శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ
HYD: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని టిఎస్ ఆర్టీసి బుధవారం ప్రకటించింది. ప్రతి వీకెండ్కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.
ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది.
రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్కు, 8.30 గంటలకు జేబీఎస్కు బస్సు చేరుకుంటుంది.
రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtconline.in లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ సూచించారు.

HYD: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని టిఎస్ ఆర్టీసి బుధవారం ప్రకటించింది. ప్రతి వీకెండ్కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.
ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది.
రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్కు, 8.30 గంటలకు జేబీఎస్కు బస్సు చేరుకుంటుంది.

దామరచర్ల: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించాలని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ అన్నారు.
మండల కేంద్రంలో బుధవారం, గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, గురుకుల పాఠశాలల అన్నిటికీ సొంతభవనాలు నిర్మించాలని, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, పగిడి జీడయ్య యాదవ్, కొంపల్లి రామన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: పట్టణ కేంద్రంలో జే ఎస్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి సదస్సు కు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ విచ్చేసినారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పరిపాలనను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకాన్ని మందకృష్ణ మాదిగ కు నాగం వర్షిత్ రెడ్డి బహికరించారు.
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాల కోసం అర్హులైన అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా...
పీహెచ్డీ గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత మరియు టీఎస్ సెట్ అభ్యర్థులకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడును. అర్హులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష ఈ నెల 26న కళాశాలలో నిర్వహిస్తారని తెలిపారు.
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను, ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని, కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీ డిగ్రీలో 55 శాతం మార్పులు ఉన్న ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు ఉన్నవారు అర్హులు.
యాదాద్రి జిల్లా, నారాయణపురం: మాజీ ఉపసర్పంచ్ మైలారం రాములు తండ్రి ఇటీవల అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, తిరిగి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొన్న టిపిసిసి అధికార ప్రతినిధి, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి బుధవారం మైలారం రాములు నివాసంలో వారి తండ్రిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా: ఆపదలో ఉన్నవారికి తన శక్తి మేరకు సహాయం అందించాలని తపన పడే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ రంగ ప్రవేశం నుండి ఇప్పటివరకు అనేకమంది నిరుపేదలకు కోట్ల రూపాయల సహాయ సహకారాలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్ప నాయకుడు. మరోసారి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల కీ.శే. ఏర్పుల భీమయ్య సతీమణి ఏర్పుల కమలమ్మ బుధవారం మరణించారు. మానవతా దృక్పథంతో బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్పూర్తితో లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పుల కమలమ్మ కుటుంబ సభ్యులకు రూ. 10,000/- ఆర్ధిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్పుల శ్రీశైలం, మేతరి శంకర్, నందికొండ లింగారెడ్డి, కాటగోని రవిశేఖర్, నాగరాజు, చాపల రాజు,ఎర్పుల వెంకటేష్, బుర్కల శేఖర్, చాపల రవి, ఏర్పుల రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Jul 20 2023, 09:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k