Crimejournalist

Feb 09 2024, 10:47

జిల్లాలో జరుగుతున్న జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -పోలీస్ కమిషనర్


జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్

[ Streetbuzz News Crime journalist ]

(సిద్దిపేట జిల్లా) :-  తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద సి.ఆర్.పి.సి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. తేది 10-02-2024 నాడు ఉదయం 0800 నుండి సాయంత్రం 4:00 గం: వరకు అమల్లో ఉన్నదని మరియు పరీక్ష జరుగు సమయములో పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. మరియు పోలీస్ అధికారులు ఇబ్బంది పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ,ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాలు

1. సెంట్ మేరీస్ విద్యానికేతన్ ప్రజ్ఞాపూర్

2. సెంట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గజ్వేల్

3. తెలంగాణ మోడల్ స్కూల్ సంగాపూర్ రోడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

4. జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

5. గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

6. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ప్రజ్ఞాపూర్

7. జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్

Crimejournalist

Feb 09 2024, 08:38

జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు - పోలీస్ కమిషనర్

పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు

సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దు - పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ అధికారి

[ Streetbuzz News Crime journalist ]

(సిద్దిపేట జిల్లా):- ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు, నేరగాళ్లు, ఎవరు కూడా సిద్దిపేట జిల్లాలోకి రాలేదని సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మవద్దని, అయినప్పటికీ జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచిగస్తీనిర్వహిస్తున్నామని, పుకార్లను ఎవ్వరూ నమ్మరాదని పోలీస్ కమీషనర్ తెలిపారు.ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు నిరంతరం కృషి చేస్తుందని, బయటకు కనిపించే విధులు గాకుండా ఆయా గ్రామాలు, పట్టణాలలోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై కూడా ప్రత్యేక పోలీసుల నిఘా ఉంటుందన్న విషయం ప్రజలు గమనించాలని సూచించారు. ఇంతవరకూ మన జిల్లాలో లేదా ఇతర జిల్లాల్లో ఇటువంటి ముఠాల గురించి సమాచారం లేనేలేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావాద్దన్నారు.ఎవ్వరూ చూడని విషయాలను ప్రచారం చేయడం సరి కాదని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100, లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం సమాచారం అందించాలని సూచించారు.

Crimejournalist

Feb 09 2024, 08:15

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు*


ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లారీ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపు చేస్తున్న లారీని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్):- హైదరాబాద్ రోడ్ ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో TS 36TA 4536 గలదాని లారీ డ్రైవర్ అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రజ్ఞాపూర్ లో డంపు చేస్తున్న చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందితో కలిసి వెళ్లి పట్టుకొని గజ్వేల్ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Crimejournalist

Feb 09 2024, 07:55

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్?*


ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి) :- గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ ,రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో విద్యుత్ కనెక్షన్ కు అనుసంధానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడిఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ లు రాజేందర్, కొమురయ్య, రఘు, స్పాట్ బిల్డర్స్ ప్రసాద్, రాజ్ కుమార్, అన్ మ్యాన్డ్స్ కిరణ్, నరేష్, అంజి, యుగంధర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 07:42

బావుల్లో పేలుతున్న మందుపాతరలు-అన్ లైసెన్సుడు ట్రాక్టర్ల వీరంగం*

[Streetbuzz News Crime journalist]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అన్ లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది. క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఈ పేలుళ్ల క్రమంలో ఇండ్లపై కూడా రాళ్లు వచ్చి పడుతున్నాయని వారు చెప్తున్నారు.

Crimejournalist

Feb 09 2024, 07:37

*స్రీ అభ్యున్నతికి ఓరుగల్లులో శోభ*

వామపక్ష జాడ! కానరాదే ఏడ!!

టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్

[Streetbuzz News Crime journalist]

హనుమకొండ జిల్లా:

ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టార్ అశోక్ బాబుతో కలిసి గురువారం విద్యారణ్యపురి కాలనీలో స్మరించుకుంటూ..ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కందాల శోభారాణి రచయిత్రిగా, మానవ హక్కుల గొంతుకగా, ప్రతినిత్యం ప్రజల సమస్యలపై పోరాట ప్రటిమ, స్రీ సాహిత్య సేవకు ఎనలేని కృషి చేసినారని అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాలలో అధ్యాపకరాలుగా, కేయూ జ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్ గా సేవలు అందించడం జరిగిందిని టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చిర్రా రాజు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు శోభారాణి భర్త రమేష్, మానవ హక్కుల నాయకులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 08 2024, 20:13

కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి


వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాజాకీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది -భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్

[Streetbuzz News Crime journalist]

సూర్యాపేట జిల్లా:

(మునగాల ఫిబ్రవరి 08):- బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించేలా నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు గురువారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారి ప్రవేశపెట్టనన్న బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయిన బట్టి విక్రమార్కను తమ సంఘం ఆధ్వర్యంలో కలిసి విజ్ఞప్తి చేశామని తమ విజ్ఞప్తి మేరకు వికలాంగుల సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క నిధులు కేటాయించాలి లేకుంటే బడ్జెట్ మంత్రి బట్టి ఇంటిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతోని అల్లాడిపోతుందని గత ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు వికలాంగుల సంక్షేమ శాఖకు పైసా ఇవ్వకుండా వికలాంగులు సమాజాన్ని విస్మరించడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజ్యం పాలయిందని వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాజకీయ పార్టీల మనగుడా ప్రశ్నార్ధకమే అవుతుందని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతుంది కానీ అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీ అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ముందుకు రాకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రాష్ట్ర సాధన ఉద్యమంలో వైకల్యాణీ సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న వికలాంగుల సమాజానికి సంబంధించిన వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని ఇల్లు లేని నిరుపేద వికలాంగులకు ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు కోసం ఏండ్ల తరబడి సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూస్తున్న వికలాంగులకు వెంటనే బ్యాంకు లింకేజీ తో సంబంధం లేకుండా రుణాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని వికలాంగుల పెన్షన్ 6000 వేలకు పెంచాలని వికలాంగుల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. ఇటీవల నల్గొండలో జరిగిన వికలాంగుల దినోత్సవ సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ గొప్పలు చెప్పటం శుభపరిణామామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కోసం నల్లగొండ సీటును త్యాగం చేస్తానని చెప్పారని మంత్రికి వికలాంగుల సమాజంపై చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న భువనగిరి నల్లగొండ అసెంబ్లీ స్థానాలను వికలాంగులకు కేటాయించేలా కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.సంఘం మునగాల మండల అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్, తిమ్మారెడ్డి గూడెం మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ,సైదిరెడ్డి, సంఘం నాయకులు బలుపూనూరి శ్రీనివాస్ రెడ్డి, తిమ్మరెడ్డి, ఏసు రెడ్డి,ఎర్ర నాగలక్ష్మి ,కేతిరేడ్డి పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Crimejournalist

Feb 08 2024, 13:42

*బోసిపోతున్న గ్రామపంచాయతీలు వెల వెల..! స్పెషల్ ఆఫీసర్లు రారు..సిబ్బంది ఉండరు

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి) :-గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు. దీంతో మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామపంచాయతీలు అన్ని వెల వెల బోతున్నాయి. గతంలో పనిచేసిన సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవస్థలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారినప్పటికీ సర్పంచుల దౌర్భాగ్య పరిస్థితి నేటికి మిగిలే ఉంది.

Crimejournalist

Feb 08 2024, 13:22

మొగుళ్లపల్లి పీహెచ్సీలో ఏడు పోస్టుల ఖాళీలు

[Streetbuzz News Crime r]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి ఫిబ్రవరి 08):- మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి. ఈ కాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంగా ప్రబలుతున్న నూతన వైరల్ ప్రభావం ప్రభంజిస్తున్న తరుణంలో జనం జడుసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని జనం కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజా సమస్యలను తీర్చిదిద్దాలనికోరుతున్నారు.

Crimejournalist

Feb 08 2024, 13:08

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు!పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా

[Streetbuzz News Crime Journalist]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి) :- రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్,యు, ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ మెంబర్ గా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.ఆసమయంలోనే మొగుళ్ళపల్లి సింగిల్ విండో చైర్మన్ గా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి క్రాఫ్ లోన్స్, సబ్సిడీ ఎరువులను అందజేసి రైతాంగానికి తోడ్పడ్డారు. 9 సంవత్సరాల కాలంలో ఆయన రైతుల మన్ననలు పొందడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలుపు కోసం మండలంలోని ముఖ్యులను కలిసి విజయ బావుటాను ఎగురవేశారు.