ఆస్పత్రి అభివృద్ధి చైర్మన్ గౌరవ ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారి ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి సమావేశము..
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి అభివృద్ధి సమావేశము , ఆస్పత్రి అభివృద్ధి చైర్మన్ గౌరవ ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల వైద్యాధికారులు, ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ గారు, ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సీనియర్ అసిస్టెంట్ గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్స్, సెక్టర్ సూపర్వైజర్స్ హాజరవ్వడం జరిగింది. ఎంపీపీ గారు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆస్పత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించి ఆసుపత్రి కి కావలసిన కనీస అవసరాలను ఈ సమావేశంలో తీర్మానం చేసి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ సమావేశంలో నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఆసుపత్రికి ఇన్వర్టర్ మరియు బ్యాటరీ కొరకు తీర్మానం చేయడం జరిగింది , చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలని వారు సమావేశంలో తెలియజేశారు, వైద్యాధికారి మాట్లాడుతూ తరచూ కరెంటు పోవడం వల్ల చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ కీ ఇబ్బంది కలుగుతూ ఉండటం వల్ల ఇన్వర్టర్ ఉంటే ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీపీ గారిని కోరడం వల్ల వారు ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసులూరు సర్పంచ్ కల్పలత రెడ్డి గారు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మన్నేరు కొండమ్మ గారు, వైద్యాధికారిని స్వాతి లక్ష్మి గారు, డాక్టర్ తహీరున్నిస గారు, సిహెచ్ఓ మోహన్ రావు గారు, పిహెచ్ఎన్ చే న్నమ్మ, హనుమంత్ రెడ్డి ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ సునీత , ఎమ్మార్వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ , సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది
Jan 27 2024, 07:51