మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత గారిని స్వగృహంలో పరామర్శించిన.. అనంతపురం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

 మాజీ మంత్రివర్యులు రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల సునీత గారు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ సోమవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిటాల సునీత గారిని అక్రమ అరెస్టు చేసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి ఇంటిలో ఉన్న మాజీ మంత్రివర్యులని అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసూల చంద్రమోహన్ చిక్కాల చండ్రా యుడు జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహ కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న తదితరులు పరామర్శించడం జరిగింది*

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సమీక్ష సమావేశం...

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లతో వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నీలంపల్లి గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. అనంతరం జగనన్న ఆరోగ్యం సురక్ష పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొర్రపాడు వైద్యాధికారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నీలంపల్లి గ్రామ సర్పంచ్ రసూల్ బి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి జిల్లా నందు రేపే టూరిజం డే సంబరాలు అందరూ ఆహ్వానితులే

సత్యసాయి జిల్లా నందు రేపు జరగబోయే ప్రపంచ టూరిజం దినోత్సవ సంబరాలకు అందరూ ఆహ్వానితులే కాబట్టి అందరూ హాజరై టూరిజం డే ఉత్సవాలను వీక్షించి విజయవంతం చేయాలని కోరుతూ...

చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం నిరసన ర్యాలీ..

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మరియు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల నాగభూషణ మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు డేగల కృష్ణమూర్తి వేలూరు రంగయ్య ఆలం వెంకట నరస నాయుడు ముత్యాలపనాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని ఏ తప్పు చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఏ తప్పు చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఈరోజుకు 19 రోజులు డిమాండ్ పంపడం పంపడం అన్యాయమని మాకు వచ్చిన నిధులు 8629 కోట్లు అక్రమాకంగా మళ్లించడం ఇది చట్ట ఉల్లంఘన కాదా అని వారు ధ్వజమెత్తారు* 

 ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు పిట్టు వెంకటనారాయణమ్మ యుగంధర్ నల్లప్ప కుల్లాయప్ప నాయుడు నర్సింగ్ మూర్తి నాగమణి రెడ్డి నరేష్ వసంత్ కుమార్ రమేష్ నాగార్జున రాజు నాగమణి రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి శివశంకర్ నాగమణి రెడ్డి అస్పర్ధ రెడ్డి సాకే తిరుపాల్ ఉజ్జినప్ప సీనయ్య  ఆంజనేయ రెడ్డి భరత్ కుమార్ నాగార్జున మల్లికార్జున వీరికి సంఘీభావంగా  జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి నరసింహులు  మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి బ్యాల్ల నాగేంద్ర నిట్టూరు శివాజీ భగవాన్ ఎల్లనూరు దొడ్లో రామాంజనేయులు హనుమంతు కొయ్యగురా పెద్దన్న చండ్రా రాయుడు తదితరులు సంఘీభావం తెలిపి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు

కళ్ళకు గంతు లు కట్టుకొనిమోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన..రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ..

సింగనమల దిసభ్య కమిటీ సభ్యుల ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, కళ్ళకు గంతు లు కట్టుకొనిమోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధికార ప్రతినిధి తలారి తిప్పన్న ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసాపురం శివరామకృష్ణ, రంగాపురం శ్రీరాములు, గుగుడు చికెన్ ఓబులేసు, మల్లెల కుల్లాయప్ప, గోపాల్, బొగ్గు నల్లప్ప ,శ్రీరామయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది

బుక్కరాయసముద్రం మూడో సచివాలయం నందు దక్షిణామూర్తి నగర్ లో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం..

బుక్కరాయసముద్రం మూడో సచివాలయం నందు దక్షిణామూర్తి నగర్ లో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య అధికారిని డాక్టర్ స్వాతి లక్ష్మి గారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో భాగంగా నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వెళ్లి సర్వే చేస్తున్నారా లేదా అని ప్రజల వద్ద ఆరా తీయడం జరిగింది, దీర్ఘకాలిక రోగులకు రక్తపోటు మరియు డయాబెటిస్, ఆస్తమా, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారా లేదా అని ఆరా తీయడం జరిగింది, అక్టోబర్ ఆరో తారీఖున నిర్వహించు జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపునకు తప్పనిసరిగా అందరూ రావాలని, వారికి ముందస్తుగా టోకెన్లను అందిస్తున్నారా లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు, ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా బెడ్ రిటన్ ( మంచానికే పరిమితమైన రోగుల ఇంటి వద్దకు వెళ్లి) వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగింది, అలాగే కాన్పు అనంతరం బాలింత సేవలు అందిస్తున్నారా లేదా అని బాలింత ఇంటి దగ్గరకు వెళ్లి పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మీట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్త బొజ్జమ్మ, ఆశా కార్యకర్తలు కృష్ణవేణి, సావిత్రి, వాలంటీర్లు ఫ్యామిలీ ఫిజీషియన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

జగనన్న కాలనీల నందు ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల జడ్పిటిసి నీలం భాస్కర్

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం గ్రామం రోడ్డు ప్రక్కన ఉన్న జగనన్న కాలనీ నందు లబ్ధిదారుల ఇళ్ళ ముందు ఇంకుడు గుంతలను చేపడుతున్న సందర్భంగా ఆ ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల జెడ్పిటిసి నీలం భాస్కర్. కార్యక్రమంలో జే సి ఎస్ మండల కన్వీనర్ పసులూరు భయపరెడ్డి స్టోర్ డీలర్ల సంఘం ఉపా అధ్యక్షులు సాకే లక్ష్మీనారాయణ హౌసింగ్ ఏఈ రాజశేఖర్ రెడ్డి

మెరుగైన పరిష్కారం చూపాలి.. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

పుట్టపర్తి కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య , పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డి ఎల్ డి వో శివారెడ్డి, డిఆర్డిఏ పిడి నర్సయ్య, డిపిఓ విజయ్ కుమార్ పాల్గొని వినతులను స్వీకరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత సమయంలోగా నాణ్యతగా జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు పరిష్కారం చూపించాలని, స్పందన గ్రీవెన్స్ ల పరిష్కారంపై వ్యక్తిగతంగా దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, గ్రీవెన్స్ ల పరిష్కారంలో అర్జీదారుడితో మాట్లాడి నాణ్యతగా పరిష్కారం చూపించాలని, రీఓపెన్ పిటిషన్ ఏది వచ్చినా సీనియర్ అధికారితో విచారణ చేసి పరిష్కరించాలన్నారు. రీఓపెన్ చేసిన పిటిషన్ ను వ్యక్తిగతంగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అంతేకాక స్పందన గ్రీవెన్స్ కు సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఎలు రాకూడదని, గడువు దాటకుండా గ్రీవెన్స్ కు పరిష్కారం చూపించాలన్నారు. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న బియాండ్ ఎస్ఎల్ఎలను వెంటనే సున్నా చేయాలన్నారు. మండల స్థాయిలో కూడా స్పందన గ్రీవెన్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటున్నాయని, వెంటనే పరిష్కరించాలని సూచించారు. 

ప్రభుత్వప్రాధాన్యతా భవనాలు అక్టోబర్ 30 కల్లా పూర్తి చేయాలి. 

సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన గ్రామా వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై. యస్. ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణ పనుల అక్టోబర్ 30 కల్లా పూర్తి చేసి సంబందితా శాఖలకు అందజేయాలని యం పిడిఓ ల ను,పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు ను ఆదేశించారు.  

ప్రతి మండలానికి వారానికి నిర్దేశించిన లక్ష్యాలను ఆ వారం లోగా నే పూర్తి చేయాలని ఎంపిడిఓ లను,ఇంజనీర్లు ఆదేశించారు. పూర్తి చేసిన భవనాలను అక్టోబర్ 30 నాటికి సంబందితా శాఖలకు అందజేయాలని సంబందితా శాఖల అధికారుల ను ఆదేశించారు. 

ఇప్పటి వరకు నిర్మించిన భవనాల నిర్మాణాలకు సంబంధించి నిధులు పెండింగ్ లేకుండా చూడాలని, 5 రోజులలో బిల్స్ ఆన్ లైన్లో అప్డేట్ చేసి క్లియర్ చేయాలన్నారు. 833 భవనాలలో ఇప్పటికే 466భవనాలు వివిధ దశలలో నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. 367 భవనాలు పూర్తిచేసి సంబంధించిన శాఖ అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారుప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాల ప్రగతిలో పర్యవేక్షణ లోపం లేకుండా ఎంపీడీవోలు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే హౌసింగ్ లో కేటాయించిన లక్ష్యం గడపగడపకు మన ప్రభుత్వం కింద చేపడుతున్న పనులు పూర్తయిన పనులకు సంబంధించిన అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

రేపటి రోజున పైలట్ ప్రాజెక్టు కింద పుట్టపర్తి మండలం జగరాజు పల్లి లో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని దీనికై అన్ని శాఖ అధికారులు సమన్వయ సహకారాలతో పని చేయాలని

జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 ఈనెల 27వ తేదీన బుక్కపట్నం  మండలంలో ప్రధాన కేంద్రంలో రైతు భరోసా కేంద్రం కార్యాలయ ఆవరణలో ‌ జగనన్నకు చెబుదాం  కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జ‌గ‌న‌న్న‌కు చెబుదాం స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ పి అరుణ్ బాబు  తెలిపారు  

27.9.23 తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని  ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా క‌లెక్ట‌ర్‌, ఇంచార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్‌తోపాటు, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు హాజ‌ర‌వుతార‌ని, మండల, డివిజన్ స్థాయి అధికారులు హాజరు కానున్నారు.ఈ అవ‌కాశాన్ని ప్రజలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.  

స్వచ్ఛతాహి సేవ 2023 ను కార్యక్రమంను జిల్లావ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ దిశగా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 1న " శ్రమదాన్ " చేపట్టి సంపూర్ణ స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను విస్తృత ప్రచారంలో భాగంగా  ప్రజల భాగస్వామ్యంతో అధికారులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విధి విధానాలను జిల్లా పంచాయతీ అధికారి ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.

ఈరోజు స్పందన గ్రీవెన్స్ లో 280 అర్జీలు వచ్చాయి.కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

వినతుల వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి

బత్తలపల్లి మండలం పోట్ల మరి గ్రామ నివాసి బ త్తల రాములమ్మ కు చెందిన సర్వే నెం.353 ఇంటి ప్లాట్ నెం.2 లో ప్రభుత్వం రెండు సెంట్ల పట్టాను మంజూరు చేసిందని,ఆర్డిటి సంస్థ వారు ఇంటిని నిర్మించారని ప్రస్తుతం తన ఇంటికి ప్రహరీ గోడతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం చేయించుకొనుటకు సరిహద్దు కొలతను సర్వేయర్ ద్వారా చేయించుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వినతిని సమర్పించింది.

పెనుగొండ మండలం నాగలూరు బి సి కాలనీకు చెందిన బసిరెడ్డి మరియు సంతోష్ బాబులకు క్రాప్ బుకింగ్ కు సంబంధించి కంది పంటకు గాను నగదు అందలేదని పేర్కొంటూ అర్జీని సమర్పించారు.

కొత్తచెరువు మండలం కేశా పురం గ్రామంలో గత నాలుగు రోజులు నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రెండు వేల మంది గ్రామ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా గ్రామస్తులు శ్రీనాథ్ రెడ్డి, నాగేంద్ర, బాలప్ప రజితమ్మ తదితరులు అర్జెంట్ సమర్పించారు.

ఆమడగూరుకు చెందిన అక్కమ్మకు గతంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పూరి గుడిసె స్థానంలో ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందని ప్రస్తుతం కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించాలని దౌర్జన్యం చేస్తున్నారని ఈ విషయంలో తనకు న్యా చేయవలసిందిగా బాధితురాలు కలెక్టర్ ని కలిసి  అర్జీ సమర్పించింది..

కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి,  సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి

కుందుర్పి పట్టణంలో గురుకుల పాఠశాల నూతన భవనం ఏర్పాటు చేయాలి.. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సావన్

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందుర్పి మండల కేంద్రంలో AISF,TNSF తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.కుందుర్పిలో ఉన్నటువంటి MJP గురుకుల పాఠశాల యొక్క నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్ల మంజూరు చేసింది ఈ యొక్క నూతన భవనాన్ని కుందుర్పి మండల హెడ్ క్వార్టర్ లో కాకుండా కొంత మంది ప్రజాప్రతినిధులు ఒత్తిడి వల్ల మారుమూల గ్రామమైన ఎనుముల దొడ్డిలో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కుందుర్పి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల నూతన భవనం నిర్మాణం చేపట్టాలి అలాకాకుండా ఎనుముల దొడ్డిలో గనక నూతన భవనాన్ని నిర్మాణం చేసినట్లయితే AISF మరియు ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు

డా, బి. ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి...

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఒక నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష  రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు బుక్కరాయసముద్రం మండల నాయకులు పర్వతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, సీనియర్ నాయకులు కేశన్న, బాబయ్య, రెడ్డిపల్లి నాయుడు, నాగేష్ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అబద్దాలతో అభివృద్ధి చంద్రుడిని అడ్డుకోలేవు జగన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబు గారి మీద సీఐడీ పెట్టిన కేసు నూటికి నూరు పాళ్ళూ అక్రమమే. చేసిన ఆరోపణలన్నీ నిరాధారమే. జగన్ రెడ్డి పగ తప్ప, ఈ కేసులో చంద్రబాబు గారి తప్పిదం ఏమీ లేదు. తొందర్లోనే కడిగిన ఆణిముత్యంల, మచ్చలేని చంద్రుడిగా బయటికి వస్తారు. జగన్ రెడ్డి ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని మా అధినాయకుడు పై పెట్టిన అదరడు బెదరడు భయపడడు త్వరలోనే మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు భవిష్యత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతోందిని అసూయతో ఇలాంటి అక్రమ కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని మా అధినాయకునికి అండగా ఉంటామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో నార్పల మండల టీడీపీ నాయకులు, జిల్లా నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,టీడీపీ అనుబంధ సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.