రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
◆పక్కాగా సంక్షేమ పథకాలు అమలు - ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి, ఎచ్. సోదనపల్లి, మంగపట్నం, గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. జగనన్న పాలన సంతృప్తికరంగా ఉందంటూ లబ్ధిదారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రభుత్వ నుంచి పొందిన లబ్ధిని ఆమె ప్రజలకు వివరించారు. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Oct 30 2023, 06:21