సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీ తోనే సాధ్యం.. సింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీ తోనే సాధ్యం.. సింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
రాష్ట్రంలో వైస్సార్సీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.
కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..సీఎం జగనన్న పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి అందించారని అందుకే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలతోపాటు చెప్పనివి కూడా చేసి చూపించారన్నారు. చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో నెరవేర్చాడా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలు అందాలంటే గతంలో అధికారుల చుట్టూ తిరిగేవారన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక ఇంటి దగ్గరికే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రాబోయే ఎన్నికలలో ప్రజలు వైఎస్సార్సీపీ కి ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్నను మరోసారి చేసి వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mar 05 2024, 19:04