ఫర్టిలైజర్ దుకాణం యజమాని వీరభద్ర(40) దారుహత్య..
అనంతపురం జల్లా నార్పల మండల కేంద్రంలో ఫర్టిలైజర్
దుకాణం యజమాని వీరభద్ర(40)ను
దారుహత్య..
సమీప బంధువులు హత్య చేసినట్టు
సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఇంటింటికి కుళాయిల ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కరిస్తాం... ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు..
శింగనమల నియోజకవర్గం,పుట్లూరు మండలం,తిమ్మాపురం గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శింగనమల నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ముంటిమడుగు కేశవరెడ్డి గారు.* *తిమ్మాపురం గ్రామం నందు నీటి సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్నోసార్లు ఎంతోమందికి వినతి చేసిన నీటి సమస్య పరిష్కారం చేయలేదు.
ఈరోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా బండారు శ్రావణి శ్రీ గారు టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లినప్పుడు నీటి కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు*.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలకు బండారు శ్రావణి శ్రీ గారు స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్ల రూపాయలు ఆదాయంగా మలుచుకున్నారే తప్ప,భూగర్భ జలాలు ఇంకిపోతున్న పట్టించుకోలేదు*.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే గ్రామాల యందు ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి,నీటి సమస్య పరిష్కారం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.*
గార్లదిన్నె మండలం కె కె. తాండ గ్రామంలో "పల్లె నిద్ర" చేసిన.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
నవరత్నాలతో ప్రజల సంక్షేమం మెరుగు..
శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
రాష్ట్రంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలతో ప్రజల సంక్షేమం మెరుగుపడిందని వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం కె కె. తాండ గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
స్థానిక ప్రజలతో కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని జగనన్న నింపుకున్నారన్నారు. ఇలాంటి గొప్ప పాలన మళ్లీ మనకు రావాలి అంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం గ్రామంలో బస చేశారు.
సామాన్యుడిని.. ఆశీర్వదించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
సామాన్యుడిని.. ఆశీర్వదించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సామాన్య పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద బాధ్యత అప్పగించారని తనను గెలిపించాలని ఎం. వీరాంజనేయులు కోరారు.
గార్లదిన్నె మండలం ముకుందాపురం, యర్రగుంట్ల, కేకే తాండ, కొట్టాలపల్లి, కామలాపురం గ్రామాల్లో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబుళేసు, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులుతో కలసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
గ్రామాల్లోని పార్టీ శ్రేణులు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్దిని వివరిస్తూ, నిరుపేదను దీవించి "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేస్తూ అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని వలంటీర్ల వ్యవస్థతో మన రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించి అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎం జగనన్న పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా, తాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతారని ఈసీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. జగనన్న పరిపాలనలో ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందించడం వల్ల చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఇలాంటి నీచ పనులకు పాల్పడుతున్నారన్నారు. పేదల ఉసురు తగులుతుందన్నారు. ఇలాంటి ఘాతకానికి తలపడుతున్న టిడిపికి ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి తనకు, ఎంపీ అభ్యర్థి గా శంకర్ నారాయణ కు "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి వైసీపీ పెద్ద పీట.. పల్లె నిద్ర కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
పేదల అభ్యున్నతికి వైసీపీ పెద్ద పీట.. పల్లె నిద్ర కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విదంగా పెద్ద పీట వేశారని వీరాంజనేయులు తెలిపారు.
ఎన్నికల ప్రచారం అనంతరం యల్లనూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో ఆరవ రోజు "పల్లెనిద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కాలనీలో గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఇలానే పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసునన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయుచున్న తనను ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు.
మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచాక తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలో బస చేశారు.
ఆదరించండి..గెలిపించండి.. ప్రజాసేవకు పూర్తిగా అంకితం అవుతా.. ప్రజలకు, జగనన్నకు బాధ్యుడినై ఉంటా. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
ఆదరించండి..గెలిపించండి.. ప్రజాసేవకు పూర్తిగా అంకితం అవుతా.. ప్రజలకు, జగనన్నకు బాధ్యుడినై ఉంటా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని, నియోజకవర్గంలోని ప్రజలందరు ఆదరించి..గెలిపించాలని వీరాంజనేయులు అన్నారు.
యల్లనూరు మండలం నీర్జాంపల్లి, లక్షుంపల్లి, దంతలపల్లి, గడ్డంవారిపల్లి, లింగారెడ్డిపల్లి, మల్లాగుండ్ల గ్రామాలలో పార్టీ నాయకులతో కలసి "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేపట్టారు.
ముందుగా గ్రామాల్లో పార్టీ శ్రేణులు నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ, రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ "గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలు అందజేస్తూ అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. నిరుపేదలకు తోడుగా సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మనదే అన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ కులం, మతం, రాజకీయం చూడకుండా సామాజిక న్యాయం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పిన మాట ప్రకారం నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించారన్నారు. 2014 లో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మళ్లీ అదే విధంగా 2024 లో అధికారంలోకి రావడానికి గతంలో చెప్పిన వాగ్దానాలను పదేపదే ప్రజలకు చెబుతూ మళ్లీ మోసం చేయటానికి వస్తున్నారని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
సింగనమల నియోజకవర్గం లో టిడిపి గెలుస్తుంది.. నారా చంద్రబాబు నాయుడు..
బుక్కరాయసముద్రం ప్రజా గళంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడిన ముఖ్యాంశాలు
ప్రజాగళం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను
సింగనమల నియోజకవర్గం లో టిడిపి జెండా ఎగురుతుంది
ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురయ్యారు
నరకాసురుని చంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు బాధ్యత మీ చేతుల్లో ఉంది
జాబు రావాలంటే బాబు రావాలని పిలుపుచ్చారు
జగన్ ప్రభుత్వం వల్ల జాకీ పరిశ్రమ పారిపోయింది
టిడిపి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ
రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం ఎరులై పారుతుంది.
1997 లో నేను చేసిన పని ఇప్పుడు చేసేకి కేంద్రం వచ్చింది...
దళితులకు గొంతు కోసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి...
దళితులకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి 22 కోట్లు ఇచ్చాం దళితులకు...
ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అన్ని దుర్వినియోగం చేశాడు...
దళితులు అందరు ఒక్కటి కండి...
మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ
జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకం, సబ్సిడీ నిధులు అన్ని బంద్ చేశాడు...
బాబాయి గొడ్డలితో చంపి నాటకాలు ఆడుతున్నాడు..
ఇప్పుడు కొత్త డ్రామా కు శ్రీకారం చుట్టాడు..
కలియుగంలో బాబాయి నీ చంపి అతని మీద నెట్టేశారు అని అంటున్నాడు..
అందరినీ మానసికంగా వేధించిన వ్యక్తి జగన్..
ఉపాధ్యాయునిగా మారిన విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..
ఉపాధ్యాయునిగా మారిన విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..
■ బండ్లపల్లి "పల్లెనిద్ర" కార్యక్రమంలో పాల్గొన్న వీరాంజనేయులు
సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటే రాష్ట్రం,దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు పేర్కొన్నారు.
నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఐదవ రోజు "పల్లె నిద్ర" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వీరాంజనేయులు పాఠాలు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న అందిస్తున్న వసతుల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తూ అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నామని పిల్లలు తెలిపారు.
అనంతరం గ్రామంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలని ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం కాలనీలో బస చేశారు.
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను.. ఆదరించండి.గెలిపించండి.. శింగనమల వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను.. ఆదరించండి.గెలిపించండి.. శింగనమల వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
ప్రజలకు, జగనన్నకు బాధ్యుడనై ఉంటూ, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తాను.. ఆదరించి..గెలిపించండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండలం దుర్గం, సిద్దరాచెర్ల, బోయకొట్టాల, గొల్లపల్లి, కమ్మకొట్టాల, మాలవాండ్లపల్లి, బండ్లపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ సీపీ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి ఆయన చేపట్టారు.
ముందుగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల మేలును వివరించారు. శింగనమల స్థానిక బిడ్డగా వస్తున్నా అందుబాటులో ఉంటాను, ఆదరించండి మీకు సేవకుడిగా పని చేస్తాను. రానున్న ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును "ఫ్యాన్" గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దంలో పేదల పక్షాన నిలిచిన జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. పేదలకు మెరుగైన విద్య, వైద్యం, సంక్షేమాభివృద్దే ధ్యేయంగా పరిపాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్య, వైద్యం సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు. జగనన్న చేసిన సంక్షేమాన్ని చూసి రానున్న ఎన్నికలలో గెలవలేని భయంతో, టిడిపి, జనసేన, బిజెపి, మరికొన్ని పార్టీలు జతకట్టి జగనన్నని ఓడించడానికి వస్తున్నాయన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఇచ్చిన మాట ప్రతి హామీని నెరవేర్చిన సంక్షేమ ప్రధాత జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Apr 02 2024, 06:31