అండగా నిలబడదాం.. మెజార్టీతో గెలిపిద్దాం.. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
అండగా నిలబడదాం.. మెజార్టీతో గెలిపిద్దాం.. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
బస్సు యాత్రలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో డ్రైవర్లతో సమావేశమైన జగనన్న మరోసారి వీరాంజనేయులు గురించి ప్రస్తావించారు. ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలన్నదే ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
జగనన్న దీవెనలతో ఎమ్మెల్యే
అభ్యర్థిగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు కోరారు.
యల్లనూరు మండలం వేములపల్లి, నిట్టూరు, మేడికుర్తి, పెద్ద మల్లేపల్లి, పీఎం.కొండాపురం, తిరుమలాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి ఆయన నిర్వహించారు.
గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో అందిన లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించారు. పేదవాడిగా మీ ముందుకు వస్తున్నా, మీ సేవకుడిగా పని చేస్తాను, రానున్న ఎన్నికలలో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విన్నవించుకున్నారు.
ఎం. వీరాంజనేయులు మాట్లాడుతూ.. సీఎం జగనన్న చేసిన సంక్షేమ పాలన ముందు ఎన్ని పార్టీల కలయికతో చంద్రబాబు నాయుడు కలసి వచ్చినా టీడీపీకి ఓటమి తప్పదన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఒక్కరోజైనా పేదల కోసం ఆలోచన చేయలేదన్నారు. ఆరువందల హామీలిచ్చి వాటిని గాలికొదిలేసారని, మహిళలకు చంద్రబాబు ఎగ్గొట్టిన సున్నా వడ్డీ, రుణమాఫీ వంటి బకాయిలను జగనన్న తీర్చారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జగనన్న సంక్షేమాభివృద్ధి పథంలో నడిపిస్తే టీడీపీ మాత్రం వారి జేబులు నింపుకున్నారన్నారు. గ్రామాల్లో అవ్వాతాతలకు ఇంటి దగ్గరకు పింఛన్లు ఇవ్వకుండా చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటు రూపంలో బుద్ధి చెబుతాం అంటున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగన్ ను చేసుకోవడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 05 2024, 06:49