సిద్దాపురం గ్రామం నందు తలారి పెయింటర్ రాము యొక్క 60 వేల విలువగల గడ్డివాము దగ్ధం...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామం నందు తలారి పెయింటర్ రాము రెండు రోజుల క్రితం 60 వేల విలువ గల వరిగడ్డిని తమ పశువుల కోసం తెచ్చుకున్నాడు ఈరోజు కొద్ది గంటల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివామును తగలబెట్టడం జరిగిందని రాము పేర్కొన్నారు ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి వచ్చిన గ్రామస్తులు విశ్వప్రయత్నం చేసిన మంటలు ఆగడం లేదు అంతలోనే ఫైర్ ఇంజన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు

చంద్రబాబు నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు

రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకొని నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు..

కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..
కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి! పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ'కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జి కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం..

స్థానిక జిల్లా సబ్ జైళ్ల ఆపీసు ఆవరణం లో అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో శ్రీ ఫరూక్ అలీ ఖాన్ గారు శ్రీ ఫాజుళక్ గారు కొండప్ప గారు మరియు జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి శ్రీ రహమాన్ గారు శ్రీ పక్కిరప్ప గారు శ్రీ రామ సుబ్బయ్య గారు రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు

భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక..

బుక్కరాయసముద్రం మండలం దండువారి పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక . జరిగింది శాఖ కాలనీ సెక్రటరీగా ఎట్టి కృష్ణమూర్తి. బీసీ కాలనీ సెక్రటరీగా తలారి రంగయ్య ఎంపిక చేయడం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో సిపిఐ పార్టీ చేసిన సేవలు దండువారి పల్లి కి అనేకంగా సేవలందించడం జరిగింది ప్రజల సమస్యల మీద సిపిఐ పార్టీగా ముందుండి ప్రజల సమస్యలను తీర్చడంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారుడు పూజారి కిష్ట మండల కార్యవర్గ సభ్యులు సాకే రాజకుల్లాయప్ప మండల రైతు సంఘం కార్యదర్శి సాకే భాస్కర్ రంగనాయకులు. బ్యాంకుఅంజి సూర్యనారాయణ. పూజారి రామకృష్ణ.హీరు నాయక్ భాష చాకలి రాము మహిళలు తదితరులు పాల్గొన్నారు

అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి.. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి.. ఎపి రైతుసంఘం డిమాండ్..

నాసిరకం కళింగర విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎకరాకు లక్షరూపాయలు పరిహారం ఇవ్వాలి ---ఎపి రైతుసంఘం డిమాండ్ నార్పలమండలం బండ్లపల్లి గ్రామంలో నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడిరాక నష్టపోయిన రైతులతో కలిసి ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి పోలాలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బండ్లపల్లి గ్రామంలో 10 మంది రైతులు 25 ఎకరాలలో అప్పులు చేసి అనంతపురములో ఉన్న రేవతి పర్టిలైజర్స్ షాపులో కళింగర విత్తనాలు తెచ్చుకొని పంటలు సాగు చేశారు నార్పల మండలంలో ఉన్న పర్టిలైజర్స్ షాపులలో పురుగుమందులు అప్పు తెచ్చి పిచికారి చేశారు 60రోజులలో పంట కోతకు రావాలి 80 రోజులు దాటినా దిగుబడి రాకపోవడం వచ్చిన కొంత మేర కాయలు నాణ్యత లేక పోవడంతో రైతులు విత్తనాలు నాణ్యత లేకపోవడంతో మనం త్రీవంగా నష్టపోయామని దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పొలాలు పరిశీలించి మీకు ఇచ్చిన రేవతి పర్టిలైజర్స్ వారు నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడి రాలేదు అని చెప్పారు దీంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉంది. ఎకరాకు లక్షరూపాయలు పెట్టుబడి పెడితే ఎకరాకు 20 టన్నులు పైగా దిగుబడి రావాలసిఉంటే కనీసం 2నుండి 5 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అని దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఉన్నారు. కావున వ్యవసాయ ఉద్యానశాఖ అధికారులు నాసిరకం , ఎక్స్ ఫైర్ అయిన విత్తనాలు అమ్మిన అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటనారాయణ రెడ్డి మల్లేశ్వరమ్మ లక్ష్మినారాయణ మధుసూధన్ రెడ్డి మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ, సర్పంచ్, వైస్ ఎంపీపీ..

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ , తదితరులు ‘యల్లనూరు’లో వైసీపీకి షాక్ *వైసీపీ మాజీ జడ్పీటీసీ టీడీపీలో* *చేరిక* *శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ కొత్తమిద్దె వెంకట రమణ, యల్లనూరు మాజీ సర్పంచ్ ఓబులేసు, వైస్ ఎంపీపీ సావిత్రి, వైస్ సర్పంచ్ సూర్య నారాయణతో పాటు వైసీపీకి చెందిన పలువురు నాయకులు, వారి అనుచరవర్గం శనివారం ఉరవకొండలో జరిగిన సభలో టీడీపీలో చేరారు*. చంద్రబాబునాయుడు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. KV రమణ 2019 ఎన్నికల్లో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు... యల్లనూరు మండలంలో కేతిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రమణ వైసీపీ అన్నీ తానై వ్యవహరించారు... వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేతిరెడ్డి స్వలాభం చూసుకోవడంతో గత కొన్ని ఏళ్లుగా స్థబ్ధుగా ఉన్న రమణ నిన్నటి రోజున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీడియాకు తెలిపారు...

శ్రీనారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు

ఉరవకొండ బహిరంగ సభలో టీడీపి అధినేత "నారా చంద్రబాబునాయుడు" గారిని గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు.

శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని గౌరవపూర్వకంగా కలసి ఘనంగా సత్కరించిన టిడిపి SC సెల్ అధ్యక్షులు MSరాజు,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు..

ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రా.. కదలిరా. బహిరంగ సభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని గౌరవపూర్వకంగా కలసిన ఘనంగా సత్కరించి స్వాగతం పలికిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు MSరాజు మరియు సింగనమల నియోజకవర్గం టిడిపి ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు.. అనంతరం జిల్లా తెదేపా నేతలతో కలిసి రా.. కదలిరా.. బహిరంగ సభలో పాల్గొన్న MSరాజు గారు, ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు

జెసిఎస్ మండల కన్వీనర్ పసులూరు బయప రెడ్డి గారి తండ్రిని హాస్పిటల్ కి వెళ్లి పమర్శించిన జడ్పిటిసి నీలం భాస్కర్ మండల ఇన్చార్జ్ ఆలూరు రమణారెడ్డి..

బుక్కరాయసముద్రం జెసిఎస్ మండల కన్వీనర్ పసులూరు బయప రెడ్డి గారి తండ్రి నారాయణ రెడ్డి గారు.. అనారోగ్యంతో మాధవి హాస్పిటల్ నందు అడ్మిట్ చేయడం జరిగింది... విషయం తెలుసుకున్న బుక్కరాయసముద్రం మండల జడ్పీటీసీ నీలం భాస్కర్ మరియు మండల ఇంచార్జ్ ఆలూరి రమణారెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా రమణారెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెదుల్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జంతులూరు సర్పంచ్ లక్ష్మిరెడ్డి , వైస్ ఎంపీపీ సాకే లక్ష్మీనారాయణ జంతులూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...