మచ్చలేని చంద్రబాబు గారికి మద్దతుగా నిలుద్దాం....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం దుగుమర్రి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు పంపిణి మరియు గ్రామo లో నిరసన ర్యాలీ ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని జైలు పాలు చేసి నలభై రోజులు గడుస్తున్నా వైసీపీ సర్కార్ నయాపైసా అవినీతిని కూడా బయట పెట్టలేకపోయిందన్నారు. క్విడ్ ప్రోకో పద్ధతిలో 2004తరువాత పెద్ద ఎత్తున సైకో జగన్ సంస్థల్లోకి నిధులు మళ్లిన అంశం ఇంకా జనం మదిలో ఉందన్నారు. పక్కా సాక్షాధారాలతో సీబీఐకి దొరికిన ఆర్థిక నేరస్తుడు జగన్ అని విమర్శించారు. చంద్రబాబు గారికి ఆయన కుటుంబ సభ్యులకు నిధులు వచ్చాయని జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణలను నిరూపించలేక పోతున్నారన్నారు. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై అన్ని ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు వైసిపి పాలనపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గారు జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారన్న ఆవేదన, ఆతృత అందరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్ అరాచకాలకు, కక్ష సాధింపు చర్యలకు తగిన బుద్ధి చెప్పడానికి ఎన్నికల కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ ను రాజకీయంగా సమాధి చేయడానికి అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారని వివరించారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బూత్ ఇంచార్జ్ లు,మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,దుగుమర్రి, నరసాపురం గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

నేడు సింగణమల నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న సామాజిక సాధికారిక బస్సు యాత్రకు పెద్ద ఎత్తున తరలిరండీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

◆సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేసుకుందాం.

◆ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగనన్న ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు.

◆వైయస్సార్సీపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

నేడు సింగణమల నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న "సామాజిక సాధికారిక బస్సు యాత్రకు" వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పద్మావతి పిలుపునిచ్చారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ లో జరగనున్న బస్సు యాత్ర సభా స్థలాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు.

నాలుగున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం,కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుండి ప్రారంభం కానుందన్నారు.

ఈ బస్సు యాత్ర శింగనమల నుండి ప్రారంభమై బుక్కరాయసముద్రం చేరుకొని డా.బి. ఆర్. అంబేద్కర్ సర్కిల్ దగ్గర సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. వైసీపీ అధిష్టానం మేరకు జరిగే బహిరంగ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ నందిగం సురేష్, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు అవుతారన్నారు. 

ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు గత టిడిపిలో పాలనలో నారా చంద్రబాబు నాయుడు పనితీరును, వైఎస్ఆర్సీపీ వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలకు వివరించనున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సాధికారిక బస్సుయాత్ర సభ విజయవంతం చేయండి నార్పల సత్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అనంతపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్

సామాజిక సాధికారిక బస్సుయాత్ర సభ విజయవంతం చేయండి

ఈనెల, 26-10-2023, అనగా గురువారం సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు జరిగే సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేయండి

నార్పల మండలం నందు ఉన్న ప్రజా ప్రతినిధులు, ZPTC, MPP, MPTC, లు మరియు వైయస్సార్సీపి మండల నాయకులు గ్రామస్థాయి లీడర్లు వైయస్సార్సీపి కార్యకర్తలు వార్డు మెంబర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారుదులు బూతు కన్వీనర్లు బూత్ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు మరియు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరై సామాజిక సాధికారిక బస్సుయాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను

ఇట్లు

నార్పల సత్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అనంతపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్

పేద ప్రజలకు రక్ష..జగనన్న ఆరోగ్య సురక్ష : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

పేద ప్రజలకు రక్ష..జగనన్న ఆరోగ్య సురక్ష : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

◆పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయగిరి గిరిజమ్మ

పేద ప్రజలకు ఉపయోగపడే మహోత్తరమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

కంటి పరీక్షల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను తిలకించారు. వైద్యం కోసం వచ్చిన అవ్వా తాతలతో ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి అవసరమైన మందులు అందజేయాలని వైద్యులకు సూచించారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ పథకం,108,104, సేవలు ప్రవేశపెట్టారని అదే దృష్టితో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకేసి పేదవాడి ఆరోగ్యం కోసం తపనపడుతున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.

గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం

కల్లుమడి గ్రామంలో నూతన గ్రామ సచివ

రేపటి నుండి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం..

రేపటి నుండి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం*

చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు పర్యటన

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

తిరుపతి/నారావారిపల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుండి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాటంలో భాగంగా ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి పోరాటాన్ని ఉదృతం చేసేందుకు నిజం గెలవాలి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. నేటికి 46 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి ఆమె ధన్యవాదాలు తెలుపనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు. తొలిరోజైన బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను భువనేశ్వరి రేపు పరామర్శిస్తారు. పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు. అలాగే గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీకాళ హస్తిలో పలు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.

శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి

నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తిరుపతి వచ్చిన భువనేశ్వరి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 10 గంటలకు శ్రీవారి దర్శనం అనంతరం నేరుగా నారావారిపల్లికి వెళ్లారు. నారావారిపల్లెలో గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా నారావారిపల్లి గ్రామస్తులు భువనేశ్వరిని కలిసి సంఘీభాతం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తమను ఎంతో బాధించిందన్నారు. రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి సూచించారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులు, భర్త చంద్రబాబు నాయుడుతో కలిసి నారావారిపల్లెకు వచ్చే భువనేశ్వరి ఈసారి ఒంటరిగా గ్రామానికి రావడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉండగా ఇలా ఒంటరిగా నారావారిపల్లెకు వచ్చిన భువనేశ్వరిలో బాధను చూసిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెస్ రాజు సైకిల్ యాత్రకు ఘనంగా సంఘీభావం తెలిపి స్వాగతం పలికిన కనిగిరి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు..

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెస్ రాజు అన్నగారి సైకిల్ యాత్రకు ఘనంగా సంఘీభావం తెలిపి స్వాగతం పలికిన కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఉగ్ర నరసింహ రెడ్డి గారు ,ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్సన్ బాబు గారు మరియు కనిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నార్పల మండల కేంద్రం లో నారాయణస్వామి అనే యువకుడు అనుమానస్పద స్థితి మృతి..
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని స్థానిక SC కాలనీలో దసరా పండగ పాడ్యమి సందర్భంగా మంగళవారం రాత్రి కొందరు యువకులు నార్పల స్మశానం పక్కన ఉన్న మామిడి తోటలో 5గురు యువకులు పార్టీ చేసుకుని మద్యం సేవించారు. అయితే 5 మందిలో ఒకరు అయినటువంటి  నారాయణస్వామి వయసు 30సం.అనే యువకుడు అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. నారాయణస్వామి అనే యువకున్ని హత్య చేశారా అని మండల వ్యాప్తంగా చర్చగా మారింది. ఇది హత్య... లేదా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసులు సందర్శించారు.
శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి...
తిరుమల : శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి... రంగనాయకుల మండపంలో భువనేశ్వరికి వేదాశీర్వాదం చేసిన పండితులు... భువనేశ్వరికి తీర్థప్రసాదాలు అందజేసిన ఈవో ధర్మారెడ్డి... భువనేశ్వరి వెంట ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్ రెడ్డి.
సామాజిక సాధికారిక బస్సు యాత్ర సభ స్థల పరిశీలన...
సామాజిక సాధికారిక బస్సు యాత్ర సభ స్థల పరిశీలన... ఈ నెల 26 వ తేదిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర శింగనమల నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిర్వహించనున్న బహిరంగ సభకు స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య పరిశీలించారు. బస్సు యాత్రకు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులకు సూచించారు. సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
దేశం చేస్తుంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం.. కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
.జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు 5నిమిషాల పాటు నిర్వహించిన " దేశం చేస్తుంది రావణ దహనం మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో సైకో పోవాలి అని రాసిన పత్రాలను అగ్ని లో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకటనరసానాయుడు గారు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు నాయుడు గారి ని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన ఉండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిట్టు రంగారెడ్డి, ఎర్రినాగప్ప,pl లక్ష్మి నారాయణ, తలారి కుళ్లాయప్ప, పప్పూరు సత్తి, గుత్తానాయుడు,కమలాకర్, రవి, నరసన్న, తిరుపతయ్య,ధనుంజయ,వెంకటరాముడు,సుధ,శివారెడ్డి, నాగభూషణ,నాగేంద్ర, హనుమంత్ రెడ్డి,మారుతీ, విజయ్,రామాంజి బొoదలవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.