రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మనసారా ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే పద్మావతి..
మంచి పాలన..మనసారా ఆశీర్వదించండి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మనసారా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిని క్షుణ్ణంగా ఆయా కుటుంబాలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తోందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎలాంటి సిఫారసు లేకుండా పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి* ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతి కొనియాడారు. శింగనమల మండలం పెరవలి గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎమ్మెల్యే, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అందించిన లబ్ది బోర్డును ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నరేళ్లలో నేరుగా పేద ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.11.51 కోట్లు అందాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Nov 18 2023, 07:58