అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత.

ఆసిఫాబాద్ జిల్లా: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎఫ్తర్వా అప్పలకొండ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని భవానీనగర్ సమీపంలో ఎఫ్ఎస్ఓ సాయిచరణ్ బృందంతో కలిసి రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఒక వాహనంలో పరిశీలించగా 12 కలప దుంగలు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. కలపను, వాహనాన్ని స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించారు.
రెండోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డా. శ్రీనివాస్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బీజేపీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షులను నియమించింది, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కసరత్తు ప్రారంభించింది. పనితీరు బాలేని కొన్ని జిల్లాలోని అధ్యక్షులను మార్పులు చేయగా, కొమురంభీం జిల్లా అధ్యక్షుడి డా. శ్రీనివాస్ మాత్రం మార్పు చేయకుండా రెండో సారి ఆయ
నే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంది. గురువారం సాయంత్రం ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠకులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచాలి : జిల్లా కలెక్టర్.

స్ట్రీట్ బజ్ న్యూస్,జనవరి 12, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలో నూతనంగా చేపట్టిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జిల్లా కేంద్రంలోని శాఖ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శాఖా గ్రంధాలయాలలో పాఠకులకు అవసరమైన పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు సర్నార్థమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కేసిఆర్ కు ఓటమి భయం.. ! మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

కామారెడ్డి న్యూస్ ప్రతినిధి ;తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. రింగ్ రోడ్ల పేరుతో తెలంగాణలో పేదల భూములన్నీ లాక్కుంటున్న కేసీఆర్.. చివరకు ఆ భూములను కేసీఆర్ బంధువుల పేరిట మార్పిడి చేసుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇక్కడి నుంచి తరిమి కొడతామని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. " ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడానికి సిద్ధపడుతున్న కామారెడ్డి నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఉన్న భూములను అమ్ముకునేందుకు వస్తున్నారు అని మండిపడ్డారు. నాసిరకం డబుల్ బెడ్ రూంలు నిర్మించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విచారణ జరిపించి ఆమెను జైలుకు పంపే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రోళ్లు పెప్పర్ స్ప్రే కొట్టినా వెనుకకు రాకుండా తెలంగాణ బిల్ పాస్ చేసిన ధైర్యశీలి సోనియా గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బిఅర్ఎస్ పార్టీ హయాంలో విద్యా రంగం, వైద్యం .. రెండూ మూలనపడ్డాయని, బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి కేసీఆర్‌ని బొందపెడతామన్నారు. తాను కామారెడ్డి గడ్డ మీద పుట్టానని, ఇక్కడే చస్తానని, ఒక్కసారి తనను ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్టుగా గజ్వెల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసినట్టయితే.. అక్కడ కేసీఆర్ కి పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీనే కానున్నారు అనే విషయం తెలిసిందే.

ప్రమాదవశాత్తు చెరువులో పడి వీఆర్ఎ మృతి.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వీఆర్ఎ మృతి.


నిర్మల్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ విధులు నిర్వహిస్తూ ఆదివారం ఉదయం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి సిద్ధ శ్రీనివాస్ (45) మృతి చెందాడు. నిర్మల్ అర్బన్ తహశీల్దార్ సుభాష్ చందర్ ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 10,000 ఆర్ ఐ ప్రశాంత్ రెడ్డి, విఆర్ఎ ప్రవీణ్ కుమార్లు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన ఎలాది రమేష్ కూతురు వెన్నెల ఉట్నూర్ ఏకలవ గురుకులంలో విద్యను భరిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఆదివాసి నాయకులు కుటుంబాన్ని పరామర్శించి రూ: 7000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు సిడం సకారం, తలండి లక్ష్మణ్, మడావి వెంకట్రావు, ఏన్క శ్రీహరి ,నైతం సత్తయ్య ఆత్రం మాంతయ్య ,ఏలాది నారాయణ తదితరులున్నారు.