చిట్యాల: బి ఎస్ పి లో భారీగా చేరికలు
నల్లగొండ జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో , చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పలువురు నాయకులు బిఎస్పి పార్టీ లో చేరారు. బి ఆర్ ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్పుల తిరుమలయ్య, ఏర్పుల కుర్రు మురళి కృష్ణ, ఏర్పుల వెంకటేష్, చింతకింది రామ చంద్ర ప్రసాద్,ఏర్పుల బిక్షం, చింతకింది తిరుమలయ్య, చింత కింది సంజీవ,ఏర్పుల మల్లేష్, చిరుమర్తి ధర్మయ్య, చింతకింది వెంకటేష్,ఏర్పుల ఉపేందర్,ఏర్పుల భాస్కర్,ఏర్పుల నరేష్,ఏర్పుల క్రాంతి కుమార్, చింత కింది గణేష్, చిరుమర్తి రవి కుమార్ 50 మంది యువకులు బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరారు.
బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. యువత ఇప్పుడు బీఎస్పీ పార్టీ వైపు చూస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,గ్యార శేఖర్,సైదులు, యాదగిరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు









నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం:
టీడీపీ శ్రేణుల ఆహ్వానం మేరకు చౌటుప్పల్ లోని టిడిపి కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చూసి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఆయనను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలో నా మీద అభిమానంతో వ్యక్తిగతంగా నాకు సహకరించిన వారికి మరియు తెలుగుదేశం పార్టీ తరపున నాకు మద్దతు ప్రకటిస్తున్న వారికి పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు రాజ్ గోపాల్ రెడ్డి అని తెలిపారు.







తెలంగాణలో 10 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి..కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు అయింది.
నవంబర్ 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి
Nov 23 2023, 21:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.0k