చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వడియం పేట గ్రామం నందు జీవనం చేస్తున్న టిడిపి కార్యకర్త తలారి లక్ష్మీనారాయణ గత కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాస్తూ చనిపోవడం జరిగింది. జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బుక్కరాయసముద్రం మండల మాజీ జడ్పిటిసి కె రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి భీమ చేయడం జరిగినది. అందులో భాగంగా వడియంపేట గ్రామం నందు తలారి లక్ష్మీనారాయణ కూడా బీమా చేయడంతో మరణాంతరం వడియం పేట సర్పంచ్ నాగార్జున తక్షణమే స్పందించి తమ నాయకుడు రామలింగారెడ్డి గారికి సమాచారం అందించి రెండుసార్లు విజయవాడ కెళ్ళి దగ్గరుండి తలారి లక్ష్మీనారాయణ గారి బీమా సమస్యను అధిష్టానంతో కలిసి ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేలా చేశాడు ఇలా ముందస్తుగా టిడిపి అధిష్టానం మేరకు కే రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో బీమా చేయడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సౌకర్యం దేశంలో ఏ పార్టీకి లేదంటూ తలారి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి జిల్లా సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారికి మరియు సర్పంచి నాగార్జున గారికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు

రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామంలో కళ్లకు_గంతలు కట్టుకొని నిరసన.. గడుపూటి నారాయణస్వామి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసనగా

                                 తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామంలో 

కళ్లకు_గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మరియు (జోనల్-5) తెలుగు యువత ఇంచార్జి గడుపూటి నారాయణస్వామి గారు 

మరియు వడ్డుపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుల కృష్ణ గోపాల్* మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మప్ప, ఓబులేసు,లక్ష్మన్న,సుబ్బారాయుడు, వెంకట రాముడు, నాగన్న, గంగాధర, నారాయణస్వామి, అశోక్, శివ, నాగేశ్వరరావు, మహేష్ ,రాంబాబు నాగరాజు,శీనా సోము,ధనుంజయ, రామాంజి, చిన్న స్వామి, నవీన్,తేజ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకుల సమావేశం..

అనంతపురం నగరంలోని బల్లా కన్వెన్షన్ హాల్ నందు ఈరోజు జరిగిన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకుల సమావేశానికి హాజరైన ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు మరియు ఉమ్మడి జిల్లా తెలుగుదేశo పార్టీ నాయకులు , జనసేన నాయకులు పాల్గొన్నారు

గుడ్డి వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దాo...

చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలియజేస్తున్న రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, రాయలసీమ మీడియా కో ఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా అంధకారంలో మగ్గుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో వైసీపీ పాలన అంతా శూన్యంగా మారిందన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో """కళ్ళు తెరిపిద్దాం """ కార్యక్రమం...

జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో """కళ్ళు తెరిపిద్దాం """ కార్యక్రమం...

 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మరియు ద్విసభ్య కమిటీ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతు పలుకుతూ బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇవాళ రాత్రి 7.00 గంటల నుండి రాత్రి 7.05 నిమిషాల వరకు """కళ్ళు తెరిపిద్దాం"""కార్యక్రమం ద్వారా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలపడం జరిగింది ...

 ఈ కార్యక్రమం నరసింహరెడ్డి అనందరెడ్డి వేణుగోపాల్ రాము చౌడయ్య రమేష్ సూర్యనారాయణ నరేంద్ర యాదవ్ సురేష్ చౌదరి శంకర రెడ్డిపల్లి నాయుడు ఆది వడ్డేరామకృష్ణ తిరుపతయ్య వడ్డేవీరయ్య అరిగెల రాజు నాగరాజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు...

గ్రామంలో ఘనంగా గౌరమ్మ, గొంతెమ్మ వేడుకలు..
గ్రామంలో ఘనంగా గౌరమ్మ, గొంతెమ్మ వేడుకలు.. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా శనివారం గౌరమ్మ ఆదివారం గొంతెమ్మ పండుగను మహిళలు, యువతులు, చిన్నారులు, అంతే వైభవంగా గౌరమ్మ, గొంతెమ్మ పండుగను, గ్రామస్తులు ఘనంగా నిర్వహించి అమ్మవారి విగ్రహాలకు పట్టుచీర, గాజులు, పూలతో అలంకరించి, అమ్మవారికి మహిళలు, యువతులు, ప్రత్యేక పూజలు నిర్వహించి. ఆదివారం ఉదయం అమ్మవారికి పొట్టేలను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం డప్పు చప్పులతో అమ్మవారిని ఆలయం నుంచి ఎత్తుకొని మహిళలు, యువతులు చిన్నారులు ఘనంగా ఊరేగింపు నిర్వహించి. అనంతరం అక్కడి నుంచి గ్రామ చెరువు వద్దకు తీసువెళ్లి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

◆పక్కాగా సంక్షేమ పథకాలు అమలు - ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి, ఎచ్. సోదనపల్లి, మంగపట్నం, గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు.

ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. జగనన్న పాలన సంతృప్తికరంగా ఉందంటూ లబ్ధిదారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రభుత్వ నుంచి పొందిన లబ్ధిని ఆమె ప్రజలకు వివరించారు. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కనిపించకుండా పోయిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ హాస్టల్ నైన్త్ క్లాస్ అమ్మాయి

కనిపించకుండా పోయిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ హాస్టల్ నైన్త్ క్లాస్ అమ్మాయి టూ టౌన్ లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న హాస్టల్ వార్డెన్ గారు, 

 పట్టించుకోని టూటౌన్ పోలీసులు, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా వార్డెన్ భర్తమైనర్ బాలిక తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్ కాడ సంతకాలుపెట్టించుకోవడం మరింత గమనార్ధం,

వివరాలలోకెళితే 25/9/2023 తారీకున హాస్టల్ నుండి బయలుదేరి కేషఎన్నో స్కూలుకు వెళ్లినది అక్కడనుంటే కనిపించకుండా వెళ్ళింది ఇప్పటికి 34 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు అమ్మాయి ఆచూకీ తెలుసుకోకపోవడం చాలా బాధాకరం అమ్మాయి బ్రతికి ఉన్నదా ఎటు వెళ్లినదో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఫిర్యాదు ఇచ్చి చేసిన వైపు కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులు వెళ్లి పోలీసులను అడిగి తెలుసుకోకపోవడం వీరి నిర్లక్ష్యానికి తెరతీస్తుందని భావించొచ్చు ఎందుకంటే పోయిండేది ఒక దళిత అమ్మాయి కాబట్టి పోలీసు అధికారులు కావచ్చు సోషల్ వెల్ఫేర్ అధికారులు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏదైనా స్పెషల్ టీం వెయ్యడం కూడా జరగలేదు అంటే అదే అగ్రవర్ణ కులాల వారికి జరిగింది టే గంటలోనూ అరగంటలోనూ సేదించినామని పత్రికా ప్రకటించే పోలీసులు నైన్త్ క్లాస్ అమ్మాయి మైనర్ పోయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదంటే అమ్మాయి దళితురాలు కావడం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారని తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి స్పెషల్ టీం బృందాలను పోలీసు స్పెషల్ టీం ను ఏసి అమ్మాయిని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని జిల్లా పోలీసు అధికారులకు తెలియజేస్తున్నాం ఇట్లు అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అనంతపూర్ కమిటీ

జగనన్నకు అండగా నిలబడుదాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

జగనన్నకు అండగా నిలబడుదాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

కుల,మత,పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడదామని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట, అమ్మవారిపేట గ్రామాల్లో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.

అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులతో కలసి ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని ఆయా కుటుంబాలకు ఎంత చేకూరిందో బుక్ లెట్ ద్వారా వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోగా మేనిఫెస్టోని సైతం తొలగించివేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ చక్కటి సువర్ణ పాలన జరగాలంటే జగనన్నకు మనమందరం అండగా నిలబడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.

నాలుగున్నారేళ్ల పరిపాలనలో ప్రభుత్వం నుంచి బండారు బాల కుల్లాయప్పకు దాదాపు రూ.8,40,553 లబ్ది చేకూరిందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నార్పల మండల కేంద్రంలో మూడ్రోజుల కిందట జరిగిన హత్య కేసును ఛేదించిన నార్పల పోలీసులు

నార్పల మండల కేంద్రంలో మూడ్రోజుల కిందట జరిగిన హత్య కేసును ఛేదించిన నార్పల పోలీసులు

ఆరుగురు నిందితులు అరెస్టు... మద్యం తాగించి కడతేర్చినట్లు వెల్లడి

అరెస్టు నిందితుల వివరాలు :

1) పెరవలి కుళ్లాయప్ప నడిమిదొడ్డి కుళ్లాయప్ప, 25 సం., నార్పల మండల కేంద్రం

2) ఆకుల మణికంఠ, వయస్సు 31 సం., నార్పల మండల కేంద్రం

3) ఆసాది జయరాం, వయస్సు 32 సం., నార్పల మండల కేంద్రం

4) వరికూటి శివ, వయస్సు 26 సం., నార్పల మండల కేంద్రం

5) కడపల నాగన్న, వయస్సు 55 సం., నార్పల మండల కేంద్రం

6) ఎగువ కుళ్లాయస్వామి, వయస్సు 30 సం., నార్పల మండల కేంద్రం

ఈనెల 24 వ తేదీన సిద్ధవటం నారాయణస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే

అనంతపూర్ రురల్ డీస్పీ వెంకట శివారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల సి.ఐ అస్రార్ బాషా, నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు ఈ హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు

ఈ క్రమంలో పక్కా రాబడిన సమాచారంతో నార్పల గ్రామ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఈ ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు

* నేపథ్యం :

అరెస్టయిన నిందితుల్లో పెరవలి కుళ్ళాయప్ప ముఖ్యుడు. ఈచర్ వ్యాన్ డ్రైవరు గా పనిచేస్తున్నాడు. ఈతను సిద్దవటం నారాయణ స్వామి మంచి స్నేహితులు. ఇద్దరూ అప్పుడప్పుడు కొంతమంది స్నేహితులతో కలసి మద్యం సేవించే పార్టీలకు వెళ్ళుతుంటారు. పెరవళి కుళ్లాయప్పకు నార్పలకు చెందిన ఓ వివాహిత మహిళతో గత మూడు సంవత్సరాల నుండి సాన్నిహిత్యం వుంది. ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనే దాకా వెళ్లింది. ఈక్రమంలో సదరు వివాహిత పట్ల సిద్ధవటం నారాయణస్వామి అసభ్యంగా ప్రవర్తించాడని... ఈ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుండీ సిద్ధవటం నారాయణస్వామిని ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్నాడు. 24.10.2023 న పథకం పన్ని మణికంఠ, జయరాం, నాగన్న, శివ, కుళ్లయిస్వామిలను కూడగట్టుకొని నారాయణస్వామిని మద్యం త్రాగుదామని కేశవరెడ్డి తోటకు పెరవలి కుళ్లాయప్ప తీసుకెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత నారాయణస్వామికి మత్తు ఎక్కువ కావడం వలన అక్కడే పడిపోయాడు. . ఇదే అదునుగా భావించిన పెరవలి కుళ్లాయప్ప అకస్మాత్తుగా రాయితో సిద్ధవటం నారాయణస్వామిపై దాడి చేసి చంపినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఈ విషయంలో మిగితా వారిని  ఎవరికైనా చెబితే నేరం మీ మీదకు వస్తుందని బెదిరించాడు. అయినప్పటికీ పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు.

Si Narpala ps