Crimejournalist

Feb 09 2024, 22:26

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

[Streetbuzz News Crime journalist]

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు .

6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380మందిబాలబాలికలకుదంతవైద్యపరీక్షలను నిర్వహించారు.అందులో సుమారు 140 మంది విద్యార్థులకుదంత సమస్యలను గుర్తించారు. వారికి వచ్చేవారం కామినేని దంత వైద్య కళాశాలలో దంత చికిత్సలు చేస్తామని వైద్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ అంబటి అంజయ్య, దంతవైద్యులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 21:20

ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..మంత్రి పొన్నం

[Streetbuzz News Crime journalist]

(హైదరాబాద్బీ ):- ఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని, మేము ఏం చెబితే అది వినాలనే ఫీలింగ్‌‌లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు. రూ. 535 కోట్ల విలువ గల బస్ ఫెయిర్స్‌ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు కూ. 15వేలు ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారని, మరి బీఆర్ఎస్ హయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ల పేరుతో వేల రూపాయలు వసులు చేశారని ఆరోపించారు.సభని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని, అటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.బస్సులు ప్రయాణికుల దగ్గరకు వెళ్లడం లేదని, ప్రయాణికులే బస్సుల దగ్గరకు ఆటోల ద్వారా వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Crimejournalist

Feb 09 2024, 21:06

శ్రీ కషిమి కోటరామ్ జి కాలు సర్జరీ జరిగిందని తెలిసి వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు

[Streetbuzz News Crime journalist]

ఆంధ్రప్రదేశ్:

(శ్రీకాకుళం ఫిబ్రవరి 09):- శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీ గొండు శంకర్, ఉత్తరాంధ్ర కళ్యాణ్ రామ్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు,శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి ఇప్పిలి తిరుమల రావు, ప్రసాద్, అన్నేపు ధనుంజయ్, మురళి, ఈశ్వరరావు, అలిగి ప్రసాద్, శ్రీనివాసరావు, నాగయ్య, బద్రారావు, రాజు, మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మి రాజ్యం,TNSF నియోజకవర్గం ప్రసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, అరసవిల్లి టీడీపీ నాయకులు కొయ్యన రామ్ మోహన్ రావు, రాయి కిరణ్, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్ సుందర్ రావు, గార మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకట రమణ మూర్తి, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి చెన్న రమణ,బైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, రంది రాజు,సాధు పరమేష్, తంగి నర్సింగరావు, సాధు అజయ్, మల్ల రమణయ్య, గుండ మురళి, శిమ్మ శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 20:56

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సంతకాల సేకరణ

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(కొండపాక ఫిబ్రవరి 09 ) :- కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన రైతన్న కార్మిక వ్యవసాయ కౌలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అమ్ముల బాల నర్సయ్య అన్నారు. శుక్రవారం రోజున వెలికట్ట గ్రామంలో సంతకాల సేకరణ,కరపత్రాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య మట్టాడుతూ కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించడంతో నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందని,నిరుద్యోగం 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని శ్రామిక కుల నిజ వేతనాలు20 శాతం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను కార్మిక హక్కులను కాలరాస్తుందని అన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్త పలకలనీ పెట్టుబడిదారుల లాభాల కోసం తిరిగి 12గం.ల పని విధానం అమల్లోకి తెస్తుంధన్నారు. భవన నిర్మాణ కార్మికుల ద్వారా వస్తున్న సేపు డబ్బులను ఇతర పథకాలకు మళ్లించి కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదని ప్రశ్నించినారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఎర్పాటు చేసి వ్యవసాయ కూలీల గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గించటం ఎంటాన్నారు.ఈ నేపధ్యంలో దేశంలోనికార్మిక,రై తాంగం,వ్యవసాయ కూలీలు మరియు సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు అమ్ముల పరుశరాములు,పబోజు లక్ష్మి నర్సయ్య,ఎర్ర సత్తయ్య,నర్సింహ రవి,ఎల్లమ్మ గారి నాగయ్య,భూమని నర్సయ్య,నాంపల్లి యాదయ్య,ముత్తనిశేఖర్,అమ్ముల పరుశరాములు, దొబ్బబాలయ్య,శ్రీనివాసు,బాలనర్సయ్య,ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 10:47

జిల్లాలో జరుగుతున్న జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -పోలీస్ కమిషనర్


జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్

[ Streetbuzz News Crime journalist ]

(సిద్దిపేట జిల్లా) :-  తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద సి.ఆర్.పి.సి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. తేది 10-02-2024 నాడు ఉదయం 0800 నుండి సాయంత్రం 4:00 గం: వరకు అమల్లో ఉన్నదని మరియు పరీక్ష జరుగు సమయములో పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. మరియు పోలీస్ అధికారులు ఇబ్బంది పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ,ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాలు

1. సెంట్ మేరీస్ విద్యానికేతన్ ప్రజ్ఞాపూర్

2. సెంట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గజ్వేల్

3. తెలంగాణ మోడల్ స్కూల్ సంగాపూర్ రోడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

4. జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

5. గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

6. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ప్రజ్ఞాపూర్

7. జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్

Crimejournalist

Feb 09 2024, 08:38

జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు - పోలీస్ కమిషనర్

పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు

సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దు - పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ అధికారి

[ Streetbuzz News Crime journalist ]

(సిద్దిపేట జిల్లా):- ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు, నేరగాళ్లు, ఎవరు కూడా సిద్దిపేట జిల్లాలోకి రాలేదని సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మవద్దని, అయినప్పటికీ జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచిగస్తీనిర్వహిస్తున్నామని, పుకార్లను ఎవ్వరూ నమ్మరాదని పోలీస్ కమీషనర్ తెలిపారు.ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు నిరంతరం కృషి చేస్తుందని, బయటకు కనిపించే విధులు గాకుండా ఆయా గ్రామాలు, పట్టణాలలోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై కూడా ప్రత్యేక పోలీసుల నిఘా ఉంటుందన్న విషయం ప్రజలు గమనించాలని సూచించారు. ఇంతవరకూ మన జిల్లాలో లేదా ఇతర జిల్లాల్లో ఇటువంటి ముఠాల గురించి సమాచారం లేనేలేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావాద్దన్నారు.ఎవ్వరూ చూడని విషయాలను ప్రచారం చేయడం సరి కాదని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100, లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం సమాచారం అందించాలని సూచించారు.

Crimejournalist

Feb 09 2024, 08:15

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు*


ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లారీ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపు చేస్తున్న లారీని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్):- హైదరాబాద్ రోడ్ ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో TS 36TA 4536 గలదాని లారీ డ్రైవర్ అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రజ్ఞాపూర్ లో డంపు చేస్తున్న చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందితో కలిసి వెళ్లి పట్టుకొని గజ్వేల్ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Crimejournalist

Feb 09 2024, 07:55

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్?*


ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి) :- గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ ,రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో విద్యుత్ కనెక్షన్ కు అనుసంధానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడిఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ లు రాజేందర్, కొమురయ్య, రఘు, స్పాట్ బిల్డర్స్ ప్రసాద్, రాజ్ కుమార్, అన్ మ్యాన్డ్స్ కిరణ్, నరేష్, అంజి, యుగంధర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 07:42

బావుల్లో పేలుతున్న మందుపాతరలు-అన్ లైసెన్సుడు ట్రాక్టర్ల వీరంగం*

[Streetbuzz News Crime journalist]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అన్ లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది. క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఈ పేలుళ్ల క్రమంలో ఇండ్లపై కూడా రాళ్లు వచ్చి పడుతున్నాయని వారు చెప్తున్నారు.

Crimejournalist

Feb 09 2024, 07:37

*స్రీ అభ్యున్నతికి ఓరుగల్లులో శోభ*

వామపక్ష జాడ! కానరాదే ఏడ!!

టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్

[Streetbuzz News Crime journalist]

హనుమకొండ జిల్లా:

ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టార్ అశోక్ బాబుతో కలిసి గురువారం విద్యారణ్యపురి కాలనీలో స్మరించుకుంటూ..ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కందాల శోభారాణి రచయిత్రిగా, మానవ హక్కుల గొంతుకగా, ప్రతినిత్యం ప్రజల సమస్యలపై పోరాట ప్రటిమ, స్రీ సాహిత్య సేవకు ఎనలేని కృషి చేసినారని అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాలలో అధ్యాపకరాలుగా, కేయూ జ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్ గా సేవలు అందించడం జరిగిందిని టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చిర్రా రాజు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు శోభారాణి భర్త రమేష్, మానవ హక్కుల నాయకులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.