నార్పల మండల కేంద్రంలో 2 సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ నార్పల సత్యనారాయణ రెడ్డి

నార్పల మండల కేంద్రంలో 2 సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ నార్పల సత్యనారాయణ రెడ్డి గారు మండల అధ్యక్షులు శ్రీ బూసిగాని నాగేశ్వరావు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి వేదాంత నాగరత్నం గారు నార్పల సర్పంచ్ శ్రీమతి మన్నెల సుప్రియ గారు ఉప సర్పంచ్ శ్రీరాములు గారు మండల ప్రత్యేక అధికారి వారు శ్రీ మహమ్మద్ రఫీ గారు మండల తాసిల్దార్ శ్రీ హరికుమార్ గారు ఎంపీడీవో శ్రీ దివాకర్ గారు పంచాయతీ కార్యదర్శి శ్రీ అశ్వత్ గారు గ్రామ పెద్దలు శివయ్య గారు నాగరాజు గారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఈ హెల్త్ క్యాంప్ యందు 454 మంది ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్యాంపుకు హాజరు కావడం జరిగింది

వడియం పేట్ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రం వైద్య సిబ్బంది తో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వడియం పేట సచివాలయం నందు జరిగినది. ఈ కార్యక్రమం ను  గ్రామ సర్పంచ్ నాగార్జున గారు, మరియు ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారు, వైస్ ఎంపీపీ రాంగోపాల్ గారు, పొడరాళ్ల గ్రామ సర్పంచ్ ఏర్రి స్వామి, ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఈ బి దేవి గారు, జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం నోడల్అధికారిగా డాక్టర్ సుజాత గారు, జిల్లా మలేరియా అధికారి ఒబులు గారు, మండల ప్రత్యేక అధికారి B.N. శ్రీ దేవీ వారు,డా. స్వాతి లక్ష్మి, ,డా.M శ్రీ హర్ష, డా. తహీరున్నిసా ,డాక్టర్ జిలాన్ జనరల్ సర్జన్,డా. విష్ణువర్ధన్ పిడి యట్రీషన్ గారు మరియు అభివృద్ధి అధికారి తేజ్యోశ్న , తాసిల్దార్ రమాదేవి గారు, దామోదరమ్మ EORD, YRCP నాయకులు అనంత వెంకట్ రెడ్డి, శంకరయ్య, నాగి రెడ్డి, రామ సుబ్బారెడ్డి, మండల సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు , ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది గ్రామ ప్రజలకు పలు వ్యాధులపై , పౌష్ఠిాహారం లోపాలపై,గర్భవతులకు ,బాలల బాలికలకు గల అనీమీయా గురించి అవగాహన కార్యక్రమాలు కలిగించి, 508 మంది కి చికిత్స అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది. మరియు 19 మందికి మెరుగైన వైద్యం కొరకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపడం జరిగినది.మరియు 86 కంటి పరీక్షలు నిర్వహించి 21 కంటిపొర చిక్సిచ కొరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ,అనంతపురం నకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్ ఈశ్వరమ్మ,, సచివాలయం కార్య దర్శి రంగా రెడ్డి, మరియు సచివాలయం సిబ్బంది, మహిళపోలీస్ సిబ్బంది,MLHPS , ANMs, ఆశాలు పాల్గొన్నారు.

గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు

గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకుంటే నీకు నడిరోడ్డు లో అవమానించే రోజులు దగ్గర లో ఉన్నాయి..రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం హెచ్ సోదనపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు పంపిణి మరియు గ్రామo లో నిరసన ర్యాలీ ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అలనాటి నియంతలను తలదన్నే విధంగా ప్రతిపక్షాలను, ప్రజలను పీడిస్తున్న సైకో జగన్ సాధారణంగా ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటేనే అతని దగ్గరికి వెళ్ళడానికి అందరు బయపడతారని, అలాంటిది ఒక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సైకో జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోడానికి రాష్ట్ర ప్రజలు అందరు ముందుకు రావాలన్నారు. తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో జైలుకు పంపిన సైకో జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.చంద్రబాబు నాయుడికి జైల్లో భద్రత కరువైందన్నారు. గోరంట్ల మాదవ్ కి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వడు అని తెలిసి ఎలాగోలా ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని అలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇలాగే మాట్లాడితే నడిరోడ్డు లో అవమానించే రోజులు దగ్గర లో ఉన్నాయి.తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, అభిమానులు చంద్రబాబు గారి కోసం చేస్తున్న పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అందరి ఆశీస్సులతో అతి త్వరలో కడిగిన ముత్యంలా చంద్రబాబు గారు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలరోజులుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు సాగిస్తున్న నిరసనోద్యమాలు చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏమిటో నిరూపిస్తున్నాయన్నారు. తెలుగుగడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాలన్నారు. తెలుగుదేశం పాలనను తీసుకు రావడానికి ప్రజలు కలిసి కట్టుగా శ్రమించాలని కోరారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బూత్ ఇంచార్జ్ లు,మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,హెచ్ సోదనపల్లి, మంగపట్నం గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్యార్థులకు లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లల రక్షణ-సమాజ పాత్ర.. పలు కార్యక్రమాలకు హాజరైన 14వ పటాలము కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు IPS

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్బంగా  పలు రకాల కార్యక్రమాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్బంగా ఈ రోజు అనగా 26.10.2023 తేదీ అప్పర్ ప్రైమరీ స్కూల్ జంతలూరు మరియు జడ్. పి. హై స్కూల్ రోటరీ పురము విద్యార్థులకు బెటాలియన్ ఆవరణం లో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధి గౌరవనీయులైన కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారు హాజరైనారు, ఈ కార్యక్రమంలో భాగముగా కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్., గారు అన్నీ రకములైన ఆయుధములను చూపిస్తూ వాటి పనితీరు గురించి మరియు ఊపయోగించు విధానమును గురుంచి చక్కగా విద్యర్థాలకు వివరించడమైనది. 

ఈ రోజు అనగ 27.10.2023 తేదీన బెటాలియన్ నందు సోషల్ మీడియా దుర్వినియెగము మరియు సైబర్ మోసలను అరికట్టడములో సాంకేతికత పాత్ర అనే అంశము పై పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలను పెట్టడము జరిగినది. సిబ్బంది అందరూ ఎంతో ఆసక్తితో ఏ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి బహుమతులను బాహుకరించాడమైంది.

అలాగే SRIT ఇంజనీరింగ్ కళాశాల యందు చర్చాగోష్టి పోటీలను లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ-సమాజ పాత్ర అనే అంశము పై నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధి గౌరవనీయులైన 14 వ పటాలము కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారు హాజరైనారు, కళాశాల విద్యార్థులతో కూలంకుశంగా చర్చించడము జరిగింది. 

అలాగే రోటరీ పురము గ్రామము లోని జడ్. పి. హై స్కూల్ విద్యార్థులకు లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ-సమాజ పాత్ర అనే అంశము పై వ్యాస రచన పోటీలను నిర్వహించడము జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహముతో ఈ పోటీలలో పాల్గొన్నారు.

అలాగే బుక్కరాయసముద్రము నందు కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారి ఆధ్వర్యములో బెటాలియన్ బ్యాండ్ షో నిర్వహించడము జరిగింది. 

పై కార్యమలలో డి. నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్ గారు, ఆర్.ఐ. లు శ్రీ బి. రాము శ్రీ యస్. నాగేంద్ర గారు మరియు శ్రీ. బి.లొకేశ్వర నాయుడు, శ్రీ జి. సీతారామ రావు గారు, ఆర్.యస్.ఐ. లు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

Flash..Flash.. ఎరువుల దుకాణము లపై విజిలెన్స్ అధికారుల తనిఖి లు...

 ఎరువుల దుకాణము లపై విజిలెన్స్ అధికారుల తనిఖి లు... మండలములోని రెడ్డిపల్లి గ్రామములోని రెండు ఎరువుల దుకాణములపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ పి శ్రీ మునిరామయ్య గారి ఆదేశముల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామా రావు గారు,వ్యవసాయధికారి శ్రీ వాసు ప్రకాష్ గారు మరియు డిప్యూటీ కమర్షియల్ టాక్స్ అధికారిని శ్రీమతి డి. విజయలక్ష్మి గారు అన్నదాత ఎరువుల దుకాణం మరియు ఉమేష్ చంద్ర ఎరువుల దుకాణం పై దాడులు జరిపి అన్నదాత దుకాణం లో రూ.28,288/- విలువ చేసే 13.1 లీటర్ ల కాలం చెల్లిన మందులను సీజ్ చేసారు. అదే విదంగా ఉమేష్ చంద్ర ఎరువుల దుకాణం లో రూ.36,700/- విలువ చేసే పురుగు మందులను సంబంధిత పత్రాలను చూపనందున అమ్మకాలు జరుపకుండా నిలుపుదల చేసారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి  శ్యాం సుందర్ రెడ్డి విజిలెన్స్ కాన్స్టేబుల్స్ పాల్గొన్నారు.

వివాహానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

వివాహానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

 శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం బండమీద పల్లి గ్రామానివాసి శ్రీమతి యం.రామాంజినమ్మ శ్రీ యం.రామమెహన్ గార్ల కుమారుడు మధు వివాహానికి ₹10,000/పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం పార్లమెంట్ అధికార ప్రతినిధి డేరంగుల శంకరయ్య నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

మార్కాపురం నియోజకవర్గం పొదిలి మండల పరిధిలో ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్రకు ఘనంగా సంఘీభావం తెలిపైన టీడీపీ శ్రేణులు

బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర మార్కాపురం నియోజకవర్గం పొదిలి మండల పరిధిలో ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్రకు ఘనంగా సంఘీభావం తెలిపారు.

ద్విసభ్య కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గ *విస్తృత స్థాయి* సమావేశం (బాబు షూరిటీ --భవిష్యత్తు గ్యారంటీ,ఓటర్ వెరిఫికేషన్,టెలిగ్రామ్ బాట్ )

అనంతపురం జిల్లా శిoగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం (బాబు షూరిటీ --భవిష్యత్తు గ్యారంటీ,ఓటర్ వెరిఫికేషన్,టెలిగ్రామ్ బాట్ ) నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు,మాజీ మంత్రి వర్యులు,పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారు హాజరై ప్రసంగిచారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు.వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న సామాజిక బస్సు యాత్రకు నిరసనగా బ్లాక్ బెలూన్ లు గాలి లోకి ఎగరవేసి నిరసన తెలిపారు.ఆరు మండలాల మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,బుత్ కమిటి ఇంచార్జ్ లు, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

సంద్రోహంలో గల్లంతైన బస్సు యాత్ర.. దిగ్విజయంగా సాగిన బస్సు యాత్ర.. భారీ జన సంద్రోహంతో నిండిపోయిన బహిరంగ సభ..

దిగ్విజయంగా సాగిన బస్సు యాత్ర 

భారీ జన సంద్రోహంతో నిండిపోయిన బహిరంగ సభ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్నతోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

40 ఏళ్ల చరిత్రని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేయలేని పనిని, ముఖ్యమంత్రి జగనన్న శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి రైతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ఘనత ఆయనదే అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

సింగనమల మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించి,భారి ర్యాలితో బుక్కరాయసముద్రం చేరుకున్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ నందిగం సురేష్, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ యస్.మంగమ్మ, పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ... సామాజిక సాధికార బస్సుయాత్ర మొదటగా శింగనమల నియోజకవర్గం నుంచి ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చెరువునీ సీఎం జగనన్న సహకారంతో నీళ్లతో నింపగలిగామన్నారు. 

గత ప్రభుత్వాల హయాంలో ఒక చెరువుకైనా నీళ్లు నింపారా అని ప్రశ్నించారు. పేదలు రైతులు అభివృద్ధి చెందాలంటే ఒక్క జగనన్నతోనే సాధ్యమన్నారు.

జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత శింగనమల చెరువుకు నీరు నింపడంతోపాటు, చెరువును లోకలైజేషన్ చేసి శింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా 40 చెరువులకు నీరు అందించిన ఘనత జగనన్నదే అన్నారు. వీటి ద్వారా రైతులతోపాటు, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు మంచి జరిగిందన్నారు.

జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల్లో 76% ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్ హోదా పదవులు ఇవ్వడం జరిగిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక జగనన్నతోనే సాధ్యమన్నారు. జరగబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.

సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేసిన శింగనమల నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అనంతపురం నగర పాలక సంస్థ మేయర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మచ్చలేని చంద్రబాబు గారికి మద్దతుగా నిలుద్దాం....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం దుగుమర్రి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు పంపిణి మరియు గ్రామo లో నిరసన ర్యాలీ ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని జైలు పాలు చేసి నలభై రోజులు గడుస్తున్నా వైసీపీ సర్కార్ నయాపైసా అవినీతిని కూడా బయట పెట్టలేకపోయిందన్నారు. క్విడ్ ప్రోకో పద్ధతిలో 2004తరువాత పెద్ద ఎత్తున సైకో జగన్ సంస్థల్లోకి నిధులు మళ్లిన అంశం ఇంకా జనం మదిలో ఉందన్నారు. పక్కా సాక్షాధారాలతో సీబీఐకి దొరికిన ఆర్థిక నేరస్తుడు జగన్ అని విమర్శించారు. చంద్రబాబు గారికి ఆయన కుటుంబ సభ్యులకు నిధులు వచ్చాయని జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణలను నిరూపించలేక పోతున్నారన్నారు. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై అన్ని ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు వైసిపి పాలనపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గారు జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారన్న ఆవేదన, ఆతృత అందరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్ అరాచకాలకు, కక్ష సాధింపు చర్యలకు తగిన బుద్ధి చెప్పడానికి ఎన్నికల కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ ను రాజకీయంగా సమాధి చేయడానికి అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారని వివరించారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బూత్ ఇంచార్జ్ లు,మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,దుగుమర్రి, నరసాపురం గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.