భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు తో తమ ఆవేదన చెప్పిన ఆటో డ్రైవర్ లు

భద్రాచలంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో తమ ఆవేదన చెప్పుకున్న ఆటో డ్రైవర్లు

భద్రాచలం [Crime journalist]:-

ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని బాధపడ్డ ఆటో డ్రైవర్లు తెలిపారు.తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావును కోరిన ఆటో డ్రైవర్లు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించి, ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా చేస్తామని చెప్పిన హరీశ్ రావు.ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బాధాకరమన్న హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేసే దాకా పోరాటం చేస్తామన్నారు.

భద్రాచలం రాముడిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్ది రాజు

మాజీ మంత్రి హరీష్ రావు తో కలిసి భద్రాచలం రాముడిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు

భద్రాచలం:

[ Crime journalist ఫిబ్రవరి, 3] :-

మాజీ మంత్రి హరీష్ రావు భద్రాచలం పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. గర్భ గుడిలో స్వామి వారి దివ్య మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావు తో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దిండిగాల రాజేందర్ తదితరులు ఉన్నారు.

రోడ్డెక్కిన ఆసరా ఫించన్ దారులు

రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు

రహదారిపై గంటపాటు ట్రాఫిక్‌ జామ్‌

జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు.

నారాయణపేట జిల్లా:

[Crime journalist]

(నారాయణపేట):- శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్‌లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-యాద్గీర్‌ ప్రధాన రహదారిపై పింఛన్‌దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్‌ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టల్‌ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నారాయణపేట ఎంపీడీవో వెంకయ్య సైతం గ్రామానికి చేరుకుని కారణాలను తెలుసుకున్నారు.

భువనగిరి పార్లమెంట్ కు నాకు అవకాశం కల్పించాలి - ఓయూ విద్యార్థి చనగాని దయాకర్

భువనగిరి పార్లమెంట్ కు నాకు అవకాశం కల్పించాలి -ఓయూ విద్యార్థి నేత టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

గాంధీభవన్: [Crime journalist]:-

భువనగిరి పార్లమెంట్ కు నాకు అవకాశం కల్పించాలని ఓయూ విద్యార్థి నేత టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ అన్నారు. నా లాంటి బీసీ బిడ్డ గౌడ బిడ్డ ఎంపిక కోసం అందరూ సహకరించాలని మనవి చేశారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గార్లకు మనవి చేశారు.నేను కూడా కాంగ్రెస్ పార్టీ లో హిడ్మా బొజ్జు లాంటి వన్నీ నాకు అవకాశం ఇస్తే ప్రజులు గెలిపించుకుంటారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ గడ్డ మీద పుట్టిందుకు గర్వపడుతున్నానని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న, కొండ లక్ష్మణ్ బాపూజీ, బొమ్మగాని ధర్మ భిక్షం, రావి నారాయణ రెడ్డి, యానాల మల్లారెడ్డి ఆశయ సాధనకు కృషి భువనగిరి గడ్డ సామాజిక, విప్లవ, తెలంగాణ పోరాటాలకు పుట్టినిల్లు. పార్టీ మీద నాయక్వతం మీద గౌరవం విశ్వాసం ఉందన్నారు.

ఆలేరు లో జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం

భువనగిరి జిల్లా: [Crime journalist ]:-

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం శుక్రవారం ఆలేరు లో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు హాజరై మహిళా కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గాజుల సుకన్య ( నకిరేకల్ 4 వ వార్డు కౌన్సిలర్), జిల్లా అధ్యక్షురాలు గోపగోని మాధవి గారు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ్డుపల్లి జానకమ్మ, కట్టంగూర్ మండల మహిళా అధ్యక్షురాలు మేడి ఈశ్వరమ్మ, కట్టంగూర్ టౌన్ అధ్యక్షురాలు తండు పద్మ, ఉపాధ్యక్షురాలు ఊట్కూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్ శాసన సభ్యునిగా బిఆర్ఎస్ నేతగా భాద్యతలు స్వీకరించిన నేతకు శుభాకాంక్షలు తెలిపిన జూబైర్ పా‌ష

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ స్టేట్ బిఆర్ఎస్ యూత్ వింగ్ &ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా.

శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యుడిగా మరియు బిఆర్ఎస్ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ఎస్ పార్టీ అధినేత.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ యూత్ వింగ్ &ఏటూజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జూబైర్ పాష.

బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్ - ఇంటికి వెళ్ళి ఆర్థికసాయం అందజేత


బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్

ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు

[Crime journalist ఘట్ కేసర్] :-

ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.మరోసారి చికిత్స కోసం ఆస్పత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ కోసం ఏడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రదీప్ కుటుంబం అవేదనకు గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని అపరేషన్ కు అవసరం అయిన 6లక్షల సహాయాన్ని ఈఎస్ ఐ ద్వారా సాయం చేశారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి మిగిలిన లక్ష రూపాయలు కూడా జమ చేయడం కష్టంగా మారింది. సమస్యను తెలుసుకున్న బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు విషయాన్ని కేటిఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో నేడు మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తరువాత మల్లారెడ్డితో కలిసి ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ కుమారుడి ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్, మల్లారెడ్డి గారికి ఎప్పుడూ ఋణపడి ఉంటామని ప్రదీప్ కుటుంబ సభ్యులు తెలిపారు. బీఅర్ ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి - ఎస్ఐ

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి - ట్రాఫిక్ ఎస్ఐ

సూర్యాపేట జిల్లా: [Crime journalist]

(సూర్యాపేట):-వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ యం. నవీన్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాల్లో ఫ్రీ లెఫ్ట్‌ బోర్డులను ఏర్పాటు చేసి మాట్లాడారు. రోజు రోజుకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతుండడంతో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, రోడ్లపై సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌ తదితరులు ఉన్నారు.

భువనగిరి నూతన సిఐ ని సన్మానించిన పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్

టౌన్ నూతన సిఐ ని సన్మానించిన పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్*

భువనగిరి జిల్లా:[Crime journalist] :- భువనగిరి టౌన్ నూతన సీఐ సురేష్ కుమార్ ను  సిఐ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ . అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ,బీసీ అగ్రవర్ణ పేదలపై పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, త్వరలో ఎలక్షన్స్ ఉన్నందున రాజకీయ ఒత్తులకు లోన్ అవుతున్నందున టౌన్ లో పోలీస్ పీకేట్లు ఏర్పాటు చేయాలని మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని కోరారు .ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, మహేష్, లింగస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేయుత

మృతుల కుటుంబానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేయూత

ఆంధ్రప్రదేశ్:

[Crime journalist] :-

• రాష్ట్రంలో ఎక్కడ లేని విధముగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరు చనిపోయిన వారికి ₹10000 /-అందజేస్తున్న ఎమ్మెల్యే.•

•తన కుమార్తె నిశ్చితార్థం అవడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి ఇంటికి వెళ్ళకూడదు అని ఉండడంతో కర్మంత్రాలు అనంతరం నేడు మృతుని కుటుంబాలకు ₹30,000/- వేల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి*

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పెద్ద సింగమాల గ్రామానికి చెందిన నడిపయ్య, సుబ్బరాయులు, భాస్కర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. తన కుమార్తె నిశ్చితార్థం అవ్వడంతో నాడు ఇవ్వలేని ఆర్థిక సహాయం ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ₹30,000/- రూపాయలను నేడు వారికి అందజేసిన ఎమ్మెల్యే గారి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి.అలాగే వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.