చీని చెట్లను గుర్తుతెలియనీ వ్యక్తులు నరికివేత..
సింగమల మండలం జూలా కాలువ రెవిన్యూ పొలంలో సర్వే నెంబర్ 198-1 లో రైతు ఈడిగ నడిపి సుబ్బరాయుడు చెందిన ఐదు సంవత్సరాల పది చీని చెట్లను గుర్తుతెలియనీ వ్యక్తులు నరికి వేశారు...
Breaking.. యువకుడు దారుణ హత్య..
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలో యువకుడు దారుణ హత్య గార్లదిన్నె మండలం జమ్ములదిన్నే కొట్టాల గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ అనే యువకుడు దారుణ హత్య సివి రామన్ కాలేజ్ వెనుక భాగంలో ఉన్న మైదానంలో రాజేష్ నాయక్ తలపై బలంగా కొట్టి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్రమ సంబంధంతోనే రాజేష్ నాయక్ ను హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు
సిద్దాపురం గ్రామం నందు తలారి పెయింటర్ రాము యొక్క 60 వేల విలువగల గడ్డివాము దగ్ధం...
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామం నందు తలారి పెయింటర్ రాము రెండు రోజుల క్రితం 60 వేల విలువ గల వరిగడ్డిని తమ పశువుల కోసం తెచ్చుకున్నాడు ఈరోజు కొద్ది గంటల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివామును తగలబెట్టడం జరిగిందని రాము పేర్కొన్నారు ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి వచ్చిన గ్రామస్తులు విశ్వప్రయత్నం చేసిన మంటలు ఆగడం లేదు అంతలోనే ఫైర్ ఇంజన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు
చంద్రబాబు నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు
రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకొని నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు..
కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..
కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి! పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ'కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జి కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం..
స్థానిక జిల్లా సబ్ జైళ్ల ఆపీసు ఆవరణం లో అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో శ్రీ ఫరూక్ అలీ ఖాన్ గారు శ్రీ ఫాజుళక్ గారు కొండప్ప గారు మరియు జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి శ్రీ రహమాన్ గారు శ్రీ పక్కిరప్ప గారు శ్రీ రామ సుబ్బయ్య గారు రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక..
బుక్కరాయసముద్రం మండలం దండువారి పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక . జరిగింది శాఖ కాలనీ సెక్రటరీగా ఎట్టి కృష్ణమూర్తి. బీసీ కాలనీ సెక్రటరీగా తలారి రంగయ్య ఎంపిక చేయడం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో సిపిఐ పార్టీ చేసిన సేవలు దండువారి పల్లి కి అనేకంగా సేవలందించడం జరిగింది ప్రజల సమస్యల మీద సిపిఐ పార్టీగా ముందుండి ప్రజల సమస్యలను తీర్చడంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారుడు పూజారి కిష్ట మండల కార్యవర్గ సభ్యులు సాకే రాజకుల్లాయప్ప మండల రైతు సంఘం కార్యదర్శి సాకే భాస్కర్ రంగనాయకులు. బ్యాంకుఅంజి సూర్యనారాయణ. పూజారి రామకృష్ణ.హీరు నాయక్ భాష చాకలి రాము మహిళలు తదితరులు పాల్గొన్నారు
అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి.. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి.. ఎపి రైతుసంఘం డిమాండ్..
నాసిరకం కళింగర విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎకరాకు లక్షరూపాయలు పరిహారం ఇవ్వాలి ---ఎపి రైతుసంఘం డిమాండ్ నార్పలమండలం బండ్లపల్లి గ్రామంలో నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడిరాక నష్టపోయిన రైతులతో కలిసి ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి పోలాలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బండ్లపల్లి గ్రామంలో 10 మంది రైతులు 25 ఎకరాలలో అప్పులు చేసి అనంతపురములో ఉన్న రేవతి పర్టిలైజర్స్ షాపులో కళింగర విత్తనాలు తెచ్చుకొని పంటలు సాగు చేశారు నార్పల మండలంలో ఉన్న పర్టిలైజర్స్ షాపులలో పురుగుమందులు అప్పు తెచ్చి పిచికారి చేశారు 60రోజులలో పంట కోతకు రావాలి 80 రోజులు దాటినా దిగుబడి రాకపోవడం వచ్చిన కొంత మేర కాయలు నాణ్యత లేక పోవడంతో రైతులు విత్తనాలు నాణ్యత లేకపోవడంతో మనం త్రీవంగా నష్టపోయామని దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పొలాలు పరిశీలించి మీకు ఇచ్చిన రేవతి పర్టిలైజర్స్ వారు నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడి రాలేదు అని చెప్పారు దీంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉంది. ఎకరాకు లక్షరూపాయలు పెట్టుబడి పెడితే ఎకరాకు 20 టన్నులు పైగా దిగుబడి రావాలసిఉంటే కనీసం 2నుండి 5 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అని దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఉన్నారు. కావున వ్యవసాయ ఉద్యానశాఖ అధికారులు నాసిరకం , ఎక్స్ ఫైర్ అయిన విత్తనాలు అమ్మిన అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటనారాయణ రెడ్డి మల్లేశ్వరమ్మ లక్ష్మినారాయణ మధుసూధన్ రెడ్డి మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ, సర్పంచ్, వైస్ ఎంపీపీ..
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ , తదితరులు ‘యల్లనూరు’లో వైసీపీకి షాక్ *వైసీపీ మాజీ జడ్పీటీసీ టీడీపీలో* *చేరిక* *శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ కొత్తమిద్దె వెంకట రమణ, యల్లనూరు మాజీ సర్పంచ్ ఓబులేసు, వైస్ ఎంపీపీ సావిత్రి, వైస్ సర్పంచ్ సూర్య నారాయణతో పాటు వైసీపీకి చెందిన పలువురు నాయకులు, వారి అనుచరవర్గం శనివారం ఉరవకొండలో జరిగిన సభలో టీడీపీలో చేరారు*. చంద్రబాబునాయుడు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. KV రమణ 2019 ఎన్నికల్లో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు... యల్లనూరు మండలంలో కేతిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రమణ వైసీపీ అన్నీ తానై వ్యవహరించారు... వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేతిరెడ్డి స్వలాభం చూసుకోవడంతో గత కొన్ని ఏళ్లుగా స్థబ్ధుగా ఉన్న రమణ నిన్నటి రోజున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీడియాకు తెలిపారు...
Jan 30 2024, 15:55