శ్రీనారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు

ఉరవకొండ బహిరంగ సభలో టీడీపి అధినేత "నారా చంద్రబాబునాయుడు" గారిని గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు.

శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని గౌరవపూర్వకంగా కలసి ఘనంగా సత్కరించిన టిడిపి SC సెల్ అధ్యక్షులు MSరాజు,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు..

ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రా.. కదలిరా. బహిరంగ సభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని గౌరవపూర్వకంగా కలసిన ఘనంగా సత్కరించి స్వాగతం పలికిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు MSరాజు మరియు సింగనమల నియోజకవర్గం టిడిపి ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు.. అనంతరం జిల్లా తెదేపా నేతలతో కలిసి రా.. కదలిరా.. బహిరంగ సభలో పాల్గొన్న MSరాజు గారు, ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు

జెసిఎస్ మండల కన్వీనర్ పసులూరు బయప రెడ్డి గారి తండ్రిని హాస్పిటల్ కి వెళ్లి పమర్శించిన జడ్పిటిసి నీలం భాస్కర్ మండల ఇన్చార్జ్ ఆలూరు రమణారెడ్డి..

బుక్కరాయసముద్రం జెసిఎస్ మండల కన్వీనర్ పసులూరు బయప రెడ్డి గారి తండ్రి నారాయణ రెడ్డి గారు.. అనారోగ్యంతో మాధవి హాస్పిటల్ నందు అడ్మిట్ చేయడం జరిగింది... విషయం తెలుసుకున్న బుక్కరాయసముద్రం మండల జడ్పీటీసీ నీలం భాస్కర్ మరియు మండల ఇంచార్జ్ ఆలూరి రమణారెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా రమణారెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెదుల్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జంతులూరు సర్పంచ్ లక్ష్మిరెడ్డి , వైస్ ఎంపీపీ సాకే లక్ష్మీనారాయణ జంతులూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

ఎంతకాలం చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన విలేకరులు కూర్చోవాలి, ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలి నిర్మాణాన్ని చేపట్టాలి..సి.పి.యం. పార్టీ

ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలి నిర్మాణాన్ని చేపట్టాలి అధికార పార్టీ, ప్రతి పక్ష నాయకులను కోరిన సిపిఎం పార్టీ.

ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయ్యేనా? 

విలేకరుల బాధలు తీరేనా.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు గ్రహణం పట్టిందా 

అధికార పార్టీకి ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల స్పందన ఏది.

ఎంతకాలం చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన విలేకరులు కూర్చోవాలి.

 ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలము కేటాయించడానికి అధికార పార్టీ నాయకులు అధికారులతో మాట్లాడడానికి తీరిక లేదా

అవినీతి అక్రమాలు రుజువులతో సహా ఇచ్చిన పత్రికలలోనూ ఛానల్ లోనూ రానివ్వకుండా చేయడానికి ఉన్న తాపత్రయం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఎందుకు ఉండడం లేదు.

దేశ,విదేశాల్లో తమ నాయకుల ప్రచారానికి పత్రికలలో, చానల్లో రాయించడానికి, చూపించడానికి తాపత్రయం పడే అధికార పార్టీ ఎందుకని విలేకరుల సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించదు.

రాజ్యాంగంలో నాలుగో సింహం గా ఉన్న సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో ప్రచార సాధనాలలో ముఖ్యమైనది.

మీడియా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడానికి సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇతర రుగ్మతలను ప్రపంచానికి తెలియజేసి సమాజ సేవలో కీలకంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్స్ మీడియా చేస్తున్నది.

సింగనమల నియోజకవర్గం లో ని 6 మండలాలలో ఎక్కడ కూడా విలేకరులు కూర్చోవడానికి సేద తీర్చుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ప్రెస్ క్లబ్ లేదు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడం నిజం.

 ప్రెస్ క్లబ్ గురించి ఆర్భాటపు ప్రచారాలు చేయడం ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటి

అధికార పార్టీకి చెందిన నాయకులు ఎంత విలువైన భవనాలను నిర్మించుకున్నారు. నిర్మించుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలుసు.

సమాజానికి సేవ చేసే విలేకరుల సమావేశ మందిరం ఏర్పాటుకు కనీసం స్థలమును కేటాయించడానికి అధికారులతో మాట్లాడే ధైర్యం ఎందుకని చేయడం లేదు.

ఒకవైపున అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తూ ఉంటే వాటి మీద అధికారులు చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుండగా రెండవ వైపున విలేకరుల సమావేశం మందిరానికి స్థలం కేటాయించలేకపోవడం దురదృష్టకరం.

ఈ కాలంలో కొత్త కొత్త పత్రికలు కొత్త కొత్త ఛానల్స్ పదుల సంఖ్యలో విలేకరులు వస్తున్నారు వీటికి తోడు వెబ్ ఛానల్ కూడా వస్తున్నాయి.

వీరందరూ కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి సేద తీర్చుకోవడానికి ఎలాంటి భవనం లేదు.

 అలాగే వివిధ రాజకీయ పార్టీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు విలేకరుల సమావేశం మందిరంలో ఏర్పాటు చేయడం లేదా ఆయా రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలలో విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేయడం సహజము.

 కానీ బుక్కరాయసముద్రం మండలంలో విలేకరుల సమావేశం మందిరం లేకపోవడం వలన విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు

 వీరు ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఉన్న చెట్ల కింద, బండల మీద కూర్చుంటున్నారు.

కనీసం నీళ్లు ఇవ్వడానికి అంతంత మాత్రమే ఉంది.

విలేకరులు ధైర్యం చేసి సమావేశ మందిరం కోసం స్థలం కేటాయించమని అధికార పార్టీని అడగలేని దీనస్థితిలో ఉన్నారు.

అధికారులు అధికార పార్టీ కనుసన్నలలో నడుస్తున్నారే తప్ప విలేకరులు కూడా సమాజంలో ఒక భాగము అనే భావన లేదు.

 మరొకవైపున అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తమ నాయకులు దేశ విదేశాల్లో ప్రయాణాలు చేసినప్పుడు సమావేశాలకు వెళ్ళినప్పుడు వివిధ సందర్భాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాల్గొన్నప్పుడు పాల్గొన్న ప్రాంతాల నుండి ఫోటోలను వీడియోలను తమ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల ద్వారా విలేకరులకు పెట్టించి పత్రికలలోనూ చానల్స్ లోను వచ్చే విధంగా వెంటపడే అధికార పార్టీ వారు విలేకరుల సమావేశ మందిరానికి స్థలము కేటాయించడానికి అధికారులపై ఎందుకని చేయడం లేదో అర్థం కావడం లేదు.

అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, భూ కబ్జాలకు, అక్రమ మైనింగ్ లను సిపిఎం,వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలను పత్రికలలోనూ, ఛానల్ లోనూ రానివ్వకుండా విలేకరుల మీద ఒత్తిడి పెంచే నాయకులు విలేకరుల సమావేశం మందిరం స్థలం కు ఎందుకు శ్రద్ధ చూపడం లేదు.

ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు విలేకరుల సమావేశ మందిరం కోసం స్థలాన్ని కేటాయించాలని ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని సహకరించాలని సిపిఎం పార్టీ కోరుతున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ. నల్లప్ప మండల కార్యదర్శి ఆర్.కుల్లాయప్ప లు కోరారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం...కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప..

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం

కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ఈరోజు మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రవేశికను సంఘ నాయకులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప రైతు సంఘం జిల్లా నాయకులు ఆరు కుల్లాయప్ప సంజీవరెడ్డి సిఐటియు నాయకులు నాగేంద్ర నెట్టికంటయ్య

వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుల్లయ్య ఎర్రన్న చేతివృత్తిదాల సంఘ నాయకులు అంకాలు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటాపురం చంద్ర ఓబులేసు మల్లేషు కాశప్ప తదితరులు పాల్గొన్నారు 

ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ

2024 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. రాజ్యాంగ పరిషత్‌ దాదాపు మూడేళ్ల పాటు కృషి చేసి రూపొందించిన రాజ్యాంగం 1949 నవంబర్‌ 26న ఆమోదం పొంది, 1950 జనవరి 26న అమలులోకి రావడంతో ‘గణతంత్ర’ (రిపబ్లిక్‌) దినోత్సవంగా ప్రకటించుకున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ‘రాజ్యాంగ పీఠిక’లో రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ పేర్కొన్నది. రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలుగా సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు మొదలగు వాటిని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గత 74 ఏళ్లుగా భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలబడి, ‘భిన్నత్వం’ గల భారత దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లటానికి దోహదపడినది. దాదాపు 105కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినప్పటికి రాజ్యాంగ మౌలిక స్వరూపం కొనసాగుతూనే ఉన్నది. కాని 2014 నుంచి ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ‘మౌలిక స్వరూపమే’ కోల్పోయే విధంగా దాడులు ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బయట పడాలంటే ప్రజాచైతన్యం, ప్రజాభిప్రాయమే ప్రధాన మార్గం.

భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 26న కింది విధంగా పేర్కొన్నారు. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు, కాని దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు’ అని చెప్పారు. 1975లో భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి విధింపు రూపంలో ఒక దాడిని ఎదుర్కొన్నది. భారత ప్రజలు 1977లో దానిని విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వ రూపంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై, రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలపై దాడి జరుగుతున్నది. రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లు ఎదుర్కొనటానికి విస్తృతమైన ప్రజా మద్దతు అవసరం. ఆధునిక భారత రాజ్యాంగ లక్ష్యాల స్థానంలో ప్రాచీన మనుస్మృతి లక్ష్యాలను ప్రతిష్టించటానికి సంఘ పరివార్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో పనిచేస్తున్నది. ఈ ఎత్తుగడలను ఓడించడానికి ప్రజాభిప్రాయం, ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఈ కృషి కొనసాగాలి.

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్‌ రాజకీయాలు, క్రోనీ కాపిటలిజమ్‌ రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అండతో అదానీ నేడు 11 లక్షల కోట్లకు అధిపతిగా మారారు. కేంద్రంలోను అనేక రాష్ట్రాలలోను మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ కంపెనీలు, బొగ్గు మొదలైన రంగాలన్నీ అదానీ, అంబానీల నియంత్రణలోనే ఉన్నాయి. వీరు రాజకీయ రంగాన్ని నియంత్రణ చేస్తూ తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి పూర్తిగా సహకరిస్తున్నది.

భారతదేశానికి గల భిన్నత్వం దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఉపయోగించనప్పటికీ, 1వ నిబంధనలో భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని చెప్పారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. అనేక సందర్భాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పుల కోసం నియమించి వాటి సిఫార్సుల ఆధారంగా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాఖ్య విధానంపై దాడి ప్రారంభించి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జి.యస్‌.టి రాష్ట్రాల ఆర్థిక వనరులను దెబ్బతీశాయి. పెద్ద నోట్ల రద్దు జి.యస్‌.టి వలన రాష్ట్రాలకు లక్ష కోట్లు నష్టం జరిగింది. 3 వ్యవసాయ చట్టాలు సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా, కేంద్రం ఈ చట్టాలను చేసింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. విద్యారంగంలో ప్రధాన నిర్ణయాలు చేయాలంటే రాష్ట్రాలతో సంప్రదించాలి. కాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020 జులైలో రాష్ట్రాలతో సంప్రదించకుండానే ‘జాతీయ విద్యావిధానం-2020’ ప్రకటించడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రజాతంత్ర వాదులందరూ ఐక్యమై రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఉరవకొండలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమంకు విచ్చేయుచున్నా నారా చంద్రబాబునాయుడు గారి పర్యటనను విజయవంతం చేద్దాం.. మాజీజడ్పీటీసీ కె రామలింగారెడ్డి

ఉరవకొండలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమంకు విచ్చేయుచున్నా నారా చంద్రబాబునాయుడు గారి పర్యటనను విజయవంతం చేద్దాం.. మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి

రేపు అనగా (27-01-2024) శనివారం నాడు మధ్యాహ్నం 1గంటకు జరయబోయే రా కదిలిరా కార్యక్రమంకు విచయుచున్న నారా చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభ కార్యక్రమంను ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేయవల్సిందిగా కోరుచున్నాము.

      మీ కాటప్పగారి రామలింగారెడ్డి మాజీజడ్పీటీసీ

జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు

శింగనమల నియోజకవర్గం

CCC కదిరికి 28న షర్మిల రాక..

CCC కదిరికి 28న షర్మిల రాక..

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైరా షర్మిల ఈ నెల 28న శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి రానున్నారు. ఆమె రాక సందర్బంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పసులూరు గ్రామంలో జరుగు పెద్దమ్మ ఊరిదేవరకు నియోజవర్గ టిడిపి శ్రేణులను ఘనంగా ఆహ్వానించిన గ్రామ టిడిపి నాయకులు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో జరుగు పెద్దమ్మ ఊరిదేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారిని, శింగనమల నియోజకవర్గం ట్యూమన్ కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారిని, ముంటిమడుగు కేశవ రెడ్డి గారిని, మరియు నియోజకవర్గం నాయకులను దేవరకు ఆహ్వానించిన పసులూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర కామెంట్స్ సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లేరు..

తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర కామెంట్స్ సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లేరు.. టిడిపి అభ్యర్థి గా ఎవరిని ఇంతవరకు ప్రకటించలేదు 

ద్వి సభ్య కమిటీ సభ్యుల ఆలం నర్స నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి పర్యవేక్షణలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి

టిడిపి జోనల్ ఇన్చార్జి బీద రవిచంద్ర యాదవ్

ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు

శింగనమల : శింగనమల నియోజకవర్గం రేపు ఉదయం10.30 గంటలకు 6 మండలాల నుంచి అత్యధికంగా తరలి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారి ఉరవకొండలో జరుగు "రా... కదిలిరా బహిరంగ సభను" విజయవంతం చేద్దామని దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం పార్లమెంట్ ఉరవకొండ నియోజకవర్గం లో రా కదలిరా బహిరంగసభకు శింగనమల నియోజకవర్గ 6 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు బయలుదేరి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

   ఇట్లు 

 ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు 

 శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు