రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మనసారా ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే పద్మావతి..

మంచి పాలన..మనసారా ఆశీర్వదించండి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మనసారా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిని క్షుణ్ణంగా ఆయా కుటుంబాలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తోందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎలాంటి సిఫారసు లేకుండా పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి* ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతి కొనియాడారు. శింగనమల మండలం పెరవలి గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎమ్మెల్యే, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అందించిన లబ్ది బోర్డును ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నరేళ్లలో నేరుగా పేద ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.11.51 కోట్లు అందాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జగనన్నతోనే ప్రజల అభ్యున్నతి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్.

జగనన్నతోనే ప్రజల అభ్యున్నతి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం పాపినేపాల్యం, తిమ్మంపేట, కనంపల్లి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం నుంచి అందిన లబ్దిని బుక్ లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు. అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత సీఎం జగనన్నదే అన్నారు. చంద్రబాబు హయాంలో నాయకులు ఎంపిక చేసిన వారికి మాత్రమే పథకాలు అందయన్నారు.

ఇప్పుడు నేరుగా నిధులు, లబ్ధిదారుల ఖాతాలకే చేరుతున్నాయన్నారు. *రూ.2 కోట్లుతో నిర్మించిన కనంపల్లి నుంచి ఏకులనాగేపల్లి రోడ్డు ప్రారంభం* గార్లదిన్నె మండలం కనంపల్లి నుంచి ఏకులనాగేపల్లి వరకు రూ.2కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ,ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ప్రారంభించారు. కనంపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థము ఏడీసీసీ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదామును ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి,

ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ యం.లిఖిత ప్రారంభించారు. అనంతరం జగనన్న ఇళ్లు పథకంలో భాగంగా యన్. జయలక్ష్మి లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఏడిసీసీ బ్యాంకు సిబ్బంది,సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పాలనకు..జగనన్న కావాల్సిందే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...

సంక్షేమ పాలనకు..జగనన్న కావాల్సిందే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంక్షేమ పాలన కొనసాగాలంటే రాష్ట్రానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గ్రామ సచివాలయ-1 నందు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో " ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం

చేపట్టి పార్టీ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పాలనతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ-1 పరిధిలో నాలుగున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ క్రింద దాదాపు రూ.40.07 కోట్లను పేదలకు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమం సాగాలని.. రాష్ట్రానికి మళ్లీ జగనే కావాలని ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. ఇంటింటికీ ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు." వై ఏపీ నీడ్స్ జగన్" బుక్ లెట్ లను పంపిణీ చేశారు. *పల్లెలకు వెలుగులు..గ్రామ సచివాలయాలు: ఆలూరు సాంబ శివారెడ్డి*

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సచివాలయాల వ్యవస్థ ద్వారా పల్లెలకు వెలుగులు నింపారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మునుపెన్నడు లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా మన్నలను పొందారన్నారు. *ప్రతి కుటుంబానికి జగనన్న అండ* నాలుగున్నరేళ్ల సూపరిపాలనలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే"కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా మహిళలకే పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డకే దక్కుతుందన్నారు.

ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు రూ.26.25 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగనన్న మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రేకులకుంట గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన వైసిపి కార్యకర్త.. పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పిటిసి మరియు మండల ఇంచార్జ్ జేసెస్ మండల కన్వీనర్..
రేకులకుంట గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన వైసిపి కార్యకర్త.. పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పిటిసి మరియు మండల ఇంచార్జ్ జేసెస్ మండల కన్వీనర్..

బుక్కరాయసముద్రo మండలం రేకులకుంట గ్రామంలో సాకే లక్ష్మినారాయణ చిన్నాన్న సాకే నల్లప్ప గుండెపోటుతో మృతి చెందినారు విషయం తెలుసుకున్న ఆలూరు రమణారెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు జెడ్పీటీసీ నీలం భాస్కర్, st సెల్ జిల్లా అద్యక్షులు సాకే రామకృష్ణ, JCS మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, ముత్యాల రంగనాథ్ పాల్గొన్నారు..
ఫ్లాష్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అండగా ఉంటామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం..! క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చర్యలు..! ●రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..! ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అండగా ఉంటామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తెలిపారు. ఆదివారం ఉదయం అనంతపురం లోని సర్వజన ఆసుపత్రికి వెళ్లి షఫీ, సూరప్ప మృతదేహాలను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించేలా వైద్యాధికారులను ఆదేశించారు. #ThopudurthiPrakashReddy #RapthaduMLA #TeamTPR
నాగులగుడ్డం గ్రామం లో బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ : బూత్ ఇంచార్జ్ దాసరి రాధాకృష్ణ..
నాగులగుడ్డం గ్రామం లో బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ : బూత్ ఇంచార్జ్ దాసరి రాధాకృష్ణ.. *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలం నరసనాయుడుగారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో* శింగనమల మండలంలోని నాగులగుడ్డం గ్రామం లో " *బాబు షూరిటీ " భవిష్యత్తు* *గ్యారెంటీ "* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2024 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర ప్రజలకు మేనిపెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం,అని రాత పూర్వకంగా ప్రజలకు తెలియచేస్తూ ప్రతి ఇంటికి *నారా చంద్రబాబు నాయుడు గారు " బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ " కార్డు లని అందజేయడం వాటి పథకాలను వివరిస్తూ,* తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాగులగుడ్డం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
14వ బెటాలియన్ జంతలూరు నందు మౌలానా అబూల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు ....
14వ బెటాలియన్ జంతలూరు నందు మౌలానా అబూల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు .... ఈరోజు 14 వ బెటాలియన్ నందు మౌలానా అబూల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు హెడ్ క్వార్టర్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఆర్. గంగాధర్ రావు ఐపిఎస్, మాట్లాడుతూ శ్రీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి గొప్పతనమును గురుంచి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఎనలేని నిస్వార్థమైన సేవ చేశారని, అలాగే ఇతను భారత ప్రభుత్వంలో మొట్ట మొదటి విద్యా మంత్రి అయ్యాడాని చెప్పుతూ, ఇతను చేసిన మంచి పనులను వారి గొప్పతనం గుర్తుచేసుకున్నారు.

తరువాత కొత్తగా ఇద్దరు గ్రూప్ -1, DSP లు రెండు వారాలు బెటాలియన్ ట్రైనింగ్ పూర్తి చేసుకోని ఈ రోజు అనంతపురం జిల్లా కు రిలీవ్ అయిన సందర్భంగా వారిని సన్మానం చేయటం జరిగింది.

ఈ కార్యక్రమం లో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ట్రైనీ డిఎస్పి లు హేమంత కుమార్, పృథ్వి తెలా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సీతారామ రావు, ఆర్.ఎస్.ఐ లు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య ఇతర సిబ్బంది పాల్గొనటం జరిగింది.
కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

కుల, మత, పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల, పి.కొత్తపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని ఆయా కుటుంబాలకు బుక్ లెట్ ద్వారా వివరించారు.స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు వివరించి పరిష్కరించాలని సూచించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. కేవలం వారి వర్గానికే సంక్షేమ పథకాలను అందించడానికి నాటి టీడీపీ ప్రభుత్వం పని చేసిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

స్టేట్ లెవెల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు...
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థులు అండర్ 17 ఏజ్ విభాగంలో బాక్సింగ్ క్రీడ నందు S.అస్వియ, 42 కేజీలు క్యాటగిరిలోను, వై కుసుమాంజలి(42-44 kg) వెయిట్ విభాగంలోను, జి భావన(46-48 kg) వెయిట్ విభాగంలోను, జి వందన (57-60 kg) వెయిట్ విభాగంలోనూ, నఫీత కౌసర్ (70-75 kg) వెయిట్ విభాగంలోనూ బాక్సింగ్ లో స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ కావడం గమనార్హం. అదేవిధంగా అండర్ 14 ఏజ్ విభాగంలో త్రో బాల్ గేమ్ నందు డి చందన శ్రీ స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మెరుగైన ఆటను ప్రదర్శించి బహుమతులు తీసుకురావాలని మన పాఠశాలను మరింత మంచి పేరు వచ్చేలా ప్రయత్నం చేయాలని పిల్లలను ఆశీర్వదించారు.
సబ్సిడీ స్ప్రేయర్ లను సద్వినియోగం చేసుకోండి...ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత..
సబ్సిడీ స్ప్రేయర్ లను సద్వినియోగం చేసుకోండి...ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారు వ్యవసాయ సలహా మండలి సమావేశం ఈ దినం వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు శ్రీ పెద్ద కొండయ్య గారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారు మాట్లాడుతూ ఉద్యానశాఖలో రైతులకు 50% సబ్సిడీ తో హోండా కంపెనీ థైవాన్ స్ప్రే యర్ లను సప్లై చేస్తున్నారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మాట్లాడుతూ తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉన్నందులవలన రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తక్కువ వ్యవది లో చేతికి వచ్చే చిరుధాన్యలను సాగు చేసుకోవాలని తెలియజేసారు. పసుసంవర్ధక శాఖ ఎ డి ఎ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ 4నుండి 8 నెలల ఆడ పెయ్య దూడలకు బృసెల్లోసిస్ వ్యాధి కారకాలు వస్తున్నందులవలన ఉచితంగా 10/11/2023 నుండి 30/11/23 వరకు టీకాలు వేయుచున్నామని తెలియజేసారు.ఉద్యానశాఖధికారి శ్రీమతి శైలజ గారు మాట్లాడుతూ రైతులు పొలములలో ఫార్మ్పాండ్లను ఏర్పాటు చేసుకోవాలని వీటికి సబ్సిడీ ఇస్తామని తెలియజేసారు ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి,సభ్యులు బోయకొట్టాల నాగరాజ గారు దాసరి నారాయణస్వామి గారు తహసీల్దార్ ఆఫీస్ ప్రతినిధి మస్తాన్ గారు ఆదర్శ రైతులు ఏ ఇ ఒ జ్ఞాన జ్యోతి రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు..