గుత్తి మండల ప్రవాస్ యోజన లో భాగంగా మండల బీజేపీ కార్యవర్గ సమావేశం..
  భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు సూచనల మేరకు మండల అధ్యక్షుడు బలకా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన లో భాగంగా మండల కార్యవర్గ సమావేశం బిజెపి మండల కార్యాలయంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రవాస్ యోజన మండల ఇంచార్జ్ గొంది అశోక్ గారు హాజరైనారు ఈ సమావేశంలో మండల కమిటీ శక్తి కేంద్ర ప్రముఖులు బూతు కమిటీ అధ్యక్షులు లతో మాట్లాడడం జరిగినది బిజెపి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేసి పూర్తిస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలని తెలపడం జరిగినది విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలలో కి తీసుకువెళ్లాలని సూచించడమైనది ప్రధానమంత్రి జయంతి సందర్భంగా సేవా పక్షంలో కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు డిబి రంగరాజు ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జె యం మాణిక్యం ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి నాగేపల్లి లక్ష్మయ్య ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పూజారు ఉపులప్ప కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అప్పల రంగస్వామి రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మండల ఉపాధ్యక్షులు వరిమడుగు లక్ష్మీనారాయణ పాటిల్ మోహన్ రెడ్డి మండల కార్యదర్శి ఎస్ రాము వడ్డే వెంకటేశ్వర్లు వేణుగోపాల్ రాజ్ జే వెంకట్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
మిలద్ ఉన్ నబీ ప్రత్యేక ప్రార్థనలతో పాల్గొన్న అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ AKS ఫయాజ్..
నేడు మిలద్ ఉన్ నబీ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, నగర మేయర్ వసీం గారితో కలిసి మసుబా బీ దర్గా లో ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్నారు అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ AKS ఫయాజ్ గారు. అనంతరం మొహమ్మద్ ప్రవక్త ప్రజలను మంచి మార్గం లో నడిపించడానికి చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకోవాలి అని అన్నారు. ప్రేమానురాగాలు, శాంతిని మొహమ్మద్ ప్రవక్త బోధించారు అని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో మత పెద్దలు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైఫుల్ల బైగ్, కో ఆప్షన్ సభ్యులు షంశుద్దిన్, వైఎస్సార్సీపీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు....
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల గారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. వడగాల్పు నా జివీతమైతే వెన్నెల నా కవిత్వం అన్న నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా
ఎం.యస్ .స్వామినాథన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ (జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.ఇవాళ ఆయన 98 వయసులో చెన్నై లో తుది శ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరవీరుడు భగత్ సింగ్ గారి త్యాగాలు మరువలేనివి భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించాలి.. NSUI జిల్లా నాయకులు మురళీకృష్ణ, మంజునాథ్.
అనంతపురం నగరంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ గారి 116వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ గారి ఫోటోకి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన NSUI జిల్లా నాయకులు j.మురళీకృష్ణ పుల్లలరేవు మంజునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర నరాలలో దేశభక్తి అణువణువునా స్వాతంత్య్రం సాందిచాలనే కాంక్ష పట్టు విడువని పోరాట పటిమ పోరాటం అంటే ఇలానే చెయ్యాలని భావి తరాలకు చాటి చెప్పిన గోప్ప పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్’.. ఈ పేరు వింటే చాలు భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే ధీరుడు భగత్ సింగ్ అని అన్నారు. 1907 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించిన ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం... బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడారని ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా.. వారు అధైర్య పడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని 13 ఏళ్ల వయసు నుంచే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన అసమాన్య పోరాటయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేటితరం విప్లవ జ్వాలకు అసలైన మార్గదర్శిగా భగత్ సింగ్ ను చూస్తున్నారంటే ఆయనలోని పోరాట పటిమ ఎంత బలమైనదో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర, మహేష్, బాబు, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కు నిరసనగా పెరవలి లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ..

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగాసింగనమల మండలం పెరవలి గ్రామపంచాయతీలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు నియోజకవర్గ ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశానుసారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సీనియర్ తెలుగుదేశం నాయకులు గోరంట్ల మారుతి నాయుడు ఆధ్వర్యంలో పెరవలి గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు ని అక్రమ అరెస్టు చేసి ఈరోజు 20 రోజులు కావొస్తుందని కానీ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు చూపకుండా రిమాండ్ లోనే ఉంచుతున్నారని వీటిని తెలియజేస్తూ గ్రామంలో ఇంటింటికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు పై జరుగుతున్న కుట్ర కుతంత్రాలు  ప్రజలకు తెలియజేస్తూ 2024లో నారా చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు తెలిపి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు*

ఈ కార్యక్రమంలోపెరవలి సర్పంచ్ రాజు మాట్లాగొంది సర్పంచ్ గాండ్ల రమేష్ నూతనంగా ఎన్నికైన వార్డ్ నెంబర్ బాలకృష్ణ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్  దండు విజయ్ కుమార్  పెరవలి కృష్ణమోహన్ నాయుడు నాగరాజు వీరాంజనేయులు వెంకట స్వామి కృష్ణమోహన్  రామచంద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి ఎస్సీ సెల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మొండి పోగుల ఎర్రిస్వామి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ మాజీ ఎంపీటీసీ చిక్కాల చెనరాయుడు రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి నాగులగుడ్డం లక్ష్మీనారాయణ శ్రీనివాస్ నాయక్ సుదర్శన్ నాయక్ నారాయణస్వామి రాజు నరేష్ మాట్లాగొంది పుల్లయ్య రమేష్ సింగనమల శంకర్ నల్లప్ప జడేజా బోయ సుధాకర్ రవి హరి అంజి రాచేపల్లి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం సీపీఐ మద్దతు తెలియజేస్తూ...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు సింగనమల మండల కేంద్రంలో టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం (సీపీఐ)పూర్తి మద్దతు తెలియజేస్తూ

 ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

 డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను శాంతియుతంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన ఉద్యమాలు చేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు ,పోలీసుల ద్వారాఅక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్యమాలను చేయాలని చూడడం చాలా దుర్మార్గం దీనికి తార్కాణము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎటువంటి ఆధార్ లేకుండా అరెస్టు చేయడం ఉదాహరణ ,ఉద్యమాలు అణిచివేచే ప్రయత్నాలు ఇకనుండీఅయినా వైకాపాప్రభుత్వము

ఇటువంటీ చర్యలు మానుకొని రైతులు పడుతున్న అష్ట కష్టాలను ప్రజలు,రైతులు అధిక భారాలతో కార్మికులపడుతున్నభాధలు పైన దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి ఈరోజు నిరుద్యోగ యువతఉద్యోగాలు లేక రోడ్ల పాలవుతున్నారు ప్రభుత్వపాలసీలుప్రజలకుఉపయోగ పడే విధంగా ఉండాలి,కావున ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు,అపాలి శాంతియుతంగా చేసే ఉద్యమాలకు సహకరించాలని లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పుట్టకథలు హెచ్చరించడం జరిగింది. పాల్గొన్నవారు,

 తెలుగుదేశం నాయకులతోపాటు రైతు సంఘం శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి చేనేతమధు, సిపిఐ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నారప్ప, సింగనమల రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, బయన్న, మరియు రామ సుబ్బారెడ్డి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగావిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు డా_తలారి_రంగయ్య..

తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే సమాజ సంస్కరణకు సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని సాంఘిక అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ గుర్రం జాషువా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు #డా_తలారి_రంగయ్య గారు.

కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయిలో గుర్తింపు..

కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈనెల 12 13 వ తేదీన జరిగిన నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 89.19% సాధించడం జరిగినది. ఇందుకు గాను మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయిలో గుర్తింపు పొందినది. దీనికి సహకరించిన జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి మా వైద్యుల తరఫున కృతజ్ఞతలు.

రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 15 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమం లో sc సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, పుట్లూరు మండల కన్వీనర్ బాలరంగయ్య, మల్లికార్జున, బ్రహ్మయ్య, bks మండల నాయకులు కేశన్న, సురేంద్ర,నరేష్, నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు, ms రాజు గారు, మాట్లాడుతూ.. 

పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతుంటే ఆయన నిజాయితీ ఏంటో ఈ జగన్ కి ఇంకా అర్థం కావట్లేదు,ప్రజలు స్వచ్ఛందంగా మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా బాబు గారిని వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నారు 

నువ్వు మా చంద్రబాబు గారిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరో ఆరు నెలల్లో నిన్ను, నీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపి వేస్తారు. ఇంకా న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు  

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.