఛన్ల పంపిణీని టిడిపి నేతలు అడ్డుకున్నారన్నారు. పేదల ఉసురు చంద్రబాబునాయుడుకు తగలకుండా మానదన్నారు. ఎన్నికలవేళ ప్రజలను మోసం చేయడానికి టిడిపి నేతలు ఇంటి దగ్గరికి వస్తున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మంచి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తమ ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటున్న వృద్ధులు

తెల్లవారుజామున నిద్రలేవక మునుపే ఇంటి దగ్గరే కుటుంబ పింఛన్ అందిస్తూ వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన తమ మనవడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గెలవలేరన్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న తమలాంటి వృద్ధుల కడుపు కొట్టిన చంద్రబాబుకు మా ఉసురు తప్పకుండా తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 03 2024, 10:45

ముంటి మడుగు కేశవరెడ్డి కాట్టప్ప గారి రామలింగారెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలని కోరిన MP అభ్యర్థి

అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారి నివాసం లో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారిని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలి అని కోరిన అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ గారు*

Venkatesh1

Apr 03 2024, 07:35

ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గెలుపు కొరకు గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ప్రచారం చేసిన ఆలం నర్స నాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం H సోదనపల్లి, మంగపట్నం గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గెలుపు కొరకు గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైసీపీ అదికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అందకారం అయిందని ఒక ఛాన్స్ తో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంను సర్వనాశనం చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు, దాడులుకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఏదీ ఏమైనా ఎన్నికలలో టీడీపీదే విజయమన్నారు.వైసీపీ ని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చిత్తుగా ఓడించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు.

గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిని చేసారని వచ్చిన నిధలున్ని వైసీపీ నేతలు రంగులు పిచ్చితో టీడీపీ హయంలో నిర్మించిన భవనాలుకు రంగులు వేశారన్నారు.

తమ సొంత పేపరుకు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు.శిoగనమల నియోజకవర్గం లో ఎక్కడ చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది అని నరసానాయుడు తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 03 2024, 07:24

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. సీఎం జగనన్న పాలన అపూర్వం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. సీఎం జగనన్న పాలన అపూర్వం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను మీ బిడ్డగా ఆశీర్వదించి ఓటువేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.

నార్పల మండలం చామలూరు, నిలువురాయి, కర్ణపుడికి, కురగానిపల్లి, కేశేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకులతో కలసి చేపట్టారు.

గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాలు ఏ మేరకు సంతృప్తినిస్తున్నాయి తదితరులు అంశాలు అడిగి తెలుసుకున్నారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ..చివరకు అవ్వాతాతలపై కూడా కుట్రకు పాల్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమంతో పాటు పేదప్రజలంతా విద్య, వైద్యానికి దూరమయ్యారన్నారు. వైఎస్ఆర్సిపి పాలన చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్లు, రోడ్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో చేపట్టినవి కాదా అని టీడీపీని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో ప్రజలు మళ్ళీ వైసీపీకి పట్టం కట్టబోతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 03 2024, 07:14

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక.. జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు..

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం నిలవురాయి గ్రామంలో టీడీపీ నాయకుడు జనార్దన్ వెంకటేష్ కుటుంబం, కర్ణపుడికి గ్రామంలో టీడీపీ నాయకుడు బుసగాని విశ్వనాథ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు.

జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. 

రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 02 2024, 09:25

సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న టీడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు

సింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో ఎన్నికల ప్రచార నిమిత్తం మేడికుర్తి, నిట్టూరు, పెద్దమల్లెపల్లి ,పీఎం కొండాపురం ,వేములపల్లి గిరమ్మ బావి గ్రామాల్లో పర్యటించి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు గారు మరియు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మండల కన్వీనర్లు క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇంచార్జిలు బూత్ ఇంచార్జిలు తెలుగుదేశం కార్యకర్తలు మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది