జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సిద్దాపురం గ్రామంలో
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొండన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారూ , జెడ్పిటిసి భాస్కర్ గారు, కల్పన కల్పన పసులూరు సర్పంచ్ గారు, నీతో పేరు వచ్చింది వెంకటలక్ష్మి ఎంపీటీసీ గారు, ఎమ్మార్వో రమాదేవి ఎంపీడీవో తేజస్నా, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ రాజు జనరల్ సర్జన్, డాక్టర్ శోభారాణి జనరల్ ఫిజీషియన్, డాక్టర్ తెహరోన్ని డాక్టర్ వినోద్ కుమార్, ఆ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, అంగడి శివానంద, జి నారాయణస్వామి, ఆకుల నాగముని , కొండాపురం మల్లేష్, మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి 506 మంది వివిధ జబ్బులకు చికిత్స తీసుకోవడం జరిగింది, 167 మంది వివిధ రకాల పరీక్షలు చేసుకోవడం జరిగింది, ఆరు మందిని జనరల్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది, వైయస్సార్ కంటి వెలుగు కింద 122 మందిని చూడడం జరిగింది 22 మంది అది ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ ఇతర వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
బుక్కరాయసముద్రం మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొండన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారూ , జెడ్పిటిసి భాస్కర్ గారు, కల్పన కల్పన పసులూరు సర్పంచ్ గారు, నీతో పేరు వచ్చింది వెంకటలక్ష్మి ఎంపీటీసీ గారు, ఎమ్మార్వో రమాదేవి ఎంపీడీవో తేజస్నా, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ రాజు జనరల్ సర్జన్, డాక్టర్ శోభారాణి జనరల్ ఫిజీషియన్, డాక్టర్ తెహరోన్ని డాక్టర్ వినోద్ కుమార్, ఆ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, అంగడి శివానంద, జి నారాయణస్వామి, ఆకుల నాగముని , కొండాపురం మల్లేష్, మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి 506 మంది వివిధ జబ్బులకు చికిత్స తీసుకోవడం జరిగింది, 167 మంది వివిధ రకాల పరీక్షలు చేసుకోవడం జరిగింది, ఆరు మందిని జనరల్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది, వైయస్సార్ కంటి వెలుగు కింద 122 మందిని చూడడం జరిగింది 22 మంది అది ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ ఇతర వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
నూతన కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
నూతన కళ్యాణ మండపానికి భూమి పూజ గార్లదిన్నె మండల కేంద్ర పరిధిలోని మర్తాడు క్రాస్ సమీపంలో నూతన కళ్యాణ మండపానికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి భూమి పూజ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆంజనేయులు తన సొంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలకు టీడీపీ ద్వారా చేసే మేలును తెలిపే కరపత్రం పంపిణీ చేస్తూ వివరించిన అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు
బాబుతో నేను, "భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమం శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామాంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించి వివరించారు.ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ,ఈ ప్రభుత్వంలో పెరిగిన నిత్యావసర ధరలు వాటి ప్రభావం సామాన్యులపై ఏ విధంగా ఉందో తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలకు తెలుగుదేశం పార్టీ ద్వారా చేసే మేలును తెలిపే కరపత్రం పంపిణీ చేస్తూ వివరించిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో ఆశోక్ కేశన్న లక్ష్మి నారాయణ నారాయణ స్వామి రామానాయుడు గోపాల్ నాయుడు నరేంద్రయాదవ్ సురేష్ చౌదరి బాబ ఫకృద్దిన్ కేశవరెడ్డి బాబయ్య చితంబరి రెడ్డిపల్లి నాయుడు సునీల్ కుళ్ళాయప్ప నరసింహులు బాబయ్య పెద్ద బాబయ్య గుర్రప్ప నాగరాజు ఆది నాగేంద్ర అరిగెల రాజు చంద్ర బుజ్జి తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి * గత పాలనలో, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల ఒరవడిని చూసి ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండలం గంగనపల్లి, ముచ్చుకుంటపల్లి, తుంపెర గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. స్థానిక ప్రజలు, అధికారులు కలసి ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి అందిన లబ్దిని వివరించారు. ఏవైనా సమస్యలున్నా, అర్హులై ఉండి ఎవ్వరికైనా పథకాలు అందకపోయినా తెలియజేయాలన్నారు, దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుపరచని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రజలకు అందిస్తుంటే ప్రతి పక్షాలు వాటిని ఓర్వ లేక ఓటమి భయంతో ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. నేరుగా సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల ఖాతాలకే వేయడంతో అవినీతి రహితంగా పథకాల సొమ్ముని ప్రజలు పొందుతున్నారన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల నుంచి ప్రజాస్పందన అనూహ్యంగా లభిస్తుందన్నారు.
సైకో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపుదాం....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గొల్లపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చేశారన్నారు. కానీ ఈ సైకో జగన్ రెడ్డి పాలనలో అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులతో పాలన సాగుతోందని అని నిజాయితీగా రాష్ట్రానికి కష్టపడిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 45 రోజులు జైల్లో నిర్బంధించారని, అక్రమ అరెస్టుపై ప్రతి ఒక్కరు సంఘీభావం తెలియజేస్తున్నారు. అని ప్రజలందరూ ఏకమై వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తారని రోజులు దగ్గర పడ్డాయి అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, గ్రామ నాయకులు,గొల్లపల్లి, సిద్దలచెర్ల, దుర్గం గ్రామ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు
మైదుకూరు టీడీపీ నాయకులు ఎమ్మెస్ రాజు గారి యాత్రకు సంఘీభావం
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు టీడీపీ నాయకులు ఎమ్మెస్ రాజు గారి యాత్రకు సంఘీభావం తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర మైదుకూరు నియోజకవర్గం మూడుమాళ్ళు గ్రామం లో
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర* మైదుకూరు నియోజకవర్గం మూడుమాళ్ళు గ్రామం లో ఎస్సీ కాలనీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎమ్మెస్ రాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య గారికి, ఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిమ్మయ్య గారు శాల్వాతో ఘనంగా సత్కరించి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులుగన్నేపాటి మల్లేసు,జిల్లా Sc cell అధికారప్రతినిధి టుంకూరు రామాంజనేయులు,జిల్లా మైనారిటీ Ex సలీమ్ భాష, సుబ్బారాయుడుexmptc, దావనం శ్రీనయ్య జిల్లా sc celll కార్యదర్శి, కొండయ్య, లక్షినారాయణ రెడ్డి, పుల్లయ్య, సత్తార్,నగర sc cell రాయుడు మరియు టిడిపి కార్యకర్తలు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
సైకో జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి : రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బొమ్మకుంటపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ సైకో జగన్ రెడ్డి చేస్తున్న కుట్రను, మోసాన్ని అన్యాయంగా ఎటువంటు అవినీతి జరగకుండానే నేరం మోపి చంద్రబాబునాయుడు గారిని జైలుకు పంపారని, అవినీతి జరిగి వుంటే ఇప్పటికే సాక్షాలు చూపేవారు అని కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా అక్రమంగా కేసులు మోపుతున్నారని ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలియచేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు అడుగేసి భవిష్యత్తు మార్చుకోవాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందని ఒక్కసారి ఆలోచించాలని వ్యవస్థలు అన్ని నాశనం చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా అందుకే ప్రజలు మేలుకోకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, బొమ్మకుంటపల్లి, పప్పూరు గ్రామ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు
జగనన్న పాలనలో అందరికీ సంక్షేమం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
*పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి* ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు చేరాయని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండలం మాలవాండ్లపల్లి, కమ్మ కొట్టాలు, గొల్లపల్లి, సిద్ధరాచర్ల, బోయ కొట్టాల, దుర్గం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పొందిన లబ్దిని ప్రజలకు వివరిస్తూ బుక్ లెట్లను పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకొని, పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పథకాల అమలులో జగనన్న ప్రభుత్వానికి ఎలాంటి కుల, మత, వర్గ, పార్టీలంటూ తారతమ్యాలు లేవన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. వైసీపీ నాలుగేళ్ళ పాలనలో తమ కుటుంబానికి రూ.7 లక్షలు లబ్ది చేకూరిందని సాకే పద్మావతి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.