ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన గార్లదిన్నె మండలం కమలాపురం రజకులు..
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రజకులు గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామ రజకులు ధోబి ఘాట్ కు బోరు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కోరడం జరిగింది. స్పందించి బోరు వేయించారు.
అడిగిన వెంటనే తమ సమస్యను పరిష్కరించినందుకు అనంతపురంలోని రజకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పరిష్కారానికి కృషి చేసిన సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామిరెడ్డికి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకట నారాయణ, వైస్సార్సీపీ నాయకులు శంకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామచంద్ర, రజకులు రామంజినేయులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Nov 28 2023, 16:33