CCC కదిరికి 28న షర్మిల రాక..

CCC కదిరికి 28న షర్మిల రాక..

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైరా షర్మిల ఈ నెల 28న శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి రానున్నారు. ఆమె రాక సందర్బంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పసులూరు గ్రామంలో జరుగు పెద్దమ్మ ఊరిదేవరకు నియోజవర్గ టిడిపి శ్రేణులను ఘనంగా ఆహ్వానించిన గ్రామ టిడిపి నాయకులు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో జరుగు పెద్దమ్మ ఊరిదేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారిని, శింగనమల నియోజకవర్గం ట్యూమన్ కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారిని, ముంటిమడుగు కేశవ రెడ్డి గారిని, మరియు నియోజకవర్గం నాయకులను దేవరకు ఆహ్వానించిన పసులూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర కామెంట్స్ సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లేరు..

తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర కామెంట్స్ సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లేరు.. టిడిపి అభ్యర్థి గా ఎవరిని ఇంతవరకు ప్రకటించలేదు 

ద్వి సభ్య కమిటీ సభ్యుల ఆలం నర్స నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి పర్యవేక్షణలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి

టిడిపి జోనల్ ఇన్చార్జి బీద రవిచంద్ర యాదవ్

ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు

శింగనమల : శింగనమల నియోజకవర్గం రేపు ఉదయం10.30 గంటలకు 6 మండలాల నుంచి అత్యధికంగా తరలి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారి ఉరవకొండలో జరుగు "రా... కదిలిరా బహిరంగ సభను" విజయవంతం చేద్దామని దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం పార్లమెంట్ ఉరవకొండ నియోజకవర్గం లో రా కదలిరా బహిరంగసభకు శింగనమల నియోజకవర్గ 6 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు బయలుదేరి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

   ఇట్లు 

 ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు 

 శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు

ఆస్పత్రి అభివృద్ధి చైర్మన్ గౌరవ ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారి ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి సమావేశము..

బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి అభివృద్ధి సమావేశము , ఆస్పత్రి అభివృద్ధి చైర్మన్ గౌరవ ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల వైద్యాధికారులు, ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ గారు, ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సీనియర్ అసిస్టెంట్ గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్స్, సెక్టర్ సూపర్వైజర్స్ హాజరవ్వడం జరిగింది. ఎంపీపీ గారు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆస్పత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించి ఆసుపత్రి కి కావలసిన కనీస అవసరాలను ఈ సమావేశంలో తీర్మానం చేసి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ సమావేశంలో నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఆసుపత్రికి ఇన్వర్టర్ మరియు బ్యాటరీ కొరకు తీర్మానం చేయడం జరిగింది , చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలని వారు సమావేశంలో తెలియజేశారు, వైద్యాధికారి మాట్లాడుతూ తరచూ కరెంటు పోవడం వల్ల చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ కీ ఇబ్బంది కలుగుతూ ఉండటం వల్ల ఇన్వర్టర్ ఉంటే ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీపీ గారిని కోరడం వల్ల వారు ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసులూరు సర్పంచ్ కల్పలత రెడ్డి గారు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మన్నేరు కొండమ్మ గారు, వైద్యాధికారిని స్వాతి లక్ష్మి గారు, డాక్టర్ తహీరున్నిస గారు, సిహెచ్ఓ మోహన్ రావు గారు, పిహెచ్ఎన్ చే న్నమ్మ, హనుమంత్ రెడ్డి ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ సునీత , ఎమ్మార్వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ , సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది

సర్పంచు కొండన్న మృతి తీరని లోటు.. ఆలూరు సాంబ శివారెడ్డి..

సర్పంచు కొండన్న మృతి తీరని లోటు.. ఆలూరు సాంబ శివారెడ్డి.. బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామ పంచాయతీ సర్పంచు జి.కొండన్న(49) మృతి పార్టీకి తీరని లోటని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కొండన్న బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తెల్లవారుజామున మృతి చెందారు. సాంబశివారెడ్డి, వైఎస్ఆర్సీపీ శింగనమల ఇంచార్జ్ వీరాంజనేయులు పూలమాలలు వేసి కొండన్నకు నివాళులర్పించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సాంబ శివారెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గువ్వల రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ నీలం భాస్కర్, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

YSRCP పంచాయతీ సర్పంచు G. కొండన్న అనారోగ్యంతో బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి..

బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం YSRCP గ్రామ పంచాయతీ సర్పంచు G. కొండన్న అనారోగ్యంతో బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి. రాజకీయాలను నమ్ముకుని స్థాయికి మించిన అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పనులు చేయించి బిల్లులు రాక మనస్థాపానికి లోనై అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడ్డాడు. పెద్దలున్నట్లు దాని నమ్ముకుని ధర్మారం పోతే అది బుక్కపట్నం చేరింది.. ఇదే జరిగింది మన సర్పంచ్ కొండన్న విషయంలో.. అన్న ఆత్మ శాంతి కలగాలని దేవుని కోరుకుంటూ...

శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి వేడుకలు..

స్వర్గీయ మాజీమంత్రివర్యులు శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి సందర్బంగా వెంకటాపురంలో కీ.శే.శ్రీ పరిటాల రవీంద్ర గారి ఘాట్ ను సందర్శంచి పులమాలను వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులు పరిటాల సునీతమ్మ గారిని, పరిటాల శ్రీరామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ టీడీపీ నేతలు.ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి కె పార్థసారథి గారు, *శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు* మరియు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

తాహసిల్దార్ యోగేశ్వరి దేవినీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఇంచార్జి బత్తల పల్లి తాహసిల్దార్ యోగేశ్వరి దేవినీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ ఎస్సీ ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టరాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై అవినీతి,అరోపణలు. సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవి సస్పెన్షన్.

గూగూడు కుళాయి స్వామి సన్నిధిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు* నార్పల మండలం గూగూడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ,యువగళం పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* అధ్వర్యంలో గ్రామంలోని జంట దేవాలయాలు కుళ్ళాయిస్వామి,ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* జనసేన మండల కన్వీనర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎ కష్టమొచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు ఉండడం మనకు చాలా గర్వ కారణం యువగళం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారు ఆంధ్రప్రదేశ్ యువతను భాగస్వామ్యం చేసేందుకు, రాష్ట్ర రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించేందుకు యువగళం పాదయాత్రను చేపట్టారు.విద్యార్థులకు నిరుద్యోగులకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతేనే. ముఖ్యంగా యువగళo పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా లోకేష్ బాబు గారు ముందుకు వెళ్లడం జరుగుతోంది కాబట్టి ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలనీ భవిష్యత్తు లో ఉన్నతమైన పదవుల చేపట్టాలని ఆయన ఆలోచనలు రాష్ట్రానినికి అవసరం అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు, బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు పాల్గొన్నారు