మీ బిడ్డగా ఆశీర్వదించండి.. సీఎం జగనన్న పాలన అపూర్వం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
మీ బిడ్డగా ఆశీర్వదించండి.. సీఎం జగనన్న పాలన అపూర్వం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను మీ బిడ్డగా ఆశీర్వదించి ఓటువేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.
నార్పల మండలం చామలూరు, నిలువురాయి, కర్ణపుడికి, కురగానిపల్లి, కేశేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకులతో కలసి చేపట్టారు.
గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాలు ఏ మేరకు సంతృప్తినిస్తున్నాయి తదితరులు అంశాలు అడిగి తెలుసుకున్నారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ..చివరకు అవ్వాతాతలపై కూడా కుట్రకు పాల్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమంతో పాటు పేదప్రజలంతా విద్య, వైద్యానికి దూరమయ్యారన్నారు. వైఎస్ఆర్సిపి పాలన చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్లు, రోడ్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో చేపట్టినవి కాదా అని టీడీపీని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో ప్రజలు మళ్ళీ వైసీపీకి పట్టం కట్టబోతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Apr 03 2024, 07:35