కనిపించకుండా పోయిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ హాస్టల్ నైన్త్ క్లాస్ అమ్మాయి

కనిపించకుండా పోయిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ హాస్టల్ నైన్త్ క్లాస్ అమ్మాయి టూ టౌన్ లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న హాస్టల్ వార్డెన్ గారు, 

 పట్టించుకోని టూటౌన్ పోలీసులు, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా వార్డెన్ భర్తమైనర్ బాలిక తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్ కాడ సంతకాలుపెట్టించుకోవడం మరింత గమనార్ధం,

వివరాలలోకెళితే 25/9/2023 తారీకున హాస్టల్ నుండి బయలుదేరి కేషఎన్నో స్కూలుకు వెళ్లినది అక్కడనుంటే కనిపించకుండా వెళ్ళింది ఇప్పటికి 34 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు అమ్మాయి ఆచూకీ తెలుసుకోకపోవడం చాలా బాధాకరం అమ్మాయి బ్రతికి ఉన్నదా ఎటు వెళ్లినదో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఫిర్యాదు ఇచ్చి చేసిన వైపు కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులు వెళ్లి పోలీసులను అడిగి తెలుసుకోకపోవడం వీరి నిర్లక్ష్యానికి తెరతీస్తుందని భావించొచ్చు ఎందుకంటే పోయిండేది ఒక దళిత అమ్మాయి కాబట్టి పోలీసు అధికారులు కావచ్చు సోషల్ వెల్ఫేర్ అధికారులు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏదైనా స్పెషల్ టీం వెయ్యడం కూడా జరగలేదు అంటే అదే అగ్రవర్ణ కులాల వారికి జరిగింది టే గంటలోనూ అరగంటలోనూ సేదించినామని పత్రికా ప్రకటించే పోలీసులు నైన్త్ క్లాస్ అమ్మాయి మైనర్ పోయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదంటే అమ్మాయి దళితురాలు కావడం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారని తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి స్పెషల్ టీం బృందాలను పోలీసు స్పెషల్ టీం ను ఏసి అమ్మాయిని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని జిల్లా పోలీసు అధికారులకు తెలియజేస్తున్నాం ఇట్లు అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అనంతపూర్ కమిటీ

జగనన్నకు అండగా నిలబడుదాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

జగనన్నకు అండగా నిలబడుదాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

కుల,మత,పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడదామని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట, అమ్మవారిపేట గ్రామాల్లో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.

అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులతో కలసి ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని ఆయా కుటుంబాలకు ఎంత చేకూరిందో బుక్ లెట్ ద్వారా వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోగా మేనిఫెస్టోని సైతం తొలగించివేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ చక్కటి సువర్ణ పాలన జరగాలంటే జగనన్నకు మనమందరం అండగా నిలబడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.

నాలుగున్నారేళ్ల పరిపాలనలో ప్రభుత్వం నుంచి బండారు బాల కుల్లాయప్పకు దాదాపు రూ.8,40,553 లబ్ది చేకూరిందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నార్పల మండల కేంద్రంలో మూడ్రోజుల కిందట జరిగిన హత్య కేసును ఛేదించిన నార్పల పోలీసులు

నార్పల మండల కేంద్రంలో మూడ్రోజుల కిందట జరిగిన హత్య కేసును ఛేదించిన నార్పల పోలీసులు

ఆరుగురు నిందితులు అరెస్టు... మద్యం తాగించి కడతేర్చినట్లు వెల్లడి

అరెస్టు నిందితుల వివరాలు :

1) పెరవలి కుళ్లాయప్ప నడిమిదొడ్డి కుళ్లాయప్ప, 25 సం., నార్పల మండల కేంద్రం

2) ఆకుల మణికంఠ, వయస్సు 31 సం., నార్పల మండల కేంద్రం

3) ఆసాది జయరాం, వయస్సు 32 సం., నార్పల మండల కేంద్రం

4) వరికూటి శివ, వయస్సు 26 సం., నార్పల మండల కేంద్రం

5) కడపల నాగన్న, వయస్సు 55 సం., నార్పల మండల కేంద్రం

6) ఎగువ కుళ్లాయస్వామి, వయస్సు 30 సం., నార్పల మండల కేంద్రం

ఈనెల 24 వ తేదీన సిద్ధవటం నారాయణస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే

అనంతపూర్ రురల్ డీస్పీ వెంకట శివారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల సి.ఐ అస్రార్ బాషా, నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు ఈ హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు

ఈ క్రమంలో పక్కా రాబడిన సమాచారంతో నార్పల గ్రామ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఈ ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు

* నేపథ్యం :

అరెస్టయిన నిందితుల్లో పెరవలి కుళ్ళాయప్ప ముఖ్యుడు. ఈచర్ వ్యాన్ డ్రైవరు గా పనిచేస్తున్నాడు. ఈతను సిద్దవటం నారాయణ స్వామి మంచి స్నేహితులు. ఇద్దరూ అప్పుడప్పుడు కొంతమంది స్నేహితులతో కలసి మద్యం సేవించే పార్టీలకు వెళ్ళుతుంటారు. పెరవళి కుళ్లాయప్పకు నార్పలకు చెందిన ఓ వివాహిత మహిళతో గత మూడు సంవత్సరాల నుండి సాన్నిహిత్యం వుంది. ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనే దాకా వెళ్లింది. ఈక్రమంలో సదరు వివాహిత పట్ల సిద్ధవటం నారాయణస్వామి అసభ్యంగా ప్రవర్తించాడని... ఈ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుండీ సిద్ధవటం నారాయణస్వామిని ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్నాడు. 24.10.2023 న పథకం పన్ని మణికంఠ, జయరాం, నాగన్న, శివ, కుళ్లయిస్వామిలను కూడగట్టుకొని నారాయణస్వామిని మద్యం త్రాగుదామని కేశవరెడ్డి తోటకు పెరవలి కుళ్లాయప్ప తీసుకెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత నారాయణస్వామికి మత్తు ఎక్కువ కావడం వలన అక్కడే పడిపోయాడు. . ఇదే అదునుగా భావించిన పెరవలి కుళ్లాయప్ప అకస్మాత్తుగా రాయితో సిద్ధవటం నారాయణస్వామిపై దాడి చేసి చంపినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఈ విషయంలో మిగితా వారిని  ఎవరికైనా చెబితే నేరం మీ మీదకు వస్తుందని బెదిరించాడు. అయినప్పటికీ పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు.

Si Narpala ps

బ్రేకింగ్ న్యూస్ .. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దారుణం

బ్రేకింగ్ న్యూస్ .. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది రోజువారి కూలీగా బాలాజీ దాల్ (పొప్పుల ఫ్యాక్టరీ)మిల్లు నందు పనిచేయుచున్న తలారి నగ్నమా 30సం. W/o తలారి రఘు. రోజు ఐదు గంటల సమయంలో ఫ్యాక్టరీ నుండి కూలి పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండేది కానీ ఈరోజు సాయంత్రం 6 గంటలు సమయం గడిచిన ఇంటికి రాకపోవడంతో భర్త అనుమానం వచ్చి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి మా భార్య ఇంటికి రాలేదని యాజమాన్యాన్ని అడిగితే యాజమాన్యం మీ భార్య ఇంతకు మునిపే ఇంటికి వెళ్లిందని చెప్పడంతో అనుమానం వచ్చి ఇక్కడే ఉన్న సిబ్బందిని అడగగా సిబ్బంది కొద్దిమంది మీ భార్య చనిపోయినదని విషయము తెలపడంతో విషయం తెలుసుకున్న భర్తతో పాటు వాళ్ళ బంధువులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి వచ్చి గొడవ చేసి గేట్ ని తోచుకుంటూ లోపలికి వెళ్లి చూడగా అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు అయితే ఏది ఏమైనా కూడా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేదనేసి యాజమాన్యం పైన మాకు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతురాలకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు యాజమాన్యం దొడ్డిదారిన పారిపోయారని ఆమె భర్త తెలిపారు అంతేకాదు ఇక్కడ ఇల్లీగల్గా 5 ఫ్యాక్టరీలు నడుపుతున్నారని స్థానికులు తెలియజేశారు ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నేమ్ బోర్డులు కూడా లేవు కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదని కానీ సెక్యూరిటీ కెమెరాలు అయితే ప్రతి చోటా అమర్చారని వారు ఆపోయారు సంఘటన స్థలానికి బుక్కరాయసముద్రం పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు

నార్పల మండల కేంద్రంలో 2 సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ నార్పల సత్యనారాయణ రెడ్డి

నార్పల మండల కేంద్రంలో 2 సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ నార్పల సత్యనారాయణ రెడ్డి గారు మండల అధ్యక్షులు శ్రీ బూసిగాని నాగేశ్వరావు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి వేదాంత నాగరత్నం గారు నార్పల సర్పంచ్ శ్రీమతి మన్నెల సుప్రియ గారు ఉప సర్పంచ్ శ్రీరాములు గారు మండల ప్రత్యేక అధికారి వారు శ్రీ మహమ్మద్ రఫీ గారు మండల తాసిల్దార్ శ్రీ హరికుమార్ గారు ఎంపీడీవో శ్రీ దివాకర్ గారు పంచాయతీ కార్యదర్శి శ్రీ అశ్వత్ గారు గ్రామ పెద్దలు శివయ్య గారు నాగరాజు గారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఈ హెల్త్ క్యాంప్ యందు 454 మంది ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్యాంపుకు హాజరు కావడం జరిగింది

వడియం పేట్ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రం వైద్య సిబ్బంది తో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వడియం పేట సచివాలయం నందు జరిగినది. ఈ కార్యక్రమం ను  గ్రామ సర్పంచ్ నాగార్జున గారు, మరియు ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారు, వైస్ ఎంపీపీ రాంగోపాల్ గారు, పొడరాళ్ల గ్రామ సర్పంచ్ ఏర్రి స్వామి, ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఈ బి దేవి గారు, జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం నోడల్అధికారిగా డాక్టర్ సుజాత గారు, జిల్లా మలేరియా అధికారి ఒబులు గారు, మండల ప్రత్యేక అధికారి B.N. శ్రీ దేవీ వారు,డా. స్వాతి లక్ష్మి, ,డా.M శ్రీ హర్ష, డా. తహీరున్నిసా ,డాక్టర్ జిలాన్ జనరల్ సర్జన్,డా. విష్ణువర్ధన్ పిడి యట్రీషన్ గారు మరియు అభివృద్ధి అధికారి తేజ్యోశ్న , తాసిల్దార్ రమాదేవి గారు, దామోదరమ్మ EORD, YRCP నాయకులు అనంత వెంకట్ రెడ్డి, శంకరయ్య, నాగి రెడ్డి, రామ సుబ్బారెడ్డి, మండల సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు , ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది గ్రామ ప్రజలకు పలు వ్యాధులపై , పౌష్ఠిాహారం లోపాలపై,గర్భవతులకు ,బాలల బాలికలకు గల అనీమీయా గురించి అవగాహన కార్యక్రమాలు కలిగించి, 508 మంది కి చికిత్స అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది. మరియు 19 మందికి మెరుగైన వైద్యం కొరకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపడం జరిగినది.మరియు 86 కంటి పరీక్షలు నిర్వహించి 21 కంటిపొర చిక్సిచ కొరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ,అనంతపురం నకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్ ఈశ్వరమ్మ,, సచివాలయం కార్య దర్శి రంగా రెడ్డి, మరియు సచివాలయం సిబ్బంది, మహిళపోలీస్ సిబ్బంది,MLHPS , ANMs, ఆశాలు పాల్గొన్నారు.

గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు

గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకుంటే నీకు నడిరోడ్డు లో అవమానించే రోజులు దగ్గర లో ఉన్నాయి..రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం హెచ్ సోదనపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు పంపిణి మరియు గ్రామo లో నిరసన ర్యాలీ ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అలనాటి నియంతలను తలదన్నే విధంగా ప్రతిపక్షాలను, ప్రజలను పీడిస్తున్న సైకో జగన్ సాధారణంగా ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటేనే అతని దగ్గరికి వెళ్ళడానికి అందరు బయపడతారని, అలాంటిది ఒక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సైకో జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోడానికి రాష్ట్ర ప్రజలు అందరు ముందుకు రావాలన్నారు. తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో జైలుకు పంపిన సైకో జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.చంద్రబాబు నాయుడికి జైల్లో భద్రత కరువైందన్నారు. గోరంట్ల మాదవ్ కి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వడు అని తెలిసి ఎలాగోలా ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని అలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇలాగే మాట్లాడితే నడిరోడ్డు లో అవమానించే రోజులు దగ్గర లో ఉన్నాయి.తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, అభిమానులు చంద్రబాబు గారి కోసం చేస్తున్న పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అందరి ఆశీస్సులతో అతి త్వరలో కడిగిన ముత్యంలా చంద్రబాబు గారు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలరోజులుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు సాగిస్తున్న నిరసనోద్యమాలు చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏమిటో నిరూపిస్తున్నాయన్నారు. తెలుగుగడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాలన్నారు. తెలుగుదేశం పాలనను తీసుకు రావడానికి ప్రజలు కలిసి కట్టుగా శ్రమించాలని కోరారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బూత్ ఇంచార్జ్ లు,మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,హెచ్ సోదనపల్లి, మంగపట్నం గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్యార్థులకు లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లల రక్షణ-సమాజ పాత్ర.. పలు కార్యక్రమాలకు హాజరైన 14వ పటాలము కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు IPS

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్బంగా  పలు రకాల కార్యక్రమాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్బంగా ఈ రోజు అనగా 26.10.2023 తేదీ అప్పర్ ప్రైమరీ స్కూల్ జంతలూరు మరియు జడ్. పి. హై స్కూల్ రోటరీ పురము విద్యార్థులకు బెటాలియన్ ఆవరణం లో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధి గౌరవనీయులైన కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారు హాజరైనారు, ఈ కార్యక్రమంలో భాగముగా కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్., గారు అన్నీ రకములైన ఆయుధములను చూపిస్తూ వాటి పనితీరు గురించి మరియు ఊపయోగించు విధానమును గురుంచి చక్కగా విద్యర్థాలకు వివరించడమైనది. 

ఈ రోజు అనగ 27.10.2023 తేదీన బెటాలియన్ నందు సోషల్ మీడియా దుర్వినియెగము మరియు సైబర్ మోసలను అరికట్టడములో సాంకేతికత పాత్ర అనే అంశము పై పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలను పెట్టడము జరిగినది. సిబ్బంది అందరూ ఎంతో ఆసక్తితో ఏ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి బహుమతులను బాహుకరించాడమైంది.

అలాగే SRIT ఇంజనీరింగ్ కళాశాల యందు చర్చాగోష్టి పోటీలను లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ-సమాజ పాత్ర అనే అంశము పై నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధి గౌరవనీయులైన 14 వ పటాలము కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారు హాజరైనారు, కళాశాల విద్యార్థులతో కూలంకుశంగా చర్చించడము జరిగింది. 

అలాగే రోటరీ పురము గ్రామము లోని జడ్. పి. హై స్కూల్ విద్యార్థులకు లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ-సమాజ పాత్ర అనే అంశము పై వ్యాస రచన పోటీలను నిర్వహించడము జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహముతో ఈ పోటీలలో పాల్గొన్నారు.

అలాగే బుక్కరాయసముద్రము నందు కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారి ఆధ్వర్యములో బెటాలియన్ బ్యాండ్ షో నిర్వహించడము జరిగింది. 

పై కార్యమలలో డి. నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్ గారు, ఆర్.ఐ. లు శ్రీ బి. రాము శ్రీ యస్. నాగేంద్ర గారు మరియు శ్రీ. బి.లొకేశ్వర నాయుడు, శ్రీ జి. సీతారామ రావు గారు, ఆర్.యస్.ఐ. లు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

Flash..Flash.. ఎరువుల దుకాణము లపై విజిలెన్స్ అధికారుల తనిఖి లు...

 ఎరువుల దుకాణము లపై విజిలెన్స్ అధికారుల తనిఖి లు... మండలములోని రెడ్డిపల్లి గ్రామములోని రెండు ఎరువుల దుకాణములపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ పి శ్రీ మునిరామయ్య గారి ఆదేశముల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామా రావు గారు,వ్యవసాయధికారి శ్రీ వాసు ప్రకాష్ గారు మరియు డిప్యూటీ కమర్షియల్ టాక్స్ అధికారిని శ్రీమతి డి. విజయలక్ష్మి గారు అన్నదాత ఎరువుల దుకాణం మరియు ఉమేష్ చంద్ర ఎరువుల దుకాణం పై దాడులు జరిపి అన్నదాత దుకాణం లో రూ.28,288/- విలువ చేసే 13.1 లీటర్ ల కాలం చెల్లిన మందులను సీజ్ చేసారు. అదే విదంగా ఉమేష్ చంద్ర ఎరువుల దుకాణం లో రూ.36,700/- విలువ చేసే పురుగు మందులను సంబంధిత పత్రాలను చూపనందున అమ్మకాలు జరుపకుండా నిలుపుదల చేసారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి  శ్యాం సుందర్ రెడ్డి విజిలెన్స్ కాన్స్టేబుల్స్ పాల్గొన్నారు.

వివాహానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

వివాహానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

 శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం బండమీద పల్లి గ్రామానివాసి శ్రీమతి యం.రామాంజినమ్మ శ్రీ యం.రామమెహన్ గార్ల కుమారుడు మధు వివాహానికి ₹10,000/పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం పార్లమెంట్ అధికార ప్రతినిధి డేరంగుల శంకరయ్య నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.