బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామము, 14th Bn APSP నందు పోలీస్ అమరవీరుల దినోత్సవము..

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము తేది: 21.10.2023 ప్రదేశము: 14th వ పటాలము, అనంతపురము. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా 21.10.2023 తేదీన బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామము, 14th Bn APSP నందు పోలీస్ అమరవీరుల దినోత్సవముకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కె. చిన్నారావు, సూపరిండెంట్ ఆఫ్ జైలర్, ఓపెన్ ఎయిర్ జైల్ గారిని శ్రీ డి. నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్ గారు పుష్పగుచ్చము ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ కె. చిన్నారావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి గౌరవ సూచికంగా పోలీసు వందనము స్వీకరించి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కె. చిన్న రావు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నక్సలిజం టెర్రరిజం ఫ్యాక్షనిజం మాఫియా పలు ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కోవడంలో అసువులు బాసిన పోలీస్ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 14వ బెటాలియన్ ఏపీఎస్పీ నందు పని చేస్తూ అసువులు బాసిన శ్రీ యన్. ఉదయ్ భాస్కర్, పీ,సి-760, వారి కుటుంబము మరియు బి. నారాయణస్వామి, పి. సి. 960 కుంటుంబము రావడం జరిగినిది. ఇరువురు కుటుంబాల యెక్క బాగోగులును శ్రీ డి.నాగేశ్వరప్ప అడిషనల్ కమాండెంట్ అడిగి తెసుకోవడము జరిగినది. తదనంతరం అమరవీరుల స్థూపానికి బెటాలియన్ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కె. చిన్నా రావు, సూపరిండెంట్ ఆఫ్ జైలర్ గారు, శ్రీ డి నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్, డి.వి రమణమూర్తి, అసిస్టెంట్ కమాండెంట్, విల్సన్ కేర్ అసిస్టెంట్ కమాండెంట్ గారు. ఆర్.ఐ లు నాగేంద్ర, లోకేశ్వర నాయుడు, సీతారామ రావు గారు, ఆర్ యస్ ఐ లు, ఏ ఆర్ యస్ ఐ లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గోన్నారు.

ఉండవల్లి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆక్రమ అరెస్టు తర్వాత తొలిసారి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో* టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు..
ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్న.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర వివరాలగురించి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నారు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు పూర్తి అయినాయి ఎన్ని నియోజకవర్గాలు పూర్తి అయినాయని ఎమ్మెస్ రాజు గారిని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది
ఉండవల్లి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోజరుగుతున్న సర్వసభ్య సమావేశానికి హాజరైన ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆక్రమ అరెస్టు తర్వాత తొలిసారి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉండవల్లి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి హాజరైన ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులుతదితరులు..
దసరా శరన్నవరాత్రులు 7వరోజు శ్రీ పెద్దమ్మ స్వామి వారిని దర్శించుకొన్న జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు రామలింగారెడ్డి, పర్వాతనేని శ్రీధర్ బాబు
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దసరా శరన్నవరాత్రులు 7వ రోజు సందర్భంగా శ్రీ పెద్దమ్మ స్వామి వారిని దర్శించుకొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు
సింగనమల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి బోయ చిన్న అక్బర్ గారి కూతురు భారతి గారి వివాహా రిసెప్షన్ కి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్, దాసరి గంగాధర్, మాజీ ఎంపిటిసి కుల్లాయప్ప, రాఘవరెడ్డి, బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి ఎం ఆదినారాయణ, పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి బండి పరశురాం, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బెస్ట్ నారాయణ స్వామి, రంగస్వామి, జంగం శెట్టి నవీన్ కుమార్, సతీష్ రాయల్ ,సోము రాయల్ ,ప్రకాష్ రాయల్ ,కాయల సురేష్ ,సింగనమల గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి వెంకట్ నారాయణ, జడేజా, సుంకన్న, ఎర్రి స్వామి, బెస్త అమర్నాథ్ , ఐ టి డి పి ముని, గౌస్, కాయ శంకర్, చిన్న, ఎం శివ, నరేష్,ఎం జి ప్రసాద్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ప్రాణ త్యాగాలకు సిద్దం కావాలి ఎమ్మార్పీఎస్ పాదయాత్రకు సంఘీభావంగా సాకే హరి
స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ప్రాణ త్యాగాలకు సిద్దం కావాలి ఎమ్మార్పీఎస్ పాదయాత్రకు సంఘీభావంగా సాకే హరి
ఎంత జనం అంత వాట దక్కాల్సిందే నినాదాన్ని బలపరచి సాధించుకోవాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.గురువారం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు ఎబిసిడి వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్ర నగరానికి చేరుకున్న సందర్భంగా సాకే హరి సప్తగిరి సర్కిల్ లో ఘనంగా సంఘీభావం తెలుపుతూ పూల మాలలు వేసి సంపూర్ణ మద్దతు తెలిపారు.అనంతరం రక్తానైన చిందిస్తాం ఎబిసిడి సాధిస్తాం.పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదం తెలుపాలని నినాదాలు చేస్తూ బాబు జగ్జివన్,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి వర్గీకరణ అవశ్యకతపై పలువురు నాయకులు మాట్లాడారు.సాకే హరి మాట్లాడుతూ..అధిక జనాభా కలిగిన బీసీల్లో ఎబిసిడి లుగా విభజించారని మరి ఎస్సీ ఉప కులాలకు వర్గీకరణ చేస్తే తప్పెట్లవుతుందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాలయాపన చేస్తూ దళితుల మధ్య చిచ్చు రాజేస్తున్నాయని మండిపడ్డారు.స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర మాదిగలకు ఉందన్నారు. స్వాతంత్రోద్యమ కోసం పోరాటం ఎలా జరిగిందో జాతి ప్రయోజనాలు, అసమానతలు,విభజించు పాలించు పద్దతులపై అదే స్థాయిలో పోరాడాలని కోరారు.రేపు నెల 7న హైదరాబాద్ లో జరుగు బహిరంగ సభను లక్షలాది మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పాదయాత్ర చేస్తున్న హరి గోపాల్.బండారు కదిరప్ప.రేకలకుంట రామాంజనేయులు.నిషార్.బానాసి శ్రీను.సునీత.శాంతమ్మ మిగతా సభ్యులకు జే,ఏ,సీ నాయకులు రామక్రిష్ణ.కొర్రపాడు నాగేంద్ర.రాజన్న.నారాయణ స్వామి.రాఘవేంద్ర.సుమంత్.తదితరులు స్వాగతం పలికారు.
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో మీడియా సమావేశం మాట్లాడుతున్న టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు..
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో మీడియా సమావేశం మాట్లాడుతున్న టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు *MSరాజు* సమావేశంలో కనిగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు ఎస్సీ సెల్ నాయకులు ,కార్యకర్తలు
ప్రకాశం జిల్లాలోకి ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్ర
ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్ర* నెల్లూరు జిల్లాలో ముగించుకొని ప్రకాశం జిల్లాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తిరగలదిన్నె గ్రామం వద్ద ఘనంగా సంఘీభావం తెలిపి స్వాగతం పలికిన జిల్లా టిడిపి నాయకులు ఎస్సీ సెల్ నాయకులు ,కార్యకర్తలు
రోటరీపురం గ్రామంలో బాబు తో నేను "భవిషత్తు గ్యారెంటి"కార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు..
బాబు తో నేను.. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం.. శింగనమల నియోజవర్గం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామంలో బాబు తో నేను ""భవిషత్తు గ్యారెంటి""కార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసన కార్యక్రమాలు రాబోవు రోజుల్లో ఎలా చేయాలి "" బాబుతో నేను"" భవిషత్తు గ్యారెంటి ""అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి బాబు గారి అక్రమ అరెస్టు ను వివరించి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి చెప్పిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు. ఈ కార్యక్రమంలో అశోక్ లక్ష్మి నారాయణ కేశన్న సోముశేఖర్ చెదళ్ళ నారాయణస్యామి రామానాయుడు గోపాల్ నాయుడు మల్లేష్ లక్ష్మి నారాయణ యాదవ్ బాబా ఫక్రద్దీన్ వలి సురేష్ చౌదరి నాయుడు నరేంద్ర యాదవ్ బోలే అక్కలప్ప రెడ్డిపల్లి నాయుడు జింకల కృష్ణ బండి మధు బొజ్జయ్య యాదవ్ గుర్రప్ప వీరయ్య పీట్ల అశోక్ అరిగెల రాజు బుక్కరాయసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.